|
ప్రపంచ యువతను పట్టిపీడిస్తున్న సమస్యలు రెండే రెండు. ఒకటి కొవ్వు. మరోటి డయాబెటీస్. ఈ రెండు సమస్యలు నేటి యువతను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. చదువుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారి చదువుకు తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాళ్ల ముందు వచ్చి వాలుతున్నాయి. ఉద్యోగ శైలి వల్ల ఈ రెండు సమస్యలు చిన్న వయస్సులోనే ఉత్పన్నమవుతున్నాయి.
ఒకప్పుడు వారసత్వంతో సంక్రమించే వ్యాధులు ఇప్పుడు మన జీవన విధానంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వారికి వచ్చేస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు ఈ రెండు సమస్యలపై సుదీర్ఘమైన రీసెర్చ్ చేసి రెండు అతి సులువైన ఉపాయాలను కనుగొన్నారు.
కొమ్మలున్న కూరగాయలు, పళ్లు లాంటివి తీసుకోవడం వలన అవి శరీరంలోని అధికంగా ఉండే కొవు్వను కరిగిస్తాయట. మొక్కల్లోని ఫైటోస్టెరాల్ అనే అణువులు ఇందుకు బాగా దోహదపడతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే రోజుకు మనిషికి 8గంటల నిద్ర అత్యంత అవసరమని పేర్కొంటున్నారు. కానీ ఈ కాలంలో దాని రేషియో 6గంటలకు పడిపోయింది. అయితే వారాంతంలోనైనా తనివితీరా నిద్రపోయి ఈ రెండు గంటలలోటును పూడ్చుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.
వారంలో ఆరు రోజుల్లో రోజుకు రెండు గంటల చొప్పున 12గంటల మైనస్ నిద్ర ఉంటుంది. ఈ 12 గంటలను పదిరోజుల్లో ఎప్పుడైనా ఫిట్ చేసుకోవాల్సిందేనంటున్నారు. అలా చేయడం వల్ల మనం షుగర్ వ్యాధి బారినపడే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం తినాల్సినవి ప్యాక్ చేసుకోండి. హాలీడేస్ రోజుల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గుర్రుగా నిద్రపోండి.
|
|
|
No comments:
Post a Comment