 వడపప్పు, పానకం!
 వడపప్పు, పానకం!
 శ్రీరామచంద్రునికి నైవేద్యం.
 పెసరపప్పును గంటసేపు నానబెడితే చాలు....
 వడపప్పు రెడీ.
 పానకానికి మాత్రం కాస్త కష్టపడాలి.
 ఈ చైత్రంలో... ఈ ఎండల్లో పప్పును, పానకాన్ని సేవిస్తే చలువ.
 వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన వంటల్ని
 రేపటి శ్రీరామనవమి కోసం ఫ్యామిలీ మీకు అందిస్తోంది.  పానకం...  కావలసినవి
 కావలసినవి బెల్లం పొడి - కప్పు
 నీళ్లు - మూడు కప్పులు
 నిమ్మకాయలు - రెండు
 ఎండు అల్లంపొడి - అర టీ స్పూను
 ఏలకుల పొడి - అర టీ స్పూను
 మిరియాల పొడి - అర టీ స్పూను 
 తయారి పెద్ద పాత్రలో బెల్లం పొడి, నీరు వేసి కరిగేదాకా కలపాలి.
 వడపోసి, నిమ్మరసం, ఎండు అల్లంపొడి, ఏలకుల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. 
 అన్నిటినీ బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
 ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. 
 హులీ అవలక్కి  కావలసినవి:
 కావలసినవి:  బియ్యం -  నాలుగు కప్పులు
 నీళ్లు - ఆరు కప్పులు; చింతపండురసం - అరకప్పు
 బెల్లం తురుము - కొద్దిగా; పసుపు - తగినంత
 ఉప్పు - తగినంత
 పోపుకోసం నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
 ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
 పచ్చిశనగపప్పు - టీ స్పూను; ఎండుమిర్చి - పది
 పచ్చిమిర్చి - పది; పల్లీలు - పావు కప్పు
 నువ్వులు - పావు కప్పు; కరివేపాకు - నాలుగు రెమ్మలు 
 తయారి బియ్యాన్ని మూడు గంటల సేపు నానబెట్టి, నీరు వడగట్టి, బియ్యాన్ని ఆరబెట్టాలి. 
కొద్దిగా తడిగా ఉండగా బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా పట్టాలి (అవసరమనుకుంటే జల్లెడపట్టాలి). 
ఒక పాత్రలో చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు, ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి. 
 మందపాటి పాత్రలో ఆరు కప్పులు నీరు పోసి స్టౌ మీద ఉంచాలి. 
మరిగాక బియ్యపురవ్వ వేసి కలపాలి. (రవ్వ పోస్తున్నంతసేపు కలుపుతుండాలి) 
ఉడికిన రవ్వను పెద్ద పాత్రలోకి తిరగదీయాలి.
 స్టౌ మీద బాణలి ఉంచి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
పల్లీలు, నువ్వులు, కరివేపాకు జతచేసి వేయించాలి.
 ఉడికించిన రవ్వలో వేసి కలపాలి. 
చింతపండులో నానబె ట్టి ఉంచుకున్న పదార్థాలను వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
 రెండుమూడు గంటల తర్వాత సర్వ్చేయాలి. 
 క్యారట్ కోసాంబరి  కావలసినవి:
 కావలసినవి:  క్యారట్ తురుము - అర కేజీ; పెసరపప్పు - అర కప్పు; సన్నగా తరిగిన కొత్తిమీర - అర కప్పు; నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; ఉప్పు -తగినంత 
పోపుకోసం: నూనె - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర -  అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు 
 తయారి:  పెసరపప్పును రెండుమూడు గంటలు నానబె ట్టి, నీరు వడగట్టాలి  ఒక పాత్రలో క్యారట్ తురుము, పెసరపప్పు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి  స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి  కరివేపాకు, కొద్దిగా ఇంగువ జతచేసి వేయించాలి  క్యారట్ మిశ్రమంలో వేసి కలపాలి.  చల్లగా సర్వ్ చేయాలి. 
 కోసాంబరి (సలాడ్)  కావలసినవి
 కావలసినవి శనగపప్పు - కప్పు
 పచ్చిమిర్చి - నాలుగు
 అల్లం తురుము - టీ స్పూను
 కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు
 ఉప్పు - తగినంత
 నిమ్మరసం లేదా మామిడికాయ రసం - 3 టీ స్పూన్లు
 పోపు కోసం  నూనె - టీ స్పూను
 ఆవాలు - అర టీ స్పూను
 జీలకర్ర - అర టీ స్పూను
 కొత్తిమీర - కొద్దిగా 
 తయారి శనగపప్పును మూడు నాలుగు గంటలపాటు నానబెట్టాలి. 
 పచ్చిమిర్చి కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా తిప్పాలి. 
ఉప్పు, నిమ్మరసం, కొబ్బరితురుము కలపాలి.
 స్టౌ మీద బాణలి ఉంచి కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
 అన్నిటినీ ఒక బౌల్లో వేసి బాగా కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.