all

Wednesday, December 26, 2012

మీ అనారోగ్యానికి భరోసా ఈ పోపుల పెట్టే...


మన వంటగది కేవలం వండివార్చాడానికి మాత్రమే కాదు..ఇది అనేక ఔషధాల నిలయం. దేహంలో చోటు చేసుకునే ఎన్నో అనారోగ్యాలకు నివారణకు, చికిత్సలూ అన్నీ పోపుదినుసులతోనే చేయవచ్చు. ఔషధాల నిలయమైన మన పోపుల పెట్టెతో తగ్గించుకునే కొన్ని అనారోగ్య సమస్యలను తెలుసుకుందాం..

వంట గదిలో ఉండే పదార్థాల విలువ తెలుసుకుంటే అనారోగ్యం దరికే చేరదు. కానీ మనకంత ఆవసరం వుండదు. వంట చేయాలంటే చాలు మన చేతిలో వుండేది పోపులపెట్టె. ప్రతినిత్యం పోపులపెట్టెను, అందులోని దినుసులను వాడుతూనే వుంటాం. కానీ ఏదో పూర్వకాలం నుండీ పెద్దలు వాడుతున్నారు కనుక వాడతాం తప్ప పోపులపెట్టెలోని సరుకుల గురించి, వాటిలో దాగున్న ఔషధ గుణాల గురించి పెద్దగా పట్టించుకోం. ఒకసారి ఆ సుగుణాలను తెలుసుకుంటే పోపు దినుసుల వాడకాన్ని మరింత పెంచుతాం. ఏదో మొక్కుబడిగా కాకుండా గుర్తుంచుకుని మరీ శ్రద్ధగా కూరల్లో వేస్తాం. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటాం. మరవేంటో చూద్దామా?!


పోపుల పెట్టె కాదు...ఆరోగ్యపు చిట్ట...!

వెల్లుల్లి గుండెకు నేస్తం: పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి.

 

అల్లం పైత్యానికి విరుగుడు: అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.




 

కుంకుంపువ్వు అందం ఆరోగ్యం: ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.




చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
 



లవంగాలు శ్వాసకు మేలు: లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.



 

పచ్చి ఏలకులు: ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.


ఆవాలు: ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.




 
జీర్ణశక్తికి జీలకర్ర: జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.
 


 
మిరియాలు: ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.


మెంతులు: పచ్చిమెంతుల పొడి ప్రతిరోజు 10 లేదా 15 గ్రాములు తింటే మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది. ప్రసవం అనంతరం వచ్చే నొప్పులు మెంతులు వేయించి బెల్లంతో కలిపి ఇస్తే నొప్పులు తగ్గుతాయి. బాలింతలకు పాలు బాగా పడతాయి. మెంతులలో చక్కెర కలిపి తినిపిస్తే బరువు తగ్గిన పిల్లలు మామూలుగా తయారవుతారు. మెంతులు నూరి తలకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాక శిరోజాలు బాగా పెరుగుతాయి.





 
గసగసాలు: గసగసాలను ఒక గంట వేడినీటిలో నానబెట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది. మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు ఈ కషాయం పుక్కిలిస్తే వాపు నొప్పి తగ్గిపోతుంది.





ధనియాలు: కాచి చల్లార్చిన నీటిలో ధనియాలపొడివేసి రెండు గంటలు నానబెట్టి తాగిస్తే విషజ్వరాలు ఇట్టే తగ్గుతాయి. జలుబు, దగ్గులకు ధనియాల చారు మంచిది.

 

 

Tuesday, December 25, 2012

మార్గశిర లక్ష్మీపూజతో బంగారు కాసులు


"మహా దేవ్యైచ విధ్మహే
విష్ణు పత్నీచ ధీమహీ
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్"

"నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహీ
తన్నో విష్ణు: ప్రచోఅదయాత్"





ద్వాపరయుగంలో సౌరాష్ట్రలో శ్రవణుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడూ, వేదాలు, శాస్త్రాలు , పురాణాలు చదివినవాడు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుని చిత్తశుద్ధితో పరిపాలించేవాడు. శ్రవణుడి భార్య సురత చంద్రిక. ఆమె కూడా ఉత్తమురాలు. గొప్ప భక్తురాలు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ఆ రాజు పాలనలో ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు.

ఇదిలావుండగా, ధనధాన్యాలిచ్చే లక్ష్మీదేవి సౌరాష్ట్రకు వెళ్ళాలని, రాజును, ప్రజలను దీవించాలని నిర్ణయించుకుంది. లక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో రాజభవనానికి వెళ్ళింది. అక్కడ మహారాణి దగ్గర పనిచేసే దాసీ ''ఎవరమ్మా నువ్వు?” అనడిగింది.

''నేను మహారాణిని కలవడానికి వచ్చాను. ఆమె క్రితం జన్మలో ఒక పేద వైశ్యుని భార్య. ఆ పేదరాలు ఒకరోజు అంతులేని నిరాశతో ఇళ్ళు విడిచి నడుస్తూ వెళ్ళి అడవి చేరింది. అక్కడ ఆకలితో అలమటిస్తూ, చలికి తాళలేక తిరగసాగింది.

అది చూసిన లక్ష్మీదేవి ఆమెమీద జాలితో మామూలు స్త్రీగా కనిపించి ''మార్గశిర లక్ష్మీదేవి పూజ చేసుకోమని'' చెప్పింది. దాంతో ఆమె వెంటనే ఇల్లు చేరి ఆ పూజ చేసింది. వెంటనే వారి కష్టాలు తీరాయి. ఆ ఇళ్ళు సంపదలతో తులతూగింది...'' అంటూ చెప్పింది.

దాసి వెళ్ళి మహారాణితో అదంతా చెప్పింది. రాణీకి ఆ మాటలు ఎంతమాత్రం నమ్మశక్యంగా తోచలేదు. ''ఈవిడెవరో పబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్పింది'' అనుకుని ఆ వృద్ధ స్త్రీని కలవనేలేదు. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి నగరం విడిచి వెళ్ళిపోడానికి సిద్ధమైంది.

ఈ సంగతి తెలిసిన రాకుమారి పరుగున వెళ్ళి వృద్ధస్త్రీని నిలవరించింది. ''మా అమ్మను క్షమించు తల్లీ! మార్గశిర లక్ష్మీ పూజ నేను చేస్తాను'' అంటూ వేడుకుంది. చెప్పినట్లుగానే లక్ష్మీపూజ ఎంతో నమ్మకంతో భక్తిగా చేసింది. లక్ష్మీదేవి సంతోషించింది. ఆ రాకుమారికి ధీరుడు, వీరుడు అయిన రాజుతో వివాహం జరిగింది.

కొంతకాలానికి సౌరాష్ట్ర రాజు శ్రవణుడికి కష్టకాలం దాపురించింది. వర్షాభావంతో పంటభూములు బీడుల్లా మారాయి. విపరీతమైన కరవు వచ్చింది.

మహారాణి సలహా మేరకు, శ్రవణుడు కూతురి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఎంతో సానుభూతి చూపి ఒక పాత్ర నిండా బంగారు కాసులు నింపి, మాత బిగించి తండ్రికిచ్చింది. ఆయన రాజ్యానికి తిరిగివచ్చి ఆ పాత్ర మూత తెరిచాడు. అయితే దాన్నిండా బొగ్గు కనిపించింది. అది చూసి రాజు దుఃఖంతో కన్నీళ్ళు కార్చాడు. రాణి అయితే కోపంతో ఊగిపోయింది. ''సాయం చేయకపోగా ఇంత అవమానిస్తుందా'' అంది. ''ఎందుకిలా పరాభావించిందో వెళ్ళి అడుగుతాను'' అంటూ వెళ్ళింది.

రాణి వెళ్ళేసరికి కూతురు మార్గశిర లక్ష్మీపూజ చేసుకుంటోంది. ఆమె తల్లిని చూసి సంబరపడి ''అమ్మా, నువ్వూ పూజ చేయి'' అంది. తల్లి ''చేయలేను'' అంటూ అడ్డంగా తల ఊపింది. కానీ కూతురు విడిచిపెట్టక తల్లితో కూడా పూజ చేయించింది. ఇక రాణి కూతుర్ని ఏమీ అడక్కుండానే పూజ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగివెళ్ళింది. రాణి రాజ్యం తిరిగి చేరేసరికి ఆశ్చర్యకరంగా పూర్వ వైభవం తిరిగి వచ్చింది. రాజభవనం కళకళలాడిపోతోంది. ప్రజలంతా మునుపటిమాదిరిగానే సుఖసంతోషాలతో సంతృప్తిగా కనిపించారు.

అదంతా మార్గశిర లక్ష్మీదేవి పూజ మహిమేనని మహారాణికి స్పష్టమైంది. ఇక అప్పటినుంచీ ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవ్రతం నియమం తప్పకుండా చేయసాగింది. శ్రవణుడు ''ప్రజలంతా మార్గశిర లక్ష్మీవ్రతం చేసుకోవాలని, లేకుంటే అనర్ధమని'' చాటింపు వేయించాడు.


గృహిణిలు అందంగా.. ఉత్తమంగా ఉండడం ఎలా?







తల్లి అయిన తరువాత అందాన్ని కాపాడుకోవడం కొంచం కష్టమైనా పనే. అందాన్ని కాపాడుకోవడానికి తగిన సమయాన్ని మరియు డబ్బుని చాలా మంది తల్లులు కేటాయించలేరు. ఇంట్లోనే ఉండే తల్లులకి వారి రూపురేఖల్ని తీర్చి దిద్దుకోవడానికి సరిపడా సమయం ఉండదు. బయటికి ఎక్కువగా వెళ్ళే అవసరం ఉండదు కాబట్టి వారు కూడా అందం పైన ఎక్కువగా శ్రద్ధ కనబరచరు. అటువంటి గృహిణిలు సులభమైన పద్దతులలో అందంగా కనిపించేందుకు కొన్ని సూచనలు

 


1. పరిశుభ్రతకి తగిన ప్రాధాన్యతనివ్వండి. క్లాసీ మామ్ గా ఉండడానికి ఇది ముఖ్యమైన ప్రాధమిక నియమం. కొత్తగా తల్లి అయిన వారికి ఎన్నో పనులుండడం వల్ల రోజుకొకసారి స్నానం చేయడానికి కూడా సమయం చిక్కదు. కానీ స్నానానికి ప్రాధాన్యత నివ్వండి. స్నానం చేసిన తరువాత మీరు ఎంతో ఉత్తేజం పొందుతారు.

తల్లిగా మీరు చేయవలసిన పనులని ఎన్నైనా చాకచక్యంగా త్వరత్వరగా పూర్తి చేయగలుగుతారు.
మీ ముఖాన్ని చక్కటి క్లేన్సేర్ తో కడగండి.
షాంపూ చేసి కండీషనర్ చేసుకోండి.
మీ చంకలో షేవ్ చేసుకోండి.
మీ కాళ్ళని, ఇంకా బికినీలోని ప్రాంతాన్ని షేవ్ చేసుకోండి.
పూర్తిగా వదిలేయడం కంటే, ఇలా వారానికి ఒకసారి చేసినా పరవాలేదు.

2. మీకు నప్పే సొగసైన హెయిర్ స్టైల్ ని ఎంచుకోండి.
గర్భిణి గా ఉన్నప్పటినుండి హెయిర్ స్టైల్ గురించి పట్టించుకునే తీరిక ఉండదు.
సెలూన్ కట్ మరియు రంగులు ఖరీదైనవి. అంతే కాక ఆ రంగులు మంచివి కావు కూడా.
తొమ్మిది నెలల తరువాత మారిపోయిన జుట్టు తీరుని తీర్చిదిద్దుకునేందుకు సమయం మరియు డబ్బు అందుబాటులో ఉండవు. కాబట్టి, మీ హెయిర్ స్టైల్ ని పొందికగా అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇది అనువైన సమయం.




how be classy mom


మీకు ఒక వేల పొట్టి జుట్టు నచ్చితే బాబ్ స్టైల్ ని ప్రయత్నించండి. పొడవైన జుట్టు నచ్చితే లాంగ్ లేయర్స్ ని ప్రయత్నించండి.

సులభంగా మీకు నచ్చిన హెయిర్ స్టైల్ కోసం ట్రిం చేయించుకోండి.మీ జుట్టు పొడవుగా ఉన్నట్టయితే, ఒక వైపు జుట్టుని పోనీ టైల్ గా కట్టుకుని ఎలాస్టిక్ ని పెట్టుకోండి. ఈ హెయిర్ స్టైల్ జిమ్ హెయిర్ స్టైలే కంటే బెటర్ గా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ సులభంగా చేసుకోవచ్చు.

ఇంట్లో వేసుకోగలిగే సహజమైన రంగులని మీ జుట్టుకి అప్లై చెయ్యండి.మీ ఐబ్రోస్ ని వాక్సింగ్ చేయించుకోలేకపోతే కనీసం అనవసరపు జుట్టుని తీసివేయడానికి ప్రయత్నించండి.

3. మీ మేకప్ ని సింపుల్ గా ఉండేటట్లు చూసుకోండి తప్ప ఎప్పుడూ మేకప్ ని స్కిప్ చేయవద్దు.
సన్ స్క్రీన్ కలిగిన మోయిస్చరైజర్ ని తప్పకుండా వాడండి.
మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఐ లాషెస్ ని వంపు తిప్పి మస్కారా అప్లయ్ చేయండి.
మాములు రోజుల్లో ఐ లైనర్ మరియు ఐ షాడో అప్లయ్ చేసుకోండి. పింక్ లేదా బ్రౌన్ రంగులకి ప్రాధాన్యత నివ్వండి.

4. సాధారణమైన మరియు సులభంగా మైంటైన్ చేయగలిగిన బట్టలని ఎంచుకోండి.
సులభంగా ఇంట్లోనే ఉతుక్కోగలిగిన స్వేట్టర్స్ మరియు కార్డిగన్స్ ని ఎంచుకోండి.
చదునైన నిట్ టాప్స్ మరియు కాప్రిస్ లని ఎండాకాలం లో ఉపయోగించేందుకు కొనండి.
జీన్స్, స్లాక్స్ మరియు బాలెట్ ఫ్లాట్స్ కి జతగా వేసుకోవడానికి తక్కువ హీల్ కలిగిన బూట్లని ఎంచుకోండి.
వర్కౌట్ కి వాకింగ్ కి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో టెన్నిస్ షూస్ ని వాడడం తగ్గించండి.

5. రోజువారి వాడకానికి సాధారణమైన నగలని ఏర్పాటు చేసుకోండి.
చిన్న పిల్లలు మెడలో ఉన్న నగలతో, చెవి రింగులతో ఆడడం సర్వ సాధారణం. అలా అని నగలు వాడటాన్ని పూర్తిగా నిర్మూలించవద్దు.

6. క్రమం తప్పకుండా మానిక్యుర్ మరియు పెడిక్యుర్ చేయించుకోండి.
రెండు వారాలకొకసారి మీ చేతులు మరియు పాదాలు అందంగా కనిపించడానికి సెలూన్ కి వెళ్లకపోయినా వీలైనప్పుడల్లా వెళ్ళండి.

7.తగినంత వ్యాయామం చేయండి.
మీ పిల్లలని సరదాగా నడకకి తీసుకు వెళ్లడమో లేదా మీ కుటుంబంతో కలిసి డిన్నర్ తరువాత సరదాగా నడవడమో చేయండి.
ఇంటి దగ్గర చేయగలిగే వ్యాయామాలను తెలుసుకోండి.
టీవీ లో ఇంట్లో చేయగలిగే సాధారణ వ్యాయామాల గురించి వచ్చిన ప్రోగ్రామ్స్ చూసి అవి ప్రయత్నించండి.
మీరు మధ్యాహ్నం పూట కునుకు తీసే సమయంలో నే సరిపోయే ఈ వ్యాయామాల వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
మీ బేబీ బరువుని కూడా తగ్గించాలనుకుంటే ఆన్ లైన్ కాలరీ కౌంటర్ లో చేరవచ్చు.

8. మీ చిరునవ్వు అందంగా, తెల్లగా ఉండేలా జాగ్రత్త పడండి.
క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించండి. ఇంట్లోనే వైట్నింగ్ సిస్టం ని పాటించండి.

9. ప్రశాంతంగా, వినయంగా ఉండండి.
అలసిపోవడం, ఒత్తిడికి గురవడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు కనబడతాయి.
వారానికి ఒక సారైనా బయటికి వెళ్ళండి.
సహాయం కోసం మీ లాంటి తల్లుల గ్రూప్ లో చేరండి.

పనిలో తీవ్రంగా మునిగిపోవడం వల్ల మీ ప్రియమైన వారిమీద లేదా ఇతరుల మీద చిటపట లాడే అవకాశం కలదు. కాబట్టి, ప్రశాంతంగా ఉండండి.

జాగ్రత్తలు:
వ్యాయామం మొదలు పెట్టే ముందు మీ డాక్టర్ ని సంప్రదించండి.
ప్రసవం తరువాత మీరు వ్యాయామం మొదలు పెట్టాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకొనవలెను.

 

మీ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని పసిగట్టడం ఎలా?



ఆహ్లాదంగా సాగిపోతున్న మీ సంసార జీవితంలో హఠర్త్తుగా మీ జీవిత భాగస్వామి ప్రవర్తన తేడాగా ఉందనే భావన మీకు కలిగిందా,వారిలో మార్పు కనిపించింది.బహుశా వారు మనల్ని మోసం చేస్తున్నారేమో ....




how catch cheating partner







 



















1. మార్పును గమనించండి: మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో వచ్చిన మార్పులన్నిటిని గుర్తించాలి. వారు మనతో గడపడానికి కేటాయించే సమయాన్ని తగ్గించుకోవడం, అలాగే బహుమతులు ఇవ్వడం లేదా వంటి చిన్న చిన్న విషయాలను విషయాలలో తేడాలు గమనించాలి.

2. ఐ లవ్ యూ అనే అంశం: వారు మీతో ఐ లవ్ యూ అని అనడం మర్చిపోవచ్చు. లేదా చెప్పకుండానే మానేయవచ్చు ఒకవేళ మీరు చెప్పినా దానికి ప్రతిస్పందించకపోవచ్చు.

3. తికమక పెట్టే అంశాలు(తప్పులు): ఒక్కోసారి వారు తికమక పడి మిమ్మల్ని వేరే పేరుతొ పిలవడం, అలాగే మన పేరు ఏమిటని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం వంటి అంశాలు గమనించాలి.

4. ఫోన్(ఆమెది/అతనిది)చెక్ చేస్తే: మీ జీవిత భాగస్వామి ఫోన్ ను చెక్ చేస్తే మన అనుమానాలకి సమాధానం దొరుకుతుంది.అనుమానం వచ్చనప్పుడు ఒక సారి ఫోన్ డీప్ గా చెక్ చేయండి.

5. అతని/ఆమె రొటీన్ జీవితంలో గమనించండి: వారి రొటీన్ జీవితంలో ఏమి చేస్తున్నారో అనే దానిపై ఓ కన్నేసి ఉంచండి.

6. రహస్యంగా అనుసరించండి: మీకు వారి మీద అనుమానం వచ్చినప్పుడు వారిని రహస్యంగా ఫాలో చేయాలి.

7. స్నేహితులు: వారి స్నేహితులతోను, మీ ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ తోనూ టచ్ లో ఉంటూ మాట్లాడుతూ ఉండాలి.


జాగ్రత్తలు/సూచనలు:

1. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
2. వారు మనల్ని మోసం చేస్తున్నారని బాధ పడకండి.
3. వారిని ఒకసారి దండించి ఇక చాలించండి అని అనండి.
4. ప్రతీది కామ్ గా చేయండి.
5. అవసరమైతే ఒక ఫ్రెండ్ సాయం తీసుకోండి.

హెచ్చరికలు:

1. వ్యవహారాన్ని తెగే దాకా లాగకండి.
2. చెడు ఫ్రెండ్ సహాయం మాత్రం తీసుకోకండి.

 

 

తవా ముర్గ్ - స్పెషల్ స్టార్టర్స్‌

మాంసాహార ప్రియులు వివిధ రకాల వెరైటీలను తయారు చేసుకొని తింటుంటారు. అయినా కూడా మరేదో కొత్తరకంను ఆశిస్తుంటారు. అటువంటి వారికోసం తయారు చేసిన ఈ తవా ముర్గ్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఒక్కటి మాత్రమే కాదు.. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో తయారు చేసేసుకోవచ్చు.ఈ తవా ముర్గ్ చికెన్ బ్రెస్ట్ తో తయారుచేసుకోవచ్చు. కొన్ని పదార్థాలతో మ్యారినేట్ చేసుకొని తవాలో ఫ్రై చేయడం వల్ల తవా ముర్గ్ అంటారు. కొన్ని మసాలా దినుసులతోనే అద్భుతమైన రుచితో తయారయ్యే ఈ స్పెషల్ ముర్గ్ ను లంచ్ లేదా డిన్నర్‌ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.

 Tawa Murgh



కావలసిన పదార్థాలు:

చికెన్ బ్రెస్ట్ పీస్: 250grms
శనగపిండి: 2tbsp
గుడ్డు సొన: 1tbsp
వెనిగర్: 2tbsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలపొడి: 2tsp
జీలకర్రపొడి: 1tsp
గరం మసాల పౌడర్: 1tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
అల్లంవెల్లుల్లి పేసు: 1tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్‌ని శుభ్రంగా కడిగి పలుచని స్లైస్ గా కట్ చేసుకోవాలి.

2. తర్వాత ముక్కల మీద శనగపిండి చల్లి చేత్తో కలపాలి. శనగపిండి ముక్కల్లో తడిని పీల్చుకోవడమే కాక పచ్చివాసనని కూడా తగ్గిస్తుంది.

3. ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ పీసెస్, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, గుడ్డు సొన, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరమ్ మసాల పౌడర్, నిమ్మరసం కలిపి 10 నిమిషాలపాటు నానబెట్టాలి.

4. తర్వాత నాన్ స్టిక్ పాన్ లేదా తవా ని స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి తక్కువ సెగ మీద ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి.

వీటిని లంచ్ లేదా డిన్నర్‌ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.

గ్రిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్-క్రిస్మస్ స్పెషల్

సాధారణంగా ఫిష్ వంటలంటే చాలా మాసాహారులకు చాలా ఇష్టం. అందులోనూ ఫిష్ మసాలా అంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఎర్రగా ఉండే గ్రేవి, డీఫ్ ఫ్రై చేసిన ఫిష్ ఫిల్లెట్..ఇలా ఒకటేమిటి.

వివిధ రుచులు. అయితే ఎప్పుడూ రొటీన్ గా తయారు చేసే ఫిష్ వంటకాలకు భిన్నంగా ఇండియన్ స్టైల్ లో తయారు చేసుకొని గ్రిల్డ్ ఫిష్ మసాలా చాలా అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందులోనూ ఇండియన్ మసాలాలు వాడటంతో మరింత టేస్టీగా ఉంటుంది.గ్రిల్డ్ స్నాక్స్ అన్నీ కాంటినెంటల్ స్టైల్లో వండుతారు. అదే స్టైల్లో గ్రిల్డ్ మసాలా ఫిష్ అద్భుతమైన టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం....


christmas special grilled masala fish fillets

కావలసిన పదార్థాలు:

పాంప్రెట్ ఫిస్ ఫిల్లెట్: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1 pinch
అజ్వైన్(ఇంగువ): 1/2 tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీల వరకూ వేడి చేయాలి.

2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసి తడి ఆరనివ్వాలి. శుభ్రం చేసిన ఫిష్ ఫిల్లెట్ మీద ఉప్పు, పసుపు చిలకరించు పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ధనియాలపొడి మరియు జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు శుభ్రం చేసి ఉప్పు పట్టించి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ ను ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మ్యారినేట్(చేపమొత్తానికి బాగా పట్టించాలి)చేసి దాని మీద కొంచె అజ్వైన్ మరియు నిమ్మరసం చిలకరించి ఇరవై నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

5. ఇరవై నిముషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని ఫిష్ ఫిల్లెట్ మీద నూనెను చిలకరించి ఓవెన్ గ్రిల్లింగ్ రాక్ మీద పెట్టాలి.

6. 60డిగ్రీల హీట్ పెట్టి 15-20నిముషాల పాటు ఫిఫ్ ను గ్రిల్(బేక్) చేయాలి. మద్య మద్యలో ఫిష్ ను అన్ని పక్కలకూ తిప్పుతూ బాగా కాలేలా చూసుకోవాలి.

అంతే గిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్ తయారైన వెంటనే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

చికెన్ టిక్కా బిర్యానీ-క్రిస్మస్ స్పెషల్

చికెన్ బిర్యానీ ఓ ట్రెడిషిన ల్ వంటకం. ఇది ఇండియా, పాకిస్తాన్ లో ఓ పాపులర్ రైస్ డిష్. బిర్యానీ వంటకంలో చాలా వెరైటీలు కలిగి ఉన్నాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, సింధీ బిర్యానీ, షాన్ చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ చికెన్ బిర్యానీ ఇలా... చాలా వెరైటీలే ఉన్నాయి.

ఇండియా, పాకిస్తాన్ లో చికెన్ టిక్కా బిర్యాని చాలా పాపులర్ రిసిపి.ఇది చాలా టేస్ట్ గా కలర్ ఫుల్ గా ఉంటుంది. చికెన్ టిక్కాను బిర్యానీ మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేయడం అంత సులభం కాదు. అతి త్వరగా చేసి వడ్డించే వంటకం కాదు. దీన్ని తయారు చేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొన్నా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ ఈ స్పైసీ చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేసి లచ్ డిన్న సర్వ్ చేసి అద్భుతమైన రుచితో ఎంజాయ్ చేయండి.


chicken tikka biryani recipe chritmas special


కావలసిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్: 1kg (చిన్న ముక్కలుగా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి)
బాస్మతి రైస్ : 1kg
అల్లం పేస్ట్: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
నిమ్మరసం: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 3tbsp
కారం: 2tsp
పసుపు: 1/3tsp
చాట్ మసాలా: 1tbsp
ఉల్లిపాయలు: 2onion
టమోటో: 2
పెరగు: 1cup
లవంగాలు: 5
బిర్యానీ ఆకు: 2
యాలకులు: 4
చెక్క: 2-3( అంగులపొడవు )
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 2tbsp
నూనె: 1cup
పసుపు కలర్ ఫుడ్ కలర్: 1/4tsp
కుంకుమ పువ్వు: చిటికెడు
పాలు: 1/2cup

తయారు చేయు విధానం:

1. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే వేడిగా ఉన్న పాలను ఒక కప్పు తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలు, పెరుగు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, లవంగాలు, చెక్క, యాలకులు, ఛాట్ మసాలా, నిమ్మరసం, ఎల్లో ఫుడ్ కలర్, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ చికెన్ ను 1-2 గంటలపాటు అలాగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లేదా ఫ్రిజ్ లో పెట్టాలి.

3. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి, అందులోనే టమోటో వేసి చిక్కటి గ్రేవి తయారయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి మసాలామిశ్రమంతో నానబెట్టి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా అందులో వేసి 5-10నిముషాల పాటు మీడియం మంట మీ ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి బాగా కాగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు అందులో బియ్యాన్ని వేసి 10నిముషాలు ఉడికించి గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు చికెన్ గ్రేవీ మిశ్రమాన్ని, వండిని అన్నంను రెండింటినీ లేయర్ గా పరచుకోవాలి. మొదటి అన్నంను ఒక ఇంచ్ మందగా పరవాలి. దానీ మీద చికెన్ మిశ్రమాన్ని పరవాలి. ఇలా మూడు నాలు లేయర్స్ పరచి చివరగా(టాప్ లో) చికెన్ గ్రేవి లేయర్ వచ్చేలా చూసుకోవాలి.

6. ఇప్పుడు ఈ అన్నం మీద పాలలో నానబెట్టుకొన్ని కుంకుమ పువ్వు, పాలతో సహాయ చిలకరించాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదునిముషాల పాటు తక్కువ మంటమీద ఆవిరిమీద ఉడికించాలి.

అంతే చికెన్ టిక్కా బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని రైతా, గ్రీన్ సలాడ్, నిమ్మకాయతో సర్వ్ చేయాలి. అంతే...

వాసనలని గ్రహించే శక్తి మెరుగుపరుచుకోవటం ఎలా ?

వాసనలని గుర్తించే శక్తిని మీరు పెంచుకోవాలనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కారణం, మన ఆహార పదార్ధాలలోని రుచులకి మరింత రుచిని కలిగించే శక్తి వాసనకి ఉండడం. ఒకసారి మీ ముక్కు మూసుకుని ఆహారాన్ని రుచి చూడడానికి ప్రయత్నించండి. మీకే ఆ బేధం తెలుస్తుంది.ఆహారానికి రుచిని పెంచడంలో వాసన ప్రధాన పాత్ర పోషిస్తుంది. వైన్, కాఫీ, బీర్ ల లోని సువాసనలని ఆగ్రాణించి అనుభూతిని గుర్తించి వివరించడం కుడా ఒక కళే.

ఈ కళ ఒక సాధారణ టీ సువాసనని గ్రహించడానికి కుడా వర్తిస్తుంది. వాసనలని గుర్తించే ప్రక్రియలో ఎన్నో చిన్న చిన్న విషయాలే మనకి అద్వితీయమైన అనుభూతిని కలిగిస్తాయి. వాటిలో పూవులలోని సువాసనలలోని సూక్ష్మ బేధాల్ని గుర్తించడం, లేదా మనసైన వారి చర్మపు సువాసనని గుర్తించడం, లేదా రాలిన ఆకుల లోని వాసన లోని బేధములని గుర్తించడం వంటివి ముఖ్యమైనవి. మరొక ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే సగటు మానవుడి ముక్కు సుమారు 10,000 రకాల వాసనలను గుర్తించగలదు. అంతటి అద్బుతమైన పాత్ర పోషిస్తున్న వాసన గ్రహించే శక్తిని పెంపొందిచుకునే మార్గాలు తెలుసుకుందామా మరి.

how improve your sense smell


1. మీరు వాసనని పీలుస్తున్న వాటి మీద శ్రద్ద పెట్టండి. ఆంగ్లం లో 'యూస్ ఇట్ ఆర్ లూస్ ఇట్' అనే నానుడి కండరాల విషయం లో ఉంది. అంటే ఎంత వాడితే అంత ఉపయోగపడుతుంది లేకపోతే నిరుపయోగమవుతుంది. మన ఇంద్రియాలకి కూడా ఈ నానుడి వర్తిస్తుంది. మీరు మీ ఇంద్రియాలని ఎంతగా వాడితే అంత బాగా అవి పనిచేస్తాయి. వాసనలు గుర్తించి వాటిని వర్ణించడానికి ప్రయత్నించండి. అదనపు సాధన కోసం, మీరు కళ్ళకి గంతలు కట్టుకుని, ఎవరినైనా రక రకాల వాసనలు కలిగిన వస్తువులను ఒక దాని తర్వాత ఒక దానిని పట్టుకొని ఉండమని, మీరు ఆ వస్తువులని గుర్తించడానికి ప్రయత్నించండి.

2. కొన్ని ప్రత్యేకమైన వాసనలు మీకు ఎటువంటి అనుభూతులు కలిగిస్తాయో గుర్తించండి. వాసనలని గుర్తించే నరాలు నేరుగా మెదడులో ఉన్న ఉద్వేగపూరితమైన భాగాలకి అనుసంధానమయి ఉంటాయి కాబట్టి కొన్ని రకాల వాసనలు కలిగించే అనుభూతులు వేరు వేరుగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఫాస్ట్ ఫుడ్ వ్రాపెర్స్ నుండి వచ్చే వాసనలు, తాజా బ్రెడ్ లేదా పేస్ట్రి నుండి వచ్చే వాసనలకి వాహనం నడిపేటప్పుడు కలిగే ఒత్తిడి పెరిగి వాహన చోదకులకి అకారణమైన హింసాత్మక కోపం అధికమయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే, పిప్పరమింట్ మరియు దాల్చిన చెక్కల నుండి వచ్చే వాసనలు వాహన చోదకులకి ఏకాగ్రతని పెంచి ఒత్తిడిని తగ్గించే గుణం కలదు. సాధారణంగా, కాఫీ మరియు నిమ్మ వాసనలకు స్పష్టమైన ఆలోచనలు కలుగచేసి, ఏకాగ్రత స్థాయిలని పెంచే లక్షణం ఉంది.

3. జలుబుని, కఫాన్ని పెంచే ఆహార పదార్ధాలని సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీరెప్పుడైనా గమనించారా, మనకి జలుబు చేసినప్పుడు వాసనలని గుర్తించే శక్తి తగ్గిపోతుంది. తీవ్ర మైన జలుబు తో బాధపడుతున్నప్పుడు వాసనలని గుర్తించే శక్తి పూర్తిగా అదృశ్యం కూడా అయిపోతుంది. ముక్కులోని పొరలకు కలిగే రక్తచలన దోషము వల్ల వాసనని గుర్తించే నరముకి ఉన్న సామర్ధ్యం తగ్గుతుంది. అందుకే ముక్కు దిబ్బడని కలిగించే పాలు, వెన్న, ఐస్ క్రీం వంటి వాటికి జలుబు తగ్గేంత వరకు దూరంగా ఉండడం ప్రయోజనకరం. ముక్కులో ఉండే ఇంద్రియ కణాలకి గొంతు వెనుకభాగానికి కలిపే మార్గం వల్ల మనం తినే ఆహార పదార్ధాల రుచులపై కూడా ప్రభావం ఉంది. ఎందుకంటే, జలుబు చేసినప్పుడు ఈ మార్గం మూసివేయబడుతుంది. తద్వారా, రుచి ని గుర్తించే శక్తి కూడా మందగిస్తుంది.

4. వాసనని పసిగట్టే శక్తి ని బలహీన పరిచే పదార్ధాలని దూరంగా ఉంచండి. జలుబుని తగ్గించే కొన్ని చిట్కాల వల్ల వాసనని పసిగట్టే శక్తి తగ్గిపోవచ్చు. ధూమపానం వల్ల వాసనని పసిగట్టే శక్తి తగ్గిపోతుంది. మద్యపానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి. మద్యం సేవించడం వల్ల రక్తంలో మద్యం స్థాయి పెరిగి వాసనని పసిగట్టే శక్తి బలహీనపడుతుంది.

5. ఆహారంలో జింక్ ని ఎక్కువగా వాడండి. హైపోస్మియా(Hyposmia) అనే వ్యాధి జింక్ ఖనిజ లోపం వల్ల వస్తుంది. హైపోస్మియా వల్ల వాసనని గుర్తించే శక్తి సన్నగిల్లుతుంది. జింక్ సమృద్దిగా లభించే పదార్ధాలని ఆహారంలో తీసుకొనడం ద్వారా వాసనని పసిగట్టే శక్తి ని వృద్ది చేసుకొనవచ్చు. ఆయిస్టర్ (Oysters -సముద్రపు చిప్ప లేక గుల్ల ), పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, పెకన్స్(Pecans) ల వంటి వాటిలో జింక్ సమృద్దిగా లభిస్తుంది. లేదా 7 mg జింక్ సప్ప్లిమెంట్స్ ని ప్రతిరోజూ తీసుకోవడం మంచిది.

6. వ్యాయామం చెయ్యండి. కొన్ని అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసిన తర్వాత వాసనని పసిగట్టే ఇంద్రియం చాలా చురుకుగా పని చేస్తుంది. కాబట్టి వ్యాయామం ద్వారా ఆరోగ్యమే కాకుండా వాసనని పసిగట్టే శక్తి ని కూడా వృద్ది చేసుకోవచ్చు.

7. గాలిలో తేమ శాతం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. గాలిలో తేమ ముక్కుని తేమగా ఉంచుతుంది. తద్వారా, వాసనని పసిగట్టే శక్తి పెరుగుతుంది.

8. దుర్వాసనల నుండి దూరంగా ఉండండి. ఎక్కువసేపు దుర్వాసనలకి బహిర్గతం అవడం వల్ల, వాసనని గుర్తించే శక్తి మందగిస్తుంది.

9. ఏదైనా వాసనని గుర్తించడానికి ప్రయత్నించేటప్పుడు ఒకే సారి గట్టిగా పిల్చేకంటే మెల్ల మెల్ల గా చిన్న చిన్న గా పీల్చండి. ఇలా చెయ్యడం వల్ల వాసనని పసిగట్టే శక్తి పెరుగుతుంది. కుక్కలు, పిల్లులవంటివి ఎవైన వాసనని పసిగట్టేటప్పుడు ఇదే పద్దతిని పాటిస్తాయి.

10. ఆహార పదార్ధాలని షాపింగ్ చేసేటప్పుడు బాగా వాసన వచ్చే పదార్ధాలే మీ శరీరం ఎక్కువగా కోరుకునే పదార్ధాలు. ఉత్తమ వాసన కలిగిన ఆహార పదార్ధాలనే కొనండి. రై బ్రెడ్ లేదా వెన్నలని ఎంచుకోనేటప్పుడు వాటి నుండి వచ్చే సువాసనలే మనకి అవి మంచివా కావా అని తెలియచేస్తాయి.


మన శరీరం ఎక్కువగా ఏమి కోరుకుంటుందో మనం ఎక్కువగా ఇష్టపడే వాసనల ద్వారా గుర్తించవచ్చు. ఔషదం లేదా విటమిన్ సీసాల వాసనల ద్వారా కూడా మన శరీరానికి ఏ ఔషదం లేదా విటమిన్స్ అవసరమో తెలుసుకొనవచ్చును.అయినప్పటికీ ఔషదాలు లేదా విటమిన్స్ ని వాడే ముందు వైద్యున్ని సంప్రదించండి.

పోపుధినుసు కాదు...ఆరోగ్య దివ్యఔషధ ధినుసు..!

ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు. లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు. ఒక్కసారి మీ వంటింట్లోని పోపులపెట్టెలోకి చూడండి...కనిపించాయా నల్లని పూమొగ్గలు... అవేనండీ లవంగాలు. అద్భుత ఔషధ సుగంధద్రవ్యాలు!

విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాం. ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.

తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మసాలాప్రియులు. ఇది శృంగారప్రేరితం కూడానట. పరిమళాలు, సాంబ్రాణి కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే. వీటిలో మంచి సువాస మాద్రమే కాదు.. విలువైన పోషకాలు ఉన్నాయి. ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు... ఎ,సి , ఉంటాయి. మరి ఇన్ని పోషకాలు, ఔషదగుణాలున్న లవంగాలు ఆరోగ్య పరంగా ఏవిధంగా ఉపయోగపడుతాయో చూద్దాం....


health benefits clove

1. లవంగాల నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2. జలుబు- దగ్గు: గొంతునొప్పి, జలుబులను తగ్గించేందుకు లవంగాల కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది.

3. కఫం-పిత్తం: ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి.

4. దప్పిక:
ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.

5. జీర్ణశక్తికి: జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తీసుకోండి. మీ శరీరంలోని జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

6. లవంగాలు సేవిస్తే ఆకలి బాగా వేస్తుంది. వీటి వలన జీర్ణక్రియకు అవసరమైన రసాలు ఉదరంలో ఊరుతాయంటున్నారు వైద్యులు.

7. పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగమొగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది. లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.

8. లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.

9. ఇది వ్యాధి నిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతుంది.

10. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు.

11. లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటితో తామర లాంటి చర్మ సంబంధ వ్యాధులు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు బాగా తగ్గుతాయని వారు చెబుతుంటారు. లవంగ నూనెను పొట్టుపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవు తాయని మనదేశీయులు భావిస్తారు. పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.

12. ఉబ్బసం, నులిపురుగులను తగ్గించేగుణం కూడా వీటికి మెండుగా ఉంది. వాంతి అవుతుందని అనిపిస్తుంటే.. నాలుగు చుక్కల లవంగ నూనెను ఓ గ్లాసు నీటిలో వేసి పుక్కిలిస్తే వాంతులు రావు. అలసటను, రుమాటిక్‌ నొప్పులను తగ్గించ టంలో కూడా లవంగాలు బాగా తోడ్పడతాయి.

13. పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది.

14. దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరము లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

15. రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట.

వేడి నీళ్ళ స్నానంతో విశ్రాంతి పొందడం ఎలా...?

బాగా పనిచేసిన రోజు సాయంత్రం విశ్రాంతినిచ్చే స్నానం చేయాలంటే, మీ స్నానాన్ని ఒక స్పా లాగా బాగా విశ్రాంతిగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.


how relax with hot bath


చర్యలు :

1. మీ కోసం మీరు చివరిసారిగా ఒత్తిడులన్నీ దూరం అయ్యేలా ఎప్పుడు స్నానం చేసారో గుర్తు తెచ్చుకోండి.

2. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోండి. మీరు విశ్రాంతి తీసుకునేలోగా మీ దైనందిన చర్యలు, ఇంటి పనీ చేసేసుకోండి. కాసేపు మీ మనసు, శరీరం, ఆత్మ మీద ధ్యాస వుంచి మీ బాధలన్నీ కాసేపు మర్చిపోండి.

3. స్నానాన్ని ప్రత్యేకం చేసుకోండి. ఫోన్ ను హుక్ మీద నుంచి తీసివేయండి. మీకోసం గ్లాసులో వైన్ పోసుకోండి, ఒక పుస్తకం తీసుకోండి, స్నానాల గదిలో లైట్లు ఆర్పివేసి కొవ్వొత్తి వెలిగించండి(సుగంధ భరితమైనవి ఐతే మంచిది), బాత్ ఆయిల్, బుడగలు లేదా బాత్ బాంబ్స్ ఉపయోగించి వేడి నీళ్ళు కలుపుకొండి. ఈ మధ్య సుగంధ చికిత్సల ఎంపికలు కూడా చాలానే దొరుకుతున్నాయి. బజార్లో చాలా మంచి స్నానపు ఉత్పత్తులు దొరుకుతున్నాయి - అవి కొని తెచ్చుకోవడం కూడా మంచి ఆలోచనే.


4. మిమ్మల్ని మీరు టబ్ లో ముంచుకోండి - మీ బాధలన్నీ టబ్ లోంచి బయటకు పొంగే నీటితో పాటు కొట్టుకు పోనీండి.

5. విశ్రాంతిగా వుండండి. మీ బాధలన్నీ నీటిలో కరిగిపోనీయండి. సూర్యుడు తారాడే సాగర తీరాలు, తారలతో వెలిగిపోయే ఆకాశాలు లాంటి సంతోషకరమైన ఆలోచనలు రానీయండి - పిల్లలు, పని, డబ్బుల గురించిన ఆలోచనలు ఆవిరైపోనీయండి. మీ మనసును తెరవండి, ధ్యానం చేయండి, కేవలం ఆస్వాదించండి.

6. సాధ్యమైనంత ముందుగానే స్నానం చేయండి, దాని వల్ల మీరు త్వరగా శుభ్ర పడతారు - అలా మురికిగా ఎక్కువ సేపు ఉండకుండా.

7. స్నానం చేసేటప్పుడు వినడానికి హాయిగా వుండే పాటల ప్లే లిస్టు తయారు చేసుకోండి.

8. మంచి స్నాన౦ చేయడానికి ముఖానికి పూత, మంచి పుస్తకం కూడా అవసరమే. కాస్త సృజనాత్మకంగా ఆలోచించి ఇంట్లోనే ఒక అరటి పండు (గుజ్జు చేసినది), ఒక టేబుల్ స్పూన్ తేనె, అయిదు టేబుల్ స్పూన్ల ఓట్లు కలిపి ముఖానికి పూత తయారు చేయండి. కాస్త అందుబాటు ధరల్లో వుండే ముఖం పూతలను దుకాణాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు.

చిట్కాలు :

మీరు నీటిలో నానుతుండగా మీకు ఇష్టమైన పానీయాన్ని తాగడానికి బాత్ టబ్ పక్కనే ఉంచుకోండి.

ముఖం మీద పూత వేసుకుని నిజంగా స్పా లో వున్న అనుభూతి పొందండి.

హెచ్చరికలు :

స్నానపు తొట్టె లో వుండగా ధ్యానం చేయడం ప్రమాదకరం కావచ్చు, మునిగి పోకుండా ఉండేలా అభ్యాసం చేయ౦డి, లేదా మీరు ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో ఇతరులకు చెప్పి మిమ్మల్ని ఆటంక పరచ వద్దని చెప్పండి.

స్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువగా వైన్ తాగకండి. అది ఒలికిపోవచ్చు లేదా కారిపోవచ్చు.

గోరువెచ్చటి లేదా వేడి నీళ్ళలో కూర్చుని ఆల్కహాల్ తాగితే మీకు బాగా నెప్పులు కూడా రావచ్చు.

స్నానం చేసేటప్పుడు మీకు రేడియో, టేపులు లేదా సి డి లు వినడం ఇష్టమైతే, మీరు వాడుతున్నది ఏదైనా సరే పొరపాటున కూడా జారి నీళ్ళలోకి పడనటువంటి ప్రదేశంలో వుంచండి.

మీరు గమని౦చ గలిగేంత సురక్షితమైన దూరంలో కొవ్వొత్తి వుంచండి.నీళ్ళలో మరీ ఎక్కువ సేపు ఉండకండి - దాని వల్ల చర్మం త్వరగా వయసు మీరుతుంది.

ఒత్తైన, అందమైన జుట్టు కోసం ఇంట్లో చేసుకునే వేడి నూనె చికిత్స

జడలు కట్టిన, ఎండిపోయిన, కాంతి లేని, నిగారింపులేని జుట్టుని ఎవరూ కోరుకోరు. అదృష్టవశాత్తు అందమైన, ఒత్తైన మరియు నిగారింపు కలిగిన జుట్టుని సొంతం చేసుకునేందుకు మీ వంట ఇంటిలో లభించే ఎన్నో అద్భుతమైన ఔషదాలతో ఇప్పుడు సాధ్యం.
వంటకి వాడే వెజిటబుల్ ఆయిల్ మీ జుట్టుకి పోషణ కలిగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు చివర్ల చిట్లినా, కాంతి పోయినా వెజిటబుల్ ఆయిల్ వాడడం వల్ల తిరిగి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. మీ జుట్టుకి అందించే వేడి నూనె చికిత్సకు పువ్వులు, మూళికలు వంటివి అదనపు కండిషనింగ్ శక్తిని ప్రసాదిస్తాయి.


how do hot oil treatment hair at home

వేడి నూనె చికిత్స విధానం:

1. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ మరియు ద్రాక్ష విత్తనాల నూనె లని తీసుకుని ఒక గిన్నెలో కలుపుకోవాలి. పది సెకండ్ల పాటు ఈ ఆయిల్ ని మైక్రోవేవ్ లో వేడి చేసుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా, ఈ నూనె గిన్నెని వేడి నీళ్ళు కలిగిన గిన్నెలో పెట్టుకోవడం వల్ల నూనె వేడెక్కుతుంది. మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ మరియు లావెండర్ నూనెలు, మరియు సెజ్ నూనె రెండు చుక్కలు ఈ వేడి నూనె కి జోడించండి. చెక్క గరిటె తో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.


2. ఇప్పుడు మీ జుట్టుని నాలుగు విభాగాలుగా విభజించండి. మీరు తయారు చేసుకున్న నూనె ని కొంచెం మీ చేతికి వెనుక భాగంలో రాసుకుని నూనె వేడి మీకు సరిపోయినట్లుగా ఉందో లేదో నిర్ధారించుకోండి. నూనె వేడి మీకు తగినట్లుగా ఉన్నాక, మీ తలపై ఉండే చర్మంపై ఈ నూనెతో మర్దనా చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాయండి. ప్రతి విభాగంలో జుట్టుని ఇదే విధంగా మర్దనా చెయ్యండి.

3. మర్దనా చెయ్యబడిన మీ జుట్టుని ప్లాస్టిక్ కండిషనింగ్ కేప్ తో కప్పి ఉంచండి. పది నుండి పదిహేను నిమిషాల వరకు బోన్నెట్ డ్రైయర్ కింద లేదా హీటింగ్ కేప్ కింద కూర్చోండి. ప్రత్యామ్నాయంగా, మీ తలపై ఒక వేడి టవల్ ని చుట్టుకుని, ఆ టవల్ ని ఇంకొక టవల్ తో చుట్టి వెయ్యండి. అనుకున్న సమయం పూర్తయిన తర్వాత మీకు నచ్చిన ఉత్పత్తులతో యధావిదిగానే తలస్నానం చెయ్యండి.

చిట్కాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు:

వేడి నూనెతో మర్ధనాని ముందు రోజు రాత్రి చేసుకుని మరునాడు ఉదయం తలస్నానం చేసి కండిషనింగ్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.ఇంతకు ముందు మీరు వాడని నూనెలని మీ జుట్టుపై చేసే ఈ వేడి నూనె చికిత్సలో వాడే ముందు అవి మీ శరీర తత్వానికి సరిపడతాయో లేదో తెలుసుకోవాలి. మీ మెడ వెనుకభాగంలో లేదా మీ చంక భాగంలో వీటిని ముందుగా కొంచెం అప్లై చేసి గమనించాలి. ఒక వేళ తెలియకుండా సరిపడని ఆయిల్స్ ని వాడితే దుష్ఫలితాలు కలిగీ అవకాశాలు గలవు.

Saturday, December 22, 2012

మార్గశిర లక్ష్మీపూజతో బంగారు కాసులు






 
"మహా దేవ్యైచ విధ్మహే
విష్ణు పత్నీచ ధీమహీ
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్"

"నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహీ
తన్నో విష్ణు: ప్రచోఅదయాత్"



ద్వాపరయుగంలో సౌరాష్ట్రలో శ్రవణుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడూ, వేదాలు, శాస్త్రాలు , పురాణాలు చదివినవాడు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుని చిత్తశుద్ధితో పరిపాలించేవాడు. శ్రవణుడి భార్య సురత చంద్రిక. ఆమె కూడా ఉత్తమురాలు. గొప్ప భక్తురాలు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ఆ రాజు పాలనలో ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు.

ఇదిలావుండగా, ధనధాన్యాలిచ్చే లక్ష్మీదేవి సౌరాష్ట్రకు వెళ్ళాలని, రాజును, ప్రజలను దీవించాలని నిర్ణయించుకుంది. లక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో రాజభవనానికి వెళ్ళింది. అక్కడ మహారాణి దగ్గర పనిచేసే దాసీ ''ఎవరమ్మా నువ్వు?” అనడిగింది.

''నేను మహారాణిని కలవడానికి వచ్చాను. ఆమె క్రితం జన్మలో ఒక పేద వైశ్యుని భార్య. ఆ పేదరాలు ఒకరోజు అంతులేని నిరాశతో ఇళ్ళు విడిచి నడుస్తూ వెళ్ళి అడవి చేరింది. అక్కడ ఆకలితో అలమటిస్తూ, చలికి తాళలేక తిరగసాగింది.

అది చూసిన లక్ష్మీదేవి ఆమెమీద జాలితో మామూలు స్త్రీగా కనిపించి ''మార్గశిర లక్ష్మీదేవి పూజ చేసుకోమని'' చెప్పింది. దాంతో ఆమె వెంటనే ఇల్లు చేరి ఆ పూజ చేసింది. వెంటనే వారి కష్టాలు తీరాయి. ఆ ఇళ్ళు సంపదలతో తులతూగింది...'' అంటూ చెప్పింది.

దాసి వెళ్ళి మహారాణితో అదంతా చెప్పింది. రాణీకి ఆ మాటలు ఎంతమాత్రం నమ్మశక్యంగా తోచలేదు. ''ఈవిడెవరో పబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్పింది'' అనుకుని ఆ వృద్ధ స్త్రీని కలవనేలేదు. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి నగరం విడిచి వెళ్ళిపోడానికి సిద్ధమైంది.


 


ఈ సంగతి తెలిసిన రాకుమారి పరుగున వెళ్ళి వృద్ధస్త్రీని నిలవరించింది. ''మా అమ్మను క్షమించు తల్లీ! మార్గశిర లక్ష్మీ పూజ నేను చేస్తాను'' అంటూ వేడుకుంది. చెప్పినట్లుగానే లక్ష్మీపూజ ఎంతో నమ్మకంతో భక్తిగా చేసింది. లక్ష్మీదేవి సంతోషించింది. ఆ రాకుమారికి ధీరుడు, వీరుడు అయిన రాజుతో వివాహం జరిగింది.

కొంతకాలానికి సౌరాష్ట్ర రాజు శ్రవణుడికి కష్టకాలం దాపురించింది. వర్షాభావంతో పంటభూములు బీడుల్లా మారాయి. విపరీతమైన కరవు వచ్చింది.

మహారాణి సలహా మేరకు, శ్రవణుడు కూతురి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఎంతో సానుభూతి చూపి ఒక పాత్ర నిండా బంగారు కాసులు నింపి, మాత బిగించి తండ్రికిచ్చింది. ఆయన రాజ్యానికి తిరిగివచ్చి ఆ పాత్ర మూత తెరిచాడు. అయితే దాన్నిండా బొగ్గు కనిపించింది. అది చూసి రాజు దుఃఖంతో కన్నీళ్ళు కార్చాడు. రాణి అయితే కోపంతో ఊగిపోయింది. ''సాయం చేయకపోగా ఇంత అవమానిస్తుందా'' అంది. ''ఎందుకిలా పరాభావించిందో వెళ్ళి అడుగుతాను'' అంటూ వెళ్ళింది.

రాణి వెళ్ళేసరికి కూతురు మార్గశిర లక్ష్మీపూజ చేసుకుంటోంది. ఆమె తల్లిని చూసి సంబరపడి ''అమ్మా, నువ్వూ పూజ చేయి'' అంది. తల్లి ''చేయలేను'' అంటూ అడ్డంగా తల ఊపింది. కానీ కూతురు విడిచిపెట్టక తల్లితో కూడా పూజ చేయించింది. ఇక రాణి కూతుర్ని ఏమీ అడక్కుండానే పూజ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగివెళ్ళింది. రాణి రాజ్యం తిరిగి చేరేసరికి ఆశ్చర్యకరంగా పూర్వ వైభవం తిరిగి వచ్చింది. రాజభవనం కళకళలాడిపోతోంది. ప్రజలంతా మునుపటిమాదిరిగానే సుఖసంతోషాలతో సంతృప్తిగా కనిపించారు.

అదంతా మార్గశిర లక్ష్మీదేవి పూజ మహిమేనని మహారాణికి స్పష్టమైంది. ఇక అప్పటినుంచీ ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవ్రతం నియమం తప్పకుండా చేయసాగింది. శ్రవణుడు ''ప్రజలంతా మార్గశిర లక్ష్మీవ్రతం చేసుకోవాలని, లేకుంటే అనర్ధమని'' చాటింపు వేయించాడు.



 

మహావిష్ణువు భువికి ఏతెంచే పుణ్యతిథి ముక్కోటి

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రతిరోజూ ఒక పండగే! ప్రతి దినమూ ఒక ఉత్సవమే! సంవత్సరంలోని మూడొందల అరవై రోజులూ ఏదో ఒక విశేషమే కనిపిస్తుంది. ఆ వంకతోనైనా పూజలు చేసి, ఉపవాసాల్లాంటి నియమాలు పాటించి, పవిత్రమైన జీవనవిధానంలో కాలం గడుపుతూ, కొంతకాలానికైనా మానసిక ప్రవర్తనలో ఒక మార్పు కలిగి, ఆధ్యాత్మిక చింతన ఏర్పడి, మానవుడు దానవుడుగా కాక, భక్తి పారవశ్యంతో సంచరించి పరమ పురుషార్ధమైన మోక్షం వైపు పయనిస్తాడని పెద్దల విశ్వాసం. ఆవిధంగా ఏర్పడిందే ఏకాదశి వ్రతం.

మన సంవత్సర కాలాన్ని స్థూలంగా ఉత్తరాయణం, దక్షిణాయణం, అని రెండు భాగాలు చేశారు. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు అనువైనదని, ఆ కాలంలో మరణించినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం. అంతేకాదు, ఉత్తరాయణం దేవతలకు పగటివేళ అని, దక్షిణాయణం రాత్రికాలమని కూడా అంటారు. అందుకే అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు దక్షిణాయణం లోకి వస్తాయి.


  


విష్ణుమూర్తి ఈ దక్షిణాయణంలో ఆషాఢ శుద్ద ఏకాదశి నుండి యోగనిద్రలో నాలుగు మాసాలు గడుపుతూ లోకం తీరుతెన్నులు పరిశీలిస్తూ ఉంటాడు. అందుకే ఆషాఢ శుద్ద ఏకాదశిని ''శయన ఏకాదశి'' లేదా ''తొలి ఏకాదశి'' అని పిలుస్తారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ఏకాదశి ఒక పర్వదినమే. సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి శుక్లపక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు ఉంటాయి. అధికమాసం ఉన్న సంవత్సరం అయితే మరో రెండు అదనంగా ఉంటాయి. అప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి ప్రాముఖ్యాన్ని గూర్చి శంకరుడు పార్వతికి వివరించినట్లు పద్మపురాణం పేర్కొంది. విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈ ఏకాదశి రోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి ''ముక్కోటి'' అని పేరు వచ్చింది అంటారు.



ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, పూజలు, దానధర్మాలు చేసి, భగవన్నామ స్మరణతో కాలం గడుపుతూ రాత్రంతా జాగరణ చేసి, మర్నాడు అంటే, ద్వాదశినాడు ఆ ఘడియలు వెళ్ళకముందే పారణ చేయాలి. ఇది ఒక వ్రాతనియమం. మానవులకు ముక్తి కలిగించాచానికి స్వయంగా విష్ణువే ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారిలో రుగ్మాంగదుడు, అంబరీషాదులు ముఖ్యులు. ఈ వ్రతానికి సంబంధించిన భవిష్యోత్తరపురాణాదులు ఎన్నో గాధలు, కధలు పేర్కొన్నాయి.




ఏకాదశినాడు ముఖ్యంగా ఉపవాసదీక్ష భక్తులు పాటించే ఒక నియమం అసలు ఉపవాసం అంటే ఏమితో చూడండి.. ఉప అంటే భగవంతుని సమీపంలో అని, వాసం అంటే ఉండటం అని అర్ధం. అంటే భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ కాలం గడపడం అన్నమాట. అయితే, ఆరోగ్యరీత్యానో, వయోభారం చేతనో కొంతమంది ఆహారం తీసుకొనక ఉపవాసం ఉండలేక పోవచ్చు. వారికి ప్రత్యామ్నాయంగా వాయుపురాణం -

'సక్తం హవిష్యాన్న మనోదనం వా
ఫలంతిలాః క్షీరమధాంబుచాజ్యం
యత్పంచగవ్యం యదివాపి వాయు
ప్రశస్త మంత్రోత్తర ముత్తరం చ'
అని పేర్కొంది.

ఉపవాసం చేయలేనివారు నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. లేదా ఉడకని పదార్ధాలు లేదా హనిశ్యాన్నం భుజించవచ్చు. అది కూడా చేతకాని వారు సక్తభోజనం అంటే రాత్రిపూట భోజనం చేయవచ్చు. అయితే ఏకాదశి నాడు భుజిస్తే చాంద్రాయణ వ్రతం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నది.



''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు గీతాచార్యుడు. అందుకే ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశికి ఒక ప్రాముఖ్యం ఏర్పడింది. మార్గశిర సుద్ద ఏకాదశిని మొక్శైక ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్నే హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఇది ఉత్తరాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడిణి చుట్టుముట్టిన చీకట్లు పటాపంచలై ఆయనకు మోక్షం అంటే విముక్తి కలగడంవల్ల దీన్ని మోక్ష ఏకాదశి అన్నారు.



వాస్తవానికి కాలగమనంలో తెలుగువారిది చాంద్రమానం. అయితే ముక్కోటి సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగలు, ధనుస్సంక్రమణం తర్వాత వచ్చే ఏకాదశి ఇది. సాధారణంగా ఈ పండుగ మార్గశిరంలో కానీ పుష్యంలో కానీ వస్తుంది. దక్షిణాయణం వెళ్ళిపోతుంది కాబట్టి రాత్రిపోయి పగలు వస్తుంది. అందుకే విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈరోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి 'ముక్కోటి' అని పేరు వచ్చిందని అంటారు. 33 కోట్లను మూడు కోట్లు అనే పదం సూచిస్తుంది. దానికి సూచనగా విష్ణు ఆలయంలో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనికి వైకుంఠద్వారం అని పేరు.

సూర్యుడు ఉత్తరాయన ప్రవేశాన్ని వైకుంఠ ద్వారం తెరవడం ద్వారా సూచిస్తారు. తెల్లవారుజామున దీనిగుండా వెళ్లినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు స్వర్గంలో ప్రవేశిస్తారని ఒక విశ్వాసం. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానం. ఈనాడు విష్ణుమూర్తి మురాసుర సంహారం చేసాడని, శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడు వచ్చి ఆ స్వామిని పూజిస్తాడని చెప్తారు. హిందువులందరూ ముక్కోటి ఏకాదశిని భక్తిశ్రద్ధలతో పాటించడం గమనించదగ్గ ఒక విశేషం.

వైభవోపేతం వైకుంఠ ఏకాదశి





పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. సహజంగానే ఏకాదశి తిథి ఎంతో ఉత్తమమైంది. ఇక వైకుంఠ ఏకాదశి పరమ
పవిత్రమైంది. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
విష్ణుమూర్తి ముర అనే రాక్షసుని సంహరించి, ఇంద్రాది దేవతలను ఆనందింపచేసిన రోజిది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు దేవుని దర్శించుకుని, ఉపవాసం ఉన్నవారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.
వైకుంఠ ఏకాదశినాడు చేసే దైవారాధన మూడు కోట్ల దేవతలకూ చెందుతుంది. ఈ విశిష్ట దినాన చేసే పూజతో మూడు కోట్ల దేవతలూ ప్రసన్నం అవుతారు. కనుక ఈరోజు విధిగా ఆలయానికి వెళ్తారు. భక్తిగా దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉపవాసం ఉండి, పాలు, ఫలాలు మాత్రమే సేవిస్తారు. ముక్కోటి ఏకాదశినాడు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడతాయి. ఇక వైష్ణవ దేవాలయాల సంగతి చెప్పనవసరం లేదు. కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలలో ముక్కోటి ఏకాదశి మహా వైభవోపేతంగా జరుగుతుంది.
ముక్కోటి ఏకాదశినాడు భక్తులు ముఖ్యంగా వైష్ణవులు ''విష్ణు సహస్రనామం''తో మొదలుపెట్టి స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు చేస్తారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పురాణ శ్రవణాలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ఈ పుణ్య తిథినాడు యజ్ఞయాగాదులు జరిపితే మంచిది కనుక కొందరు యజ్ఞాలకు పూనుకుంటారు.




తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునే భక్తులు ఇతర దినాల్లో కంటే, ముక్కోటి ఏకాదశి లాంటి విశేష పర్వదినాల్లో తిరుమల వెళ్ళడం మరింత శ్రేష్ఠమని నమ్మి, ఆ వేళ్టికి అక్కడ ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు.
 నిజానికి రద్దీ విపరీతంగా ఉండటంవల్ల వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని.


అయినా లక్ష్యపెట్టకుండా వెళ్తారు.
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు చనిపోయిన వారు తిన్నగా వైకుంఠానికి వెళ్తారని, మోక్షం పొందుతారని పూరాణాలు చెప్తున్నాయి.























సూర్యుడు ధనూరాశిలో ఉండే ధనుర్మాసంలో, శుక్ల ఏకాదశినాడు, ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని శ్రీమన్నారాయణుని దర్శనం కోసం బ్రహ్మ వైకుంఠానికి వెళ్లాడు. రావణాసురునితో పీడింపబడుతున్న దేవతలంతా దుఃఖంతో తమ కష్టాలు చెప్పుకోవడానికి వైకుంఠానికి చేరారు. ప్రభాతకాలంలో ఉత్తరద్వారం దగ్గర స్వామివారి దర్శనం కోసం నిలబడ్డాడు. 

అప్పుడు నారాయణుడు వారికి దర్శనం ఇచ్చాడు. దేవతలు ఆయనను స్తుతించి, అనుగ్రహాన్ని పొందారు. ముక్కోటి దేవతలూ స్వామిని దర్శించిన ఏకాదశి కనుక ఇది ముక్కోటి ఏకాదశి అయింది. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాలకు తూర్పున సింహద్వారం, మిగిలిన దిక్కుల్లో కూడా ద్వారాలు ఉంటాయి. ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వారం నుండి ప్రవేశించి, ప్రభాతవేళ స్వామిదర్శనం చేసుకోవాలి. 

స్వామివారు దేవేరుల ఉత్సవ విగ్రహాలను ఉత్తర ముఖంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా ఉంచుతారు కనుక దీనిని ఉత్తరద్వార దర్శనం అంటారు. 
సంవత్సరానికి పన్నెండు నెలలు. సూర్యుని గమనాన్ని బట్టి మొదటి ఆరు నెలలు ఉత్తరాయణం, తరువాత ఆరునెలలు దక్షిణాయనం అవుతుంది. మానవులు ఉత్తరాయణంలో దేవకార్యాలకు, దక్షిణాయనంలో పితృకార్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశాడు.

కృత్యోత్సవం తథా భూతం ఏకాదశ్యాం విశేషతః
విశంతి మోక్షం తస్మాత్ స మోక్షత్సవ ఇతీర్యతే ॥
ముక్కోటి ఏకాదశి వేకువజామున ఉత్తరద్వారం నుండి శ్రీమహావిష్ణుదర్శనం చేసుకొన్నవారికి మోక్షం తప్పక లభిస్తుంది. కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు. వైఖానసుడు అనే రాజు రాజకార్య నిమగ్నుడై దేవతలను, పితృదేవతలను పూజించటం మానేశాడు. దాంతో పితృదేవతలు దుఃఖంతో కలలో కనబడ్డారు. 

‘నాయనా! నీవు దేవతార్చన, పితృదేవతార్చన చేయకపోవడం వలన మాకు ఉత్తమలోకాలు లభించటం లేదు. వైకుంఠ ఏకాదశినాడు స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకొని ‘ఏకాదశీవ్రతం’ ఆచరించి, ఆ ఫలాన్ని ధారపోస్తే మాకు పుణ్యలోకాలు, నీకు ముక్తి లభిస్తాయి’ అన్నారు. వైఖానసుడు వారు చెప్పినట్లు చేశాడు. ఐహిక బాధ్యతలతో మునిగి దేవపితృకార్యాలను మరచిపోయే వారికి ముక్కోటి ఏకాదశి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. 

అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండూ భగవంతుని యందు లగ్నం చేసి, ఏకాదశీవ్రతం చేసినవారికి తప్పక ముక్తి లభిస్తుంది. ఇహం కోసం పరాన్నీ, పరం కోసం ఇహాన్నీ నిర్లక్ష్యం చేయకుండా మానవుడు సమతూకంగా జీవించి, జన్మను సార్థకం చేసుకోవాలి. ముక్కోటిఏకాదశి మనకు ఇచ్చే సందేశం ఇదే.

Friday, December 21, 2012

ప్రసవం తర్వాత అధిక బరువును తగ్గించడం ఎలా...!

సాధారణంగా మహిళలు ప్రసవం తర్వాత బరువు పెరుగుతారా? సిజేరియన్ అయినా? సాధారణ డెలివరీ అయినా బరువు పెరగాల్సిందేనా? అంటే.. కాదని అంటున్నారు వైద్యులు. ఆహార నియమాలు, వ్యాయామంతో నాజూగ్గా ఉండొచ్చని పేర్కొంటున్నారు. డెలివరీ తర్వాత 4-5 నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం, నెయ్యి, స్వీట్లు లాంటి కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. నిత్యం వ్యాయామం చేస్తూ, పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవచ్చు.

best tips postnatal weight loss

గర్భందాల్చిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు బిడ్డ బరువుతో కలిపి మహిళలు 9-12 కిలోలు బరువు పెరుగుతారు. డెలివరీ తరువాత తల్లి గర్భంలో ఉండే ఉమ్మనీరు, యూట్రస్ వల్ల 5-6 కిలోల వరకు బరువు అధికంగా ఉంటారు. ఈ బరువు కూడా ఆరు నెలల్లో తగ్గిపోయి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు. డెలివరీ అయిన తర్వాత పూర్తిగా విశ్రాంతి కల్పిస్తారు. ఈ సమయంలో ఎక్కువగా కార్బోహైవూడేట్లు ఉండే ఆహారం తీసుకున్నా.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు.

అధిక బరువుతో అనర్థాలు:

సాధారణ డెలివరీ అయితే వారం రోజుల తర్వాత, అదే సిజేరియన్ అయితే 10 రోజుల తరువాత సాధారణంగా అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం కూడా చేయడం వల్ల బరువు పెరగకుండా జాగ్రతపడొచ్చు. సిజేరియన్ అయిన వాళ్లలో ఇంటి పనులు చేసినా, వ్యాయామం చేసినా మంచిది కాదనే అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో పెరిగిన బరువులో 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు వల్ల మధుమేహం, హైపర్‌టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వొచ్చు.వ్యాయామం ఉత్తమం: వ్యాయామంతో శరీరంలో రక్తవూపసరణ, జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడంతో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వ్యాయామం చేయలేనివారు రోజుకు కనీసం గంటపాటు వాకింగ్ చేయాలి. ఇవి కాకుండా థైరాయిడ్ సమస్య వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రతలు:

1. సాధారణ డెలివరీ అయితే వారం రోజులు, సిజేరియన్ అయితే పది రోజుల తరువాత వ్యాయామం, వాకింగ్ చేయవచ్చు.

2. డెలివరీ అయిన ఆరువారాల తరువాత మళ్లీ సాధారణ వైవాహిక జీవితం గడపొచ్చు.

3. డెలివరీ తరువాత 10 రోజులకు మించి విశ్రాంతి తీసుకోవద్దు.

4. కార్బోహైవూడేట్లు తక్కువగా ఆహారం తీసుకోవాలి.

4. ప్రొటీన్లు, పాలు, గుడ్లు, చేపలు, నానబెట్టిన గింజలు తీసుకోవాలి.

5. పండ్లు, పళ్లరసాలు, తాజా కూరగాయలు తీసుకోవాలి.

ఏ సమయంలో ఏం తినాలి:

1. ఉదయం:
అల్పాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉన్న పదార్థాలుంటే మేలు. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ, ఉప్మా, రొట్టెలు, దోశ, పాలు, ఏదైనా పండు తింటే మంచిది.పీచుపదార్థాలు: యాపిల్స్, నారింజ, క్యారెట్ ముక్కలు, బాదం, పిస్తా వివిధ రూపాల్లో తీసుకోవాలి.

2. మధ్యాహ్నం:
అన్నం, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. ఐరన్, కార్బోహైవూడేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కూరల్లో పాలకూర, ఆకుపచ్చటి కూరగాయలు తినాలి.

సాయంత్రం:
పండ్ల రసాలు, పుచ్చకాయ, క్యారెట్ రసం, పాలు తీసుకోవాలి.

3. రాత్రి: బియ్యం, పప్పుధాన్యాలుతో పాటు కోడిగుడ్డు తీసుకోవాలి. రాత్రి పది గంటల తరువాత ఆహారం తీసుకోవద్దు.

పని చేసుకోవచ్చు:
డెలివరీ అయిన వారం, పది రోజుల తరువాత అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం చేస్తూ.. ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. మోడలింగ్, సినిమా రంగానికి చెందినవారు లైపోసక్షన్, ప్లాస్టిక్ సర్జరీల వల్ల మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు.

ఊబకాయం వున్నవాళ్ళు ఆహారం, వ్యాయామం ఎలా ఉండాలి?

ఊబకాయం వున్నప్పుడు ఆహార నియమావళికి, వ్యాయామానికి మారడం అసాధ్యంలా అనిపిస్తుంది. ఐతే ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ప్రతిబంధకాల నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం దాన్ని ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, మంచి వ్యాయామ నియమావళి తో ఎదుర్కోవడమే.

How Diet Exercise With Obesity

చర్యలు:

1. మొట్టమొదటి చర్య ఈ సవాలుకు భయపడకుండా ఉండడమే. ఒక పర్వతం అధిరోహించాలంటే ఎవరికైనా భయమేస్తుంది, కానీ మీ లక్ష్యం కష్ట సాధ్యమే కానీ అసాధ్యం కాదని తెలుసుకోవడం మిమ్మల్ని ఒక సానుకూల ధోరణి లోకి తీసుకువెళ్తుంది.

2. తరువాత మరింత అభివృద్ది చేసేలా మొదట్లో చిన్న చిన్న చర్యలు తీసుకోండి. బాగా తీవ్రంగా ఆహార వ్యాయామ ప్రణాళిక లోకి వెళ్ళిపోవడం చాలా ప్రలోభ పెడుతుంది కానీ మీరు పరిగెత్తలేనంత వేగంగా వెళ్ళడ౦ వల్ల ఉపయోగం వుండదు.

3. వ్యాయామాన్ని దైనందిన చర్యగా మార్చుకోండి. చర్విత చర్వణమే అయినా వాహనాలపై వెళ్ళే కంటే నడవడం, లిఫ్ట్ ఎక్కే బదులు మెట్లు ఎక్కడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చాల తేడా చూపిస్తాయి.

4. భోజనం మానేయకండి. అది అనారోగ్యకరమే కాక అరుదుగా పనిచేస్తుంది.

5. క్రమంగా మీరు రోజూ తినే పరిమాణాన్ని తగ్గిస్తూ, మీ పని స్థాయిని పెంచుకుంటూ వెళ్ళండి.

6. మీకు నచ్చే ఆరోగ్యకరమైన ఆహారం తినండి. చాలా పళ్ళు రుచిగా వుండి మిఠాయిలకు ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.


చిట్కాలు:

1. వ్యాయామం వల్ల వచ్చే ప్రయోజనాలు గుర్తుంచుకోండి. వ్యాయామం చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు, అది ఎటువంటి ప్రయోజనాలు కలిగించట్లేదని కూడా అనిపించవచ్చు; కానీ వ్యాయామం మీ జీవ క్రియను వేగిరపరుస్తుంది - అంటే చేయడం ఆపివేసిన చాలా సేపటి తర్వాత కూడా అది మీ కాలరీలు కరిగేలా చేస్తుంది.

2. వ్యాయామం, ఆహారం మీ శరీరంలోకి ఎండార్ఫిన్ లను వదిలి మీకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మీరు మరింత ఆరోగ్యంగా తయారై మీ రూపం మీ ఆత్మ విశ్వాసం స్థాయిని పెంచుతుంది.

3. క్రమంగా, మీరు తక్కువ తినడం వల్ల, మీ ఉదరం తక్కువ పరిమాణంలో ఆహారానికి సర్దుకుని సైజు తగ్గుతుంది. దీని వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపించి మీకు ఆకలి తక్కువగా వేస్తుంది.

హెచ్చరికలు :

1. ఇది జీవన శైలిలో మార్పని గుర్తుంచుకోవడం ముఖ్యం. సమస్య కాస్త తగ్గినట్టు అనిపించగానే మీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే ఈ ప్రయత్నం అంతా చేయడం వ్యర్ధమే అవుతుంది.

2. మీ కుటుంబం, స్నేహితులు మీ కొత్త రూపం మీద వ్యాఖ్య చేయడానికి చాలా నెలలు పట్టవచ్చు. ఈ సమయం వల్ల నిరుత్సాహ పడకండి ఎందుకంటే వ్యాయామం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీరు ఆరోగ్యంగా చురుగ్గా వున్నట్టు అనిపిస్తుంది.మీ పైన మీరు మరీ వత్తిడి పెంచుకోకండి. మీకు అనుకూలమైన వేగం లోనే వెళ్ళండి.

 

వ్యాయామం తర్వాత తినకూడని ఆహారాలు...

సాధారణంగా ప్రతి రోజూ వ్యాయామం తర్వాత తీసుకొనే ఆహారం ఆరోగ్యపరంగా శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది.వ్యాయామం రూపంలో బాగా శారీరక శ్రమ చేశాక ఏం తినాలో, ఏం తినకూడదో అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. చెమటలు కక్కుతూ జిమ్ బయటకు రాగానే పొగలు కక్కుతూ ఉండే తమకిష్టమైన ఆహారం తీసుకోవచ్చా లేదా అని తికమకపడుతుంటారు. ఈ విషయంలో కొమ్ములు... అదే... కండలు తిరిగిన వీరులు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి సందేహాలను తీర్చడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

వ్యాయామం తర్వాత ఏం తినాలి, ఏ వేళలో తినాలి అన్న విషయం చాలా ప్రధానం. అది తెలుసుకోకపోతే చాలా సందర్భాల్లో కండలూ, బరువునే కాదు... శక్తినీ, పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మంచి వ్యాయామం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉంటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం.

ఆకుకూరలు, చేపలు, చికెన్, జ్యూసులు, నీళ్ళు, ఉప్పు కలిపిన నిమ్మరసం వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది వీటితో వ్యాయామం తర్వాత మన శరీరానికి ప్రోటీన్లు అవసరమని గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తలచుకుంటే తొలుత స్ఫురించేవి చికెన్, చేపలు. వాటిలోని పోషకాలు బాడీబిల్డింగ్‌కు, కండరాల టోన్ నిర్వహణకు ఉపయోగపడతాయి. మరి వ్యాయమం తర్వాత తీసుకొనే ఆహరం గురించి తెలుసుకొన్నాం. వ్యాయామం తర్వాత తీసుకోకూడని ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

 
చీజ్


చీజ్ లో శాచురేటెడ్ పదార్థాలు ఎక్కువగా కలిగి ఉండం చేత, వ్యాయామం చేసి వచ్చిన వెంటనే కొంత విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం తర్వాత చీజ్ తో తయారు చేసిన ఎటువంటి ఆహారాలను తీసుకోకపోవడానికి ఆరోగ్యానికి చాలా మంచిది.


ఫ్రైడ్ చికెన్

వ్యాయామం చేసిన వెంటనే ఫ్రై చేసిన మాంసాహారాన్ని తినకూడదు. అంతే కాదు మాంసాహారంతో తయారు చేసి స్నాక్స్ కు దూరంగా ఉండాలి. అలా కాకుండా ఉడికించిన చికెన్ లేదా ఉడికించిన చేపలు నిరభ్యంతరంగా తినబోదు.


ధాన్యాలు



తణధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వ్యాయామం చేసిన వెంటనే వీటిని తినకూడదు. వీటి బదలు నట్స్, పండ్లను తినవచ్చు.


బ్రెడ్


బ్రెడ్, సాండ్ విచ్ వంటి స్నాక్స్ తినడం వల్ల శరీరంలోని రక్తంలోనికి చక్కరెలు త్వరగా అందుతాయి. వ్యాయం తర్వాత వెంటనే తినే ఆహారాల వల్ల విడుదలయ్యే చక్కెర స్థాయిలు శరీరానికి హానీ కలిగిస్తాయి.

 

పండ్ల రసం
వ్యాయామం చేసి వెంటనే చెమటు ఎక్కువగా బయటకు నెట్టబడుతాయి. అందుకోసం జ్యూస్ తాగాలనుకోవడం చాలా పొరపాటు. ఈ జ్యూస్ లలో ఉన్న చక్కర పదార్థాలు దేహంలో త్వరగా చేరుతుంది. దాంతో శరీరంలో చక్కర స్థాయిలు ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉండటం చేతా వ్యాయం చేసిన వెంటనే పండ్లరసం తీసుకోకపోవడమే మంచిది.

గుడ్డు
గుడ్డు ఆరోగ్యానికి మంచిది. అయితే వ్యాయామం తర్వాత దీన్ని ఫ్రై చేసి తినకూడదు. ఫ్రై చేసి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో నూనె పదార్థాలు కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.



మిక్క్ షేక్


మిల్క్ షేక్ తాగడానికి చాలా రుచికరంగా ఉంటుంది, అయితే వ్యాయమం తర్వాత ఈ మిల్క్ షేక్ ను తాగడం వల్ల వ్యాయమం చేసినంత ప్రయోజనం శరీరానికి ఉండదు.



పచ్చి కూరగాయలు

పచ్చికూరగాల్లో అధిక పోషకపదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని వ్యాయామం చేసిన వెంటనే తినకూడదు. పచ్చికూరగాయలను వ్యాయామం తర్వాత వెంటనే తినడం వల్ల కండర శక్తి తగ్గిపోతుంది.

గ్రిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్-క్రిస్మస్ స్పెషల్

సాధారణంగా ఫిష్ వంటలంటే చాలా మాసాహారులకు చాలా ఇష్టం. అందులోనూ ఫిష్ మసాలా అంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఎర్రగా ఉండే గ్రేవి, డీఫ్ ఫ్రై చేసిన ఫిష్ ఫిల్లెట్..ఇలా ఒకటేమిటి. వివిధ రుచులు. అయితే ఎప్పుడూ రొటీన్ గా తయారు చేసే ఫిష్ వంటకాలకు భిన్నంగా ఇండియన్ స్టైల్ లో తయారు చేసుకొని గ్రిల్డ్ ఫిష్ మసాలా చాలా అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందులోనూ ఇండియన్ మసాలాలు వాడటంతో మరింత టేస్టీగా ఉంటుంది.

గ్రిల్డ్ స్నాక్స్ అన్నీ కాంటినెంటల్ స్టైల్లో వండుతారు. అదే స్టైల్లో గ్రిల్డ్ మసాలా ఫిష్ అద్భుతమైన టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం....

christmas special grilled masala fish fillets

కావలసిన పదార్థాలు:

పాంప్రెట్ ఫిస్ ఫిల్లెట్: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1 pinch
అజ్వైన్(ఇంగువ): 1/2 tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీల వరకూ వేడి చేయాలి.

2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసి తడి ఆరనివ్వాలి. శుభ్రం చేసిన ఫిష్ ఫిల్లెట్ మీద ఉప్పు, పసుపు చిలకరించు పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ధనియాలపొడి మరియు జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు శుభ్రం చేసి ఉప్పు పట్టించి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ ను ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మ్యారినేట్(చేపమొత్తానికి బాగా పట్టించాలి)చేసి దాని మీద కొంచె అజ్వైన్ మరియు నిమ్మరసం చిలకరించి ఇరవై నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

5. ఇరవై నిముషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని ఫిష్ ఫిల్లెట్ మీద నూనెను చిలకరించి ఓవెన్ గ్రిల్లింగ్ రాక్ మీద పెట్టాలి.

6. 60డిగ్రీల హీట్ పెట్టి 15-20నిముషాల పాటు ఫిఫ్ ను గ్రిల్(బేక్) చేయాలి. మద్య మద్యలో ఫిష్ ను అన్ని పక్కలకూ తిప్పుతూ బాగా కాలేలా చూసుకోవాలి. అంతే గిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్ తయారైన వెంటనే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

పది నిముషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ - ఫ్రూట్ వ్రాప్

గుడ్లు, సాండ్ విచ్ మరియు పోహ వంటి అతి సులభంగా, అతి త్వరగా తయారైయ్యే బ్రేక్ ఫాస్ట్ రిసిపీలన్నీ మనం ప్రయత్నించే ఉంటాం. అయితే వీటిలో ఏ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరం. త్వరగా అయ్యే రిసిపి మాత్రమే కాదు ఆరోగ్యానికి, ఉపయోగపడే ఈ ఫ్రూట్ వ్యాప్ చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ ఫ్రూట్ వ్రాప్ రిసిపి పది నిముషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, అయితే బ్రేక్ ఫాస్ట్ మాత్రం మిస్ చేయకూడదు అనుకొనే వాళ్ళకి ఇది ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకు ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ పండ్లను అన్నింటిని ఉపయోగించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసేయవచ్చు.

మరి మీరూ ప్రయత్నించండి. టేస్ట్ చూడండి...



easy fruit wrap breakfast 10 mins

కావలసిన పదార్థాలు:


రోటీ: 2
ఆపిల్: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ద్రాక్ష: 5
దానిమ్మ(గింజలు): 2tbsp
పీయర్(బేరికాయ): 1/2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అరటి పండు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మొయోనైజ్: 1tbsp
చాల్ మసాలా: 1/2tsp


తయారు చేయు విధానం:

1. చాలా మంది ఇళ్ళలో ముందు రోజు రాత్రి తయారు చేసిన చపాతీలు ఒకటో రెండో మిగిలే ఉంటాయి. వాటితో తయారు చేసుకోవచ్చు. బిజీ లైఫ్ లో ఆఫీసుల, స్కూల్స్, కాలేజ్ లు అని టైమ్ లేని వాళ్ళు బయట రెడీమేడ్ లో దొరికే చపాతీలను తీసుకొచ్చు స్టాక్ పెట్టుకోవచ్చు.

2. పైన ఇచ్చిన వస్తువుల్లో పండ్లు అన్నింటీని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

3. కొన్ని గింజలున్న కాయలను పూర్తిగా కట్ తీసేయకండి గుప్పెడు అయితే సరిపోతాయి. కాబట్టి ఎంత అవసరమో అంతమాత్రం కాయనుండి గింజలను వేరు చేసి పెట్టుకోండి.

4. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

5. ఇప్పుడు చపాతీలకు మొయోనైజ్ ను రాసి, దాని మీద కొంచె ఉప్పును చిలకరించాలి.

6. తర్వాత ఒక్కో చపాతీ మీద పండ్ల మిశ్రమాన్ని కావల్సినంత స్ప్రెడ్ చేయాలి.

7. ఈ ప్రూట్ చపాతీని రోల్ చేసి తినేయాలి అంతే సింపుల్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.

మీకు మంచి సువాస కావలనుకొంటే పుదీనా ఆకులను కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు.