అనుగ్రహం కూడా ఈజీగా లభిస్తుంది. శివా అంటే చాలు... ఉపవాసం ఉన్నా... పూర్తి ఉండలేకపోయినా కూడా... అనుగ్రహిస్తాడు. మీరు ఏమీ తినలేకుండా ఉండ లేరా... అయితే ఈ శివరాత్రి ప్రసాదాలను భక్తితో ఆరగించండి... శివుడి ఆశీస్సులు పొందండి... ఫ్రూట్ దహీ పుచ్చకాయ ముక్కలు - పావు కప్పు అర టిపండు ముక్కలు - పావు కప్పు ద్రాక్ష పండ్లు - పది దానిమ్మ గింజలు - పావు కప్పు పంచదార పొడి - మూడు టీ స్పూన్లు పెరుగు - రెండు కప్పులు తయారి ఒక గిన్నెలో పెరుగు వేసి వెన్న తేలేలా చిలకాలి. పంచదార వేసి బాగా కలపాలి. తరిగి ఉంచుకున్న పండ్ల ముక్కలను వేసి కలుపుకోవాలి. (ఏ పండ్లు అందుబాటులో ఉంటే వాటితో తయారుచేసుకోవచ్చు. ఇష్టపడేవారు ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు) మూంగ్దాల్ - మ్యాంగో పెసరపప్పు - కప్పు వేరుశనగపప్పు (పల్లీలు) - పావు కప్పు మామిడికాయ తురుము - 2 టీ స్పూన్లు పచ్చికొబ్బరి తురుము - రెండు టీ స్పూన్లు కొత్తిమీర - కొద్దిగా ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి) తయారి పెసరపప్పు, వేరుశనగపప్పులను విడివిడిగా మూడు నాలుగు గంటల సేపు నానబెట్టి నీళ్లు వడకట్టాలి. ఒక గిన్నెలో ఈ పప్పులను, పచ్చిమామిడి తురుము, కొబ్బరి తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. ఐదారు నిముషాలు నాననివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. (మామిడికాయ బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు) చిలగడదుంపల స్వీట్ చిలగడదుంపలు - అర కేజీ బెల్లం - పావు కేజీ నెయ్యి - రెండు టీ స్పూన్లు ఏలకుల పొడి - అర టీ స్పూను తయారి చిలగడదుంపల చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. గుండ్రంగా పెద్ద సైజులో ముక్కలు తరగాలి. ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న చిలగడ దుంప ముక్కలు, తురిమిన బెల్లం, కొద్దిగా నీరు వేసి సన్నని మంటపై ఉడికించాలి. దింపే ముందు రెండు టీ స్పూన్ల నెయ్యి, ఏలకుల పొడి వేసి కలపాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి. సేమ్యా దద్ధ్యోదనం సేమ్యా - ఒక కప్పు పెరుగు - 2 కప్పులు పచ్చిమిర్చి - 3 మిరియాల పొడి - కొద్దిగా కరివేపాకు - రెండు రెమ్మలు కొత్తిమీర - కొద్దిగా ఆవాలు - అర టీ స్పూను ఎండుమిర్చి - నాలుగు నెయ్యి - టీ స్పూను ఉప్పు - తగినంత తయారి ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి మరిగించాలి. సేమ్యా వేసి బాగా ఉడికించి దించాలి. నీటిని వడకట్టి, సేమ్యాను చన్నీళ్లలో వేసి పైపైన కదిపి నీళ్లలో నుంచి తీసేయాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, మిరియాలపొడి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో ఉడికించిన సేమ్యా, వేయించి ఉంచుకున్న పోపు, ఉప్పు వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం - ఒక కప్పు పాలు - 4 కప్పులు పంచదార - కప్పు జీడిపప్పు పలుకులు - 15 కిస్మిస్ - గుప్పెడు ఏలకులు - 6 (పొడిచేసుకోవాలి) తయారి సగ్గు బియ్యాన్ని ఆరేడు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి సగ్గుబియ్యాన్ని సన్ననిమంటపై ఉడికించాలి. అడుగు అంటకుండా కలుపుతుండాలి. ఉడికిన తరువాత నాలుగు కప్పుల పాలు పోసి, కొద్దిగా కాగాక పంచదార వేసి రెండు నిముషాలు ఉడికించాలి. చిన్న పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించాలి. ఉడికిన సగ్గుబియ్యం పాయసంలో ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలిపి దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి. చలిమిడి బియ్యం - ఒక కప్పు బెల్లం తురుము - అర కప్పు ఏలకులు - నాలుగు ఎండుకొబ్బరి ముక్కలు - అర కప్పు నెయ్యి - కొద్దిగా తయారి బియ్యాన్ని నీళ్లలో ఆరు గంటలు నానబెట్టి, నీళ్లు వడకట్టి, ఒక పొడి బట్ట మీద నీడలో తడి పోయేవరకు ఆరబెట్టాలి. మిక్సీలో వేసి పిండి చేసుకుని జల్లించుకోవాలి. బెల్లం తురుము పిండిలో వేసి మళ్లీ ఒకసారి మిక్సీలో వేసి కలిసేలా తిప్పుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని ఏలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. ఎండుకొబ్బరి ముక్కలు వేసి కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. చిట్కాలు కొన్నిరకాల పండ్లు మాత్రమే ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అటువంటి వాటిని ఎంచుకుంటే ఫ్రూట్ సలాడ్ రుచిగా ఉంటుంది. కొన్నిరకాల కూరముక్కలు కూడా ఫ్రూట్ సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు. క్యారట్, కీరా వంటివి పండ్లతో కలిసిపోతాయి. ఫ్రూట్ సలాడ్ తయారుచేసుకునేటప్పుడు అందులో రకరకాల ద్రవాలను అభిరుచి మేరకు ఉపయోగించుకోవచ్చు. పెరుగు, పాలు, క్రీమ్, ఎసెన్స్... వంటివి వాడితే రుచిగా ఉండి తేలికగా తినగలుగుతారు. సేమ్యాను కొద్దిగా నేతిలో వేయించి వాడుకుంటే ముద్దలా కాకుండా పొడపొడలాడుతూ వస్తుంది. సగ్గుబియ్యాన్ని కొద్దిసేపు నీటిలో నానబెట్టి, ఉడికించే సమయంలో నెయ్యి వేస్తే, గింజలు అతుక్కుపోకుండా వస్తాయి. చిలగడదుంపల చెక్కు తీయడం వలన మట్టి లేకుండా శుభ్రంగా ఉంటుంది. కర్టెసీ బి.మాధవి మోతీనగర్, హైదరాబాద్ సేకరణ డా.వైజయంతి |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
మహా ప్రసాదం-వంటలు
Thursday, March 7, 2013
మీ ప్రవర్తనే మీ పిల్లలకు గుణపాఠాలు...!
సహజంగా మనం గ్రహించి వుండంగానీ, మన వ్యక్తిత్వంలో చాలా భాగం మన తల్లితండ్రులు మనల్ని పెంచటంలోనే ఏర్పడుతుంది. ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే, మనకున్న అనేక మంచి గుణాలలో చాలావరకు మనం మన తల్లితండ్రులనుండే నేర్చుకున్నాం. తల్లితండ్రులు తమ పిల్లలకు ఈప్రపంచంలో జీవించేందుకు ఎన్నో జీవిత పాఠాలు బోధిస్తారు. ఈ పాఠాలు వారు తమ వ్యక్తిగత అనుభవాలతో పొందుతారు. మీరు కనుక మీ పిల్లలకు కొన్ని అటువంటి జీవిత పాఠాలు బోధించాలని తలిస్తే అది అతని చిన్నతనంలోనే చెప్పండి.పిల్లలు చాలా విషయాల్ని పెద్దల్ని అనుకరిస్తూ తెలుసుకొంటారు. అందుచేత తల్లితండ్రులు వాళ్లకి ఆదర్శప్రాయంగా ఉండి వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. అవేమిటో చూద్దాం...
1. ప్రతీరోజూ నిద్రలేచిన తరువాత, రాత్రి పడుకోబోయే ముందు పళ్లను శుభ్రంగా తోముకోవడం నేర్పించాలి. పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఆహారపు అలవాట్లను క్రమేపీ అభివృద్ధి చేయాలి.
2. పాలు తాగేటప్పుడూ, ఏదైనా తినేటప్పుడూ ఏవో ఆంక్షలు పెట్టి వారిని నివారించకూడదు.
3. అతిధుల ముందు ఎట్లా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పాలి.
4. భోజనం చేసేటప్పుడు నేలమీద కాని, టేబుల్పైనగాని ఎట్లా జాగ్రత్తగా కూర్చోవాలో పిల్లలకు నేర్పాలి.
1. ప్రతీరోజూ నిద్రలేచిన తరువాత, రాత్రి పడుకోబోయే ముందు పళ్లను శుభ్రంగా తోముకోవడం నేర్పించాలి. పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఆహారపు అలవాట్లను క్రమేపీ అభివృద్ధి చేయాలి.
2. పాలు తాగేటప్పుడూ, ఏదైనా తినేటప్పుడూ ఏవో ఆంక్షలు పెట్టి వారిని నివారించకూడదు.
3. అతిధుల ముందు ఎట్లా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పాలి.
4. భోజనం చేసేటప్పుడు నేలమీద కాని, టేబుల్పైనగాని ఎట్లా జాగ్రత్తగా కూర్చోవాలో పిల్లలకు నేర్పాలి.
5. స్వీట్స్, ఐస్క్రీములూ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కాని అవి వారి ఆరోగ్యానికి మంచివి కావు. పిల్లలు తీపిపదార్థాల్ని ఎంత తక్కువ తింటే అంతమంచిది. తల్లులే ఇంట్లో జంతికలు లాంటివి తయారుచేస్తే వాళ్లకు ఇష్టంగానూ ఉంటుంది. ఆరోగ్యంగానూ ఉంటుంది. వారు పప్పును, ఆకుకూరలను ఎక్కువగా తినేటట్లు చేయాలి.
6 పిల్లలకు చిరుతిళ్లు ఎక్కువ ఇష్టం అని మీరు కొని తేవద్దు. వాళ్లు కూడా కొనుక్కోకుండా చూడాలి. తింటే వ్యాధులొస్తాయని, అవి తినడం వల్ల ఎదుర్కొనే ప్రమాదాలేమిటో నచ్చచెప్పాలి.
7. ఏ సీజన్లో దొరికే పళ్లు ఆ సీజన్లో తినడం ఆరోగ్యదాయకం. పండ్లు ఎక్కువగా తినే అలవాటు చేయండి.
8 . పిల్లలు ఆహారాన్ని మెత్తగా నమిలితినాలి. పాలను కూడా నెమ్మదిగానే తాగాలి.
9. పిల్లలు ఒక్కొక్కసారి చాలా అల్లరి చేస్తారు. పెద్దలకు చిరాకు కలిగినా, వారిని తిట్టి కొట్టకూడదు. కారణమేదో తెలిసికొని వారిని మెల్లగానే మందలించాలి.
10. పిల్లల్ని క్రమశిక్షణలో పెడ్తున్నామనుకొని కొందరు తరచు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతీ చిన్న విషయానికీ దండించకూడదు. అలాంటి పిల్లలు అమాయకులుగా తయారౌతారు.
11. ఒకే ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్నప్పుడు వారి మధ్య తగాదాలు రావడం సహజం. తల్లిదండ్రులు వాళ్లని బుజ్జగిస్తూ, వారితో విడివిడిగా కొంచెంసేపు గడుపుతూ ఉండాలి. వారి మధ్య స్నేహభావం పెరిగేలా చూడాలి.
12. పిల్లలు పెంపుడు జంతువులను తాకకుండా ఉండేటట్లు దూరంగా ఉంచండి.
13. ఆ స్విచ్ వేయి, ఈ స్విచ్ని కట్టేయి అని మీ పిల్లలకు పనులను పురమాయించకండి. కరెంట్ వస్తువుల దగ్గరకు వాళ్లను అసలు పోనీయకండి.
14. నాణాలను, చిన్నచిన్న వస్తువుల్నీ చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి. వాళ్లు వాటిని మింగే ప్రమాదముంది.
15. పిల్లల్ని సరైన సమయానికి స్కూలుకు పంపి, స్కూలు అయిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చేటట్లు చూడాలి. రోడ్పై నడిచేటప్పుడు ఫుట్పాత్పైనే నడవాలనీ, అక్కడ పరుగులు పెట్టకూడదని పిల్లలకు చెప్పాలి.
16. యూనిఫామ్ను, బూట్లు, టై ధరించడాన్ని పిల్లలు ఎవరికివారే చేసుకొనేటట్లు చూడాలి. అందువల్ల తల్లిదండ్రులకి కొంత శ్రమ తగ్గుతుంది. వారికి కూడా తమ పనులు తాము చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసం వస్తుంది.
6 పిల్లలకు చిరుతిళ్లు ఎక్కువ ఇష్టం అని మీరు కొని తేవద్దు. వాళ్లు కూడా కొనుక్కోకుండా చూడాలి. తింటే వ్యాధులొస్తాయని, అవి తినడం వల్ల ఎదుర్కొనే ప్రమాదాలేమిటో నచ్చచెప్పాలి.
7. ఏ సీజన్లో దొరికే పళ్లు ఆ సీజన్లో తినడం ఆరోగ్యదాయకం. పండ్లు ఎక్కువగా తినే అలవాటు చేయండి.
8 . పిల్లలు ఆహారాన్ని మెత్తగా నమిలితినాలి. పాలను కూడా నెమ్మదిగానే తాగాలి.
9. పిల్లలు ఒక్కొక్కసారి చాలా అల్లరి చేస్తారు. పెద్దలకు చిరాకు కలిగినా, వారిని తిట్టి కొట్టకూడదు. కారణమేదో తెలిసికొని వారిని మెల్లగానే మందలించాలి.
10. పిల్లల్ని క్రమశిక్షణలో పెడ్తున్నామనుకొని కొందరు తరచు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతీ చిన్న విషయానికీ దండించకూడదు. అలాంటి పిల్లలు అమాయకులుగా తయారౌతారు.
11. ఒకే ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్నప్పుడు వారి మధ్య తగాదాలు రావడం సహజం. తల్లిదండ్రులు వాళ్లని బుజ్జగిస్తూ, వారితో విడివిడిగా కొంచెంసేపు గడుపుతూ ఉండాలి. వారి మధ్య స్నేహభావం పెరిగేలా చూడాలి.
12. పిల్లలు పెంపుడు జంతువులను తాకకుండా ఉండేటట్లు దూరంగా ఉంచండి.
13. ఆ స్విచ్ వేయి, ఈ స్విచ్ని కట్టేయి అని మీ పిల్లలకు పనులను పురమాయించకండి. కరెంట్ వస్తువుల దగ్గరకు వాళ్లను అసలు పోనీయకండి.
14. నాణాలను, చిన్నచిన్న వస్తువుల్నీ చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి. వాళ్లు వాటిని మింగే ప్రమాదముంది.
15. పిల్లల్ని సరైన సమయానికి స్కూలుకు పంపి, స్కూలు అయిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చేటట్లు చూడాలి. రోడ్పై నడిచేటప్పుడు ఫుట్పాత్పైనే నడవాలనీ, అక్కడ పరుగులు పెట్టకూడదని పిల్లలకు చెప్పాలి.
16. యూనిఫామ్ను, బూట్లు, టై ధరించడాన్ని పిల్లలు ఎవరికివారే చేసుకొనేటట్లు చూడాలి. అందువల్ల తల్లిదండ్రులకి కొంత శ్రమ తగ్గుతుంది. వారికి కూడా తమ పనులు తాము చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసం వస్తుంది.
ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ తో పురుషుల చిరుబొజ్జ ఇట్టే మాయం...!
ఇండియన్ వంటకాలు వెరీ రిచ్ అని చాలా మంది నమ్ముతారు. అందుకు కారణం వీటిలో బరువు తగ్గించే గుణాలు ఎక్కువని. చాలా వరకు ఇండియన్ వంటకాలను ఎక్కువ మసాలా దినుసులతోనూ మరియు బట్టర్(ప్యురిఫైడ్ నెయ్యి)తో తయారు చేస్తారు.
నన్ను ఒక నిజాన్ని చెప్పనియ్యండి, చాలా వరకూ ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని ఆరోగ్యకరమైన ఇండియన్ ఫుడ్స్ బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అంతే కాదు అవి తినడం వల్ల బరువు తగ్గించడంతో పాటు మన శరీరానికి కావల్సి న్యూట్రిషయిన్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా అంధిస్తాయి.
కాబట్టి ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే వాటిని సెలక్ట్ చేసుకొని మరీ ఉపయోగించడం వల్ల బరువు తగ్గించే ప్రయోజనాలు కూడా మెండుగా కనబడుతాయి. మసాలా దినుసుల ఎంపిక మాత్రమే కాదు వాటిని ఏవిధంగా, ఏఏ వంటకాల్లో ఉపయోగించాలో తెలుసుకోవాలి.
సాధారణంగా పురుషులు జిమ్ కు వెళితేనే బరువు తగ్గించుకోవచ్చు అని అనుకుంటుంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. జిమ్ బరువు తగ్గించుకొనే మార్గాల్లో ఒకటి మాత్రమే.
కాబట్టి ప్రతి రోజూ తీసుకొని ఆహారంలో హెల్తీ మరియు లో ఫ్యాట్ డైయట్ తీసుకోవడం వల్ల కొన్ని పౌండ్లను బరువును తగ్గించుకోవచ్చు.
అందుకు మంచి రుచికోసం ఆలివ్ ఆయిల్ లేదా లోఫ్యాట్ సోయా మిల్క్ తీసుకోనక్కర లేదు.
అంత కంటే తక్కువ కరీదైన ఆహారాలు వెల్లుల్లి, మెంతిఆకు కూర, పసుపు, మస్టర్డ్ ఆయిల్, వంటివి మీ వెయిట్ లాస్ డయట్ లో చేర్చుకోవచ్చు.
మన ఇండియాలో చాలా మంది పురుషులు బెల్లీ ఫ్యాట్(చిరు బొజ్జ)కలిగి ఉన్నారు. అటువంటి వారు పొట్ట తగ్గించికొని ఆరోగ్యంగా స్లిమ్ గా మార్చే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. మరి ఆ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...
నన్ను ఒక నిజాన్ని చెప్పనియ్యండి, చాలా వరకూ ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని ఆరోగ్యకరమైన ఇండియన్ ఫుడ్స్ బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అంతే కాదు అవి తినడం వల్ల బరువు తగ్గించడంతో పాటు మన శరీరానికి కావల్సి న్యూట్రిషయిన్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా అంధిస్తాయి.
కాబట్టి ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే వాటిని సెలక్ట్ చేసుకొని మరీ ఉపయోగించడం వల్ల బరువు తగ్గించే ప్రయోజనాలు కూడా మెండుగా కనబడుతాయి. మసాలా దినుసుల ఎంపిక మాత్రమే కాదు వాటిని ఏవిధంగా, ఏఏ వంటకాల్లో ఉపయోగించాలో తెలుసుకోవాలి.
సాధారణంగా పురుషులు జిమ్ కు వెళితేనే బరువు తగ్గించుకోవచ్చు అని అనుకుంటుంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. జిమ్ బరువు తగ్గించుకొనే మార్గాల్లో ఒకటి మాత్రమే.
కాబట్టి ప్రతి రోజూ తీసుకొని ఆహారంలో హెల్తీ మరియు లో ఫ్యాట్ డైయట్ తీసుకోవడం వల్ల కొన్ని పౌండ్లను బరువును తగ్గించుకోవచ్చు.
అందుకు మంచి రుచికోసం ఆలివ్ ఆయిల్ లేదా లోఫ్యాట్ సోయా మిల్క్ తీసుకోనక్కర లేదు.
అంత కంటే తక్కువ కరీదైన ఆహారాలు వెల్లుల్లి, మెంతిఆకు కూర, పసుపు, మస్టర్డ్ ఆయిల్, వంటివి మీ వెయిట్ లాస్ డయట్ లో చేర్చుకోవచ్చు.
మన ఇండియాలో చాలా మంది పురుషులు బెల్లీ ఫ్యాట్(చిరు బొజ్జ)కలిగి ఉన్నారు. అటువంటి వారు పొట్ట తగ్గించికొని ఆరోగ్యంగా స్లిమ్ గా మార్చే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. మరి ఆ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...
వెల్లుల్లి: వెల్లుల్లిల్లో క్రొవ్వు కరిగించే గుణాలు అలిసిన్ పుష్కలంగా ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. కాబట్టి పురుషులు ఈ ఇండియన్ స్పైసీ వెల్లుల్లిని రెగ్యులర్ గా తింటే శరీర బరువును తగ్గించుకొని, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
గుడ్డు: పురుషులు వారి డైలీ డయట్ లో తప్పని సరిగా గుడ్డును చేర్చుకోవాలి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి గుడ్డు బాగా సహాయపడుతుంది. క్రొవ్వు నిల్వలను కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె): బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి.
జొన్నలు: ఇది మరొక ఆరోగ్యకరమైన ఇండియన్ గ్రెయిన్. ఇందులో కొవ్వు తగ్గించే గుణాలు ఎక్కువ. వీటిని ఎక్కువగా రాజస్తాన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు . ఈ భారతదేశపు చిరు ధాన్యం శరీర బరువును తగ్గించడమే కాదు ఆకలిని కూడా దూరం చేస్తుంది.
పెసరపప్పు: ఈ పసుపు వర్ణంలో ఉండే పప్పు ధాన్యం చాలా ఆరోగ్యకరం మరియు డైటర్స్ కు ఇది పౌష్టికాహారం. పెసరపప్పులో విటమిన్ ఎ, బి, సి మరియు ఇ, ప్రోటీనులు మరియు ఫైబర్ అధికంగా ఉండి, హైబ్లడ్ ప్రెజర్ ను మరియు హై కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
మజ్జిగ: పురుషులకు ఇది ఆరోగ్యకరం మాత్రమే కాదు బరువు తగ్గించే ప్రోటీన్ డ్రింక్. జిమ్ లేదా ఇంట్లో వ్యాయామం చేసిన తర్వాత ఇక గ్లాసు వెన్నతీసిన మజ్జిగ త్రాగడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. శరీరాన్ని తేమగా ఉంచుకోవడంతో పాటు శరీరంలో నిల్వ ఉన్న మలినాలను తొలగించుకోవచ్చు. కాబట్టి లోఫ్యాట్ పెరుగు ను తీసుకోవడం వల్ల లోక్యాలరీస్ కలిగి ఉంటుంది.
సిట్రస్ పండ్లు: పురుషులు కొన్ని ఆరోగ్యకరమైన మరియు ఫ్యాట్ బర్నింగ్ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. సిట్రస్ పండ్లు నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష వంటివి ఫ్యాట్ బర్నింగ్ ఫ్రూట్స్ . ఎందుకంటే వీటిలో అధికంగా ఫైబర్ మరియు విటమిన్ సి ఉండి క్రొవ్వు నిల్వలను కరిగించడానికి సహాయపడుతుంది.
కరివేపాకు: బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతగా పనిచేసే హెర్బ్స్ లో ఇది ఒకటి. ఈ కరివేపాకు ఆకులు జీర్ణక్రియను క్రమబద్దంచేయడానికి మరియు జీవక్రియలు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను తొలగిస్తుంది.
యాలకులు: సువసన భరితమైన ఈ యాలకలు బరువు తగ్గించడంలో ఉపయోగిస్తారు . దీన్ని వివిధ రకాల వంటకాల్లో మంచి ఫ్లేవర్ కోసం వినియోగిస్తారు. ఇది శరీర జీవక్రియలను మెరుగు పరిచి, నోటి దుర్వాసను దూరం చేస్తుంది.
గోధుమలు: గోధమలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు అత్యధిక పోషకాహారం కూడా. ఇందులో ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నాయి. లోక్యాలరీస్ కలిగిన ఈ గోధుమలతో తయారైయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.
ఈ మసాజ్ ఆయిల్స్ ఉండగా..చర్మం నల్లబడుతుందనే భయమెందుకు...?
అందం విషయంలో ఫెయిర్ స్కిన్ కలిగి ఉండటం ఒక బెచ్ మార్క్ ఉంది. ఎందకంటే, చర్మం రంగును బట్టి జాతివివక్షత మరియు గతంలో వివక్షత కారణంగా ఉంది.. కృతజ్ఞతగా, విషయాలు (చర్మ రంగును బట్టి జాతి వివక్షతను)ఆధునిక కాలంలో మార్చారు.
మిల్కీ వైట్ కలర్ కలిగి ఇండటం ఇకపై అందం యొక్క సమాహారం. బ్రౌన్ లేదా టాన్ చర్మం తత్వాన్ని గ్లామర్ పరంగా ఇప్పుడు చూస్తే ఫెయిర్ రంగును భర్తీ చేస్తోంది.మన ఒంటి ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ.
ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్టాన్ (చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు.
అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్టాన్ లోషన్ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలిశరీరంలో ఎటువంటి ఆచ్ఛాదనా లేని అవయవాలు అంటే ముఖం, చేతులు మొదలైనవి సూర్యతాపానికి గురయ్యే అవకాశం ఉంది.
ఎండలో తిరిగినప్పుడు చర్మంలో నలుపుదనానికి కారణమయ్యే మెలనిన్ పొర ఆచ్ఛాదనలేని భాగాలకు చేరి క్రమేపీ ఆ భాగాలు కూడా నల్లగా మారతాయి.
దీనినే సన్టాన్ అంటారు.
ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మంచి బ్రాండ్కు చెందిన సన్స్క్రీన్ లోషన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి 15 లేదా 20 నిమిషాల ముందుగా ముఖం, మెడ, చేతులు... ఎండ ప్రభావానికి గురయ్యే భాగాలకు రాసుకుని అప్పుడు వెళ్లడం మంచిది.అయితే మనం రాసుకునే లోషన్ 3 లేదా 4 గంటలు మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోండి.
అలాగే పడుకోబోయే ముందు కోజిక్ యాసిడ్, అర్బుటిన్ వంటి వాటిని కలిగి ఉండే క్రీమును ముఖానికి రాసుకోవాలి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ప్రతి పదిహేనురోజులకు ఒకసారి గ్లైకాలిక్ పీల్స్ అప్లై చేయడం మంచిది.
ఈ జాగ్రత్తలతోబాటు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టమోటాలు, తాజాకూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం అవసరం. చర్మ రంగును కాపాడుకోవడానికి వీటితో పాటు కొన్ని సన్ టాన్ ఆయిల్స్ ఉన్నాయి.
అవి ఏవిధంగా ఉపయోగపడుతాయో ఒక సారి చూద్దాం...
మిల్కీ వైట్ కలర్ కలిగి ఇండటం ఇకపై అందం యొక్క సమాహారం. బ్రౌన్ లేదా టాన్ చర్మం తత్వాన్ని గ్లామర్ పరంగా ఇప్పుడు చూస్తే ఫెయిర్ రంగును భర్తీ చేస్తోంది.మన ఒంటి ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ.
ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్టాన్ (చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు.
అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్టాన్ లోషన్ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలిశరీరంలో ఎటువంటి ఆచ్ఛాదనా లేని అవయవాలు అంటే ముఖం, చేతులు మొదలైనవి సూర్యతాపానికి గురయ్యే అవకాశం ఉంది.
ఎండలో తిరిగినప్పుడు చర్మంలో నలుపుదనానికి కారణమయ్యే మెలనిన్ పొర ఆచ్ఛాదనలేని భాగాలకు చేరి క్రమేపీ ఆ భాగాలు కూడా నల్లగా మారతాయి.
దీనినే సన్టాన్ అంటారు.
ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మంచి బ్రాండ్కు చెందిన సన్స్క్రీన్ లోషన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి 15 లేదా 20 నిమిషాల ముందుగా ముఖం, మెడ, చేతులు... ఎండ ప్రభావానికి గురయ్యే భాగాలకు రాసుకుని అప్పుడు వెళ్లడం మంచిది.అయితే మనం రాసుకునే లోషన్ 3 లేదా 4 గంటలు మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోండి.
అలాగే పడుకోబోయే ముందు కోజిక్ యాసిడ్, అర్బుటిన్ వంటి వాటిని కలిగి ఉండే క్రీమును ముఖానికి రాసుకోవాలి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ప్రతి పదిహేనురోజులకు ఒకసారి గ్లైకాలిక్ పీల్స్ అప్లై చేయడం మంచిది.
ఈ జాగ్రత్తలతోబాటు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టమోటాలు, తాజాకూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం అవసరం. చర్మ రంగును కాపాడుకోవడానికి వీటితో పాటు కొన్ని సన్ టాన్ ఆయిల్స్ ఉన్నాయి.
అవి ఏవిధంగా ఉపయోగపడుతాయో ఒక సారి చూద్దాం...
మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె): సాధారణంగా మస్టర్డ్ ఆయిల్ చర్మాన్ని నల్లబరుస్తుంది. మస్టర్డ్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేసి సూర్య రశ్మిలో పడుకోవడం వల్ల ఎముకలకు కీలక పోషకంగా మరియు చర్మానికి విటమిన్ డి అందించడానికి సహాయపడుతుంది. అందువల్లే, చిన్న పిల్లల ఎముకలు బలోపేతం చేయడానికి వారి శరీరాన్ని ఆవనూనెతో మసాజ్ చేస్తారు.
సన్ ఫ్లవర్ఆయిల్: సన్ ఫ్లవర్ ఆయిల్ తో శరీరాన్ని లేదా ముఖానికి మసాజ్ చేయడం వల్ల సూర్యరశ్మి వల్ల ఏర్పడే ముడతలను నివారిస్తుంది.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ గ్రంధుల పునరుత్పత్తి ఈ విటమిన్ చాలా బాగా సహాయపడుతుంది. సూర్యతాపానికి గురైన మీ చర్మాన్ని రక్షించడానికి ఈ ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం ఒక ఉత్తమైన మార్గం. ఈ ఆలివ్ నూనె కు అయోడిన్ ద్రావణంను మిక్స్ చేసి తర్వాత చర్మానికి అప్లై చేయడం వల్ల సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను ఒక లేపనంగా ఉపయోగిస్తారు. సన్ స్క్రీన్ లోషన్ లో భాగంగా ఉపయోగిస్తారు. మీరు కనుక అతి సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నట్లైతే, సన్ టానింగ్ ను నిరోధించలేదు. అందుకు సున్నిత చర్మం కలవారు సూర్య తాపం పొందడానికి, అలెర్జీ, చర్మ దద్దుర్లు పొందడానికి ముందే కొబ్బరి నూనె తో తయారు చేసిన సన్ స్క్రీన్ లోషన్ లేదా కొబ్బరి నూనె ను చర్మానికి మసాజ్ చేయాలి.
గోధుమ నూనె: గోధుమ గింజలతో తయారు చేసే ఆయిల్ ఇది చాలా ఆరోగ్యకరమైన సహజ నూనె. ఇందులో విటమిన్ ఇ, డి మరియు ఎ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆయిల్ చర్మాన్ని సున్నితంగా మార్చి సూర్య రశ్మి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
అవకాడో ఆయిల్: సూర్య రశ్మిలో ఎక్కువ సమయం గడపటం వల్ల చర్మ పొడిబారుతుంది. నల్లగా మారుతుంది. కాబట్టి అవకాడు నూనె చర్మాన్ని తేమగా ఉంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పంటి నొప్పి సమస్యకు తక్షణ ఉపశమనం కలిగించే ఔషధాలు...! Read more at: http://telugu.boldsky.com/health/wellness/2013/home-remedies-toothache-005518.html
పంటి నొప్పి (Tooth Ache): పంటి పై ఉండే గారలో బాక్టీరియా నివాసముండి, నోటిలో ఉన్నా తీపిపదర్దాములను , పిందిపదర్దాములను తినడం వలన ఏర్పడే ఆమ్లాలు పంటి ఏనామేల్ పై దెబ్బతీయును. తద్వారా ఏనామేల్ పాడవడం వలన ఇన్ఫెక్షన్... పంటి నరాలు, మూలభాగము (root of Tooth)లో చేరి కణజాలము, నాడులు చెడిపోవడం వలన పంటి నొప్పి కలుగుతుంది.
పంటి నొప్పి అనేది సాధారణంగా కనిపించినా రోజు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది. మనలో చాలా మందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. పంటి నొప్పి నివారణకు ఇంట్లో చేసే పరిష్కారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉత్తమమైన పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలుసుకొందాం...
పంటి నొప్పి అనేది సాధారణంగా కనిపించినా రోజు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది. మనలో చాలా మందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. పంటి నొప్పి నివారణకు ఇంట్లో చేసే పరిష్కారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉత్తమమైన పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలుసుకొందాం...
లవంగ నూనె: మీరు లవంగాలను పంటి నొప్పి ఉన్న చోట పెట్టి సుమారు 4-6 గంటలు ఉంచితే తిమ్మిరి కలిగి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.లవంగాలకు చిన్న ముళ్ళు ఉంటాయి కంగారుపడవద్దు.
వెల్లుల్లి: వెల్లుల్లి, లవంగంలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది.
మాత్ర: నొప్పిని తగ్గించే మాత్రను తీసుకోని పొడి చేసి నోటిలో వేసుకొని తర్వాత మీ నోటిలోని లాలాజలంతో మిక్స్ చేసి పుక్కిలించి ఊయాలి. ఈ విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి చేయాలి.
వెనిలా రసం లేదా నూనె: వెనిలా సారంను నేరుగా పోయడం ద్వారా,లేదా 3 నుండి 4 చుక్కలు కాటన్ లో వేసి పంటి నొప్పి ఉన్న ప్రదేశంను శుభ్రపరచడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.
హైడ్రోజెన్ పెరాక్సైడ్: 6 ఔన్సుల వెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఉప్పును కలిపి దానిని నోటిలో పోసుకొని పుక్కిలించి ఊయాలి.ఉప్పు వలన గొంతు లేదా ఇబ్బందికి గురిచేసే చిగుళ్ళ వల్ల వచ్చే పంటి నొప్పి కి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.
విక్స్: కాగితపు టవల్ పై విక్స్ ని రాసి నొప్పి ఉన్న దవడ ప్రాంత చర్మంపై రాయాలి.
కఫ్ సిరఫ్: హాల్స్ దగ్గు డ్రాప్స్ లో కొంచెం మత్తు ఉంటుంది. వాటిని నోటిలో వేసుకొని చప్పరిస్తే నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది.
వీట్ గ్రాస్ జ్యూస్: గోధుమ గడ్డి రసం దంత క్షయం కోసం ఒక మౌత్ వాష్ ఉపయోగిస్తారు. మీ చిగుళ్ళ నుండి విషక్రిములు బయటకు పంపటానికి సహాయపడుతుంది, మరియు బ్యాక్టీరియా అభివృద్దిని ఆపుతుంది.
ఐస్ ముక్క: కనీసం 15-20 నిమిషాల పాటు రోజుకి 3 నుండి 4 సార్లు బాధాకరంగా ఉన్న దంతం చెంప మీద ఐస్ క్యూబ్లను ఉంచితే కొంత నొప్పి తగ్గుతుంది.
బ్లాక్ పెప్పర్: మీ చిగుళ్ళ మీద మిరియాల పొడితో రుద్దడం వల్ల వెంటనే ఆ ప్రాంతం తిమిరిగా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఉల్లిపాయ: పచ్చి ఉల్లిపాయ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండుట వల్ల దానిని 3 నిముషాలు నమిలితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నములుట కష్టంగా ఉంటె అప్పుడే కోసిన ఉల్లిపాయ ముక్కను పెట్టుకోవచ్చు.
విస్కీ: 3 నుండి 4 చుక్కల విస్కీని కాటన్ లో వేసి పంటి నొప్పి ఉన్నచోట నొక్కి పెట్టితే కొంత సేపటికి ఆ ప్రాంతంలో తిమ్మిరి కలిగి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
బ్రష్: బోజనం చేసిన తరువాత, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి ఉప్పు కలిపిన నీటిని పుక్కిలించాలి.
Subscribe to:
Posts (Atom)