- బంగాళదుంపల్ని ఉడకబెట్టి, చల్లారిన తరువాత మెత్తగా చేసి, కొన్ని స్పూన్ల పచ్చిపాలని కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మంపైన మృతకణాలు క్రమంగా పోతాయి. ఈ మాస్క్ని వేసుకోవడం వల్ల మొటిమల సమస్య నుంచీ బయటపడొచ్చు. నల్లమచ్చలు బాధిస్తుంటే పచ్చి బంగాళాదుంపని తురిమి మెత్తగా చేసి మచ్చలపై పెట్టండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మచ్చలు మటుమాయమౌతాయి. - ఒక బంగాళాదుంప ముక్కనీ, అదే సైజులో ఉన్న కీరదోస ముక్కనీ బాగా తురిమి రెంటినీ కలిపేయాలి. అందులో చెంచా వంటసోడా కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది మంచి క్లెన్సర్లా పనిచేస్తుంది. - బంగాళాదుంపని బాగా తురిమి ఒక వస్త్రంలో కట్టి, చివర్లు పట్టుకుని గట్టిగా శరీరానికి ఒత్తితే బంగాళాదుంప రసం బయటకి వస్తుంది. ఈ రసాన్ని మెడకీ, చేతులకీ రాసుకుంటే చర్మం మృదువుగా మారతాయి. |
Pages
▼
No comments:
Post a Comment