
ఈ
కాలం ఇంటా బయట తేమ ఎక్కువగా ఉండటం తో క్రిములు పెరిగి, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు
వస్తుంటాయి. గంధంపొడి, శనగపిండి, పసుపులో సూక్ష్మక్రిములను నశింపజేసే లక్షణాలు
ఉన్నాయి. వీటి వాడకం వల్ల చర్మంపై వాపు, మంట, దురద.. తగ్గడం తో పాటు మొటిమలనూ
నివారిస్తాయి. చర్మకాంతిని పెంచుతాయి.
పచ్చి పసుపు కొమ్ము ను అరగదీసి
దాంట్లో చిటికెడు గంధంపొడి, రోజ్వాటర్ కలిపి ముఖానికి రాసి, ఇరవై నిముషాల తర్వాత
శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని
తీసుకువస్తుంది.
నారింజ లేదా కమలా తొక్కలను ఎండబెట్టి, పొడిచేసి శనగపిండి,
పాలు కలిపి ప్యాక్ వేసుకుంటే ముఖంపై యాక్నె, నల్లమచ్చలు, చర్మం ముడతలు పడటం వంటివి
తగ్గి, మేనికాంతి పెరుగుతుంది.
No comments:
Post a Comment