all

Wednesday, July 3, 2013

మొటిమల మచ్చలను నిర్మూలించడానికి 10నేచురల్ టిప్స్!

మొటిమల మచ్చలను సహజంగా తొలగించడానికి ఎన్నో విధానాలు ఉన్నాయి. యుక్తవయస్సులోని శరీరం చురుకుగా హార్మోన్ల ఉత్పత్తి చెయ్యడం వల్ల సెబమ్ అనబడే పదార్ధం చర్మం పై ఎక్కువ అవుతుంది. దీని వాళ్ళ మొటిమలు వస్తాయి. మొటిమల మచ్చలని తొలగించడానికి ఎన్నో రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పటికీ సహజమైన పద్దతులని పాటించడం వల్ల ఎంతో సమయాన్ని అలాగే డబ్బుని అదా చేసుకోవచ్చు. సమయం గడిచే కొద్దీ ఈ చికిత్సా పద్దతుల వల్ల చర్మంపై ఉన్న మొటిమల మచ్చలు తగ్గిపోతూ ఉంటాయి.

మొటిమల మచ్చలను సహజంగా నిర్మూలించడం ఎలా ?

హైడ్రేషన్ - మొటిమల మచ్చలను తొలగించడం లో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుందని నిరుపితమయింది. అనవసరమైన మృత చర్మ కణాలను చర్మం విసర్జించడానికి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.



మెంతి ఆకులని రుబ్బి పేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. కొంత సేపు ఆరనిచ్చి, ముఖాన్ని కడగాలి. మొటిమలని తొలగించడానికి ఇదే పద్దతి కొన్ని రోజులపాటు పాటించాలి. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది.



పళ్ళు అలాగే కూరగాయలు ఎక్కువ మొత్తం లో విటమిన్లని అలాగే మినరల్స్ ని కలిగి ఉండటం వల్ల చర్మపు కాంతిని తిరిగి పొందేందుకు తోడ్పడతాయి. శరీరం హైడ్రేట్ అవడానికి తగినంత రసాలు అవి కలిగి ఉంటాయి. చర్మం ఆరోగ్యకరంగా ఉండేందుకు ఎక్కువ పళ్ళు అలాగే కూరగాయలు తీసుకోవాలి. మొటిమల మచ్చలు కూడా తొలగిపోతాయి.




మొటిమలని తొలగించడం లో ఆలో విరా సహజమైన ప్రకృతి చికిత్స. మొటిమల మచ్చలపై లావెండర్ ఆయిల్ వంటి వివిధ రకాల ముఖ్యమైన నూనె లని అప్లై చెయ్యడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. ఇవి అత్యంత ఖరీదైనవి కావు. మార్కెట్ లో సులభంగా లభిస్తాయి. వీటిని తరచూ వాడటం వలన ఎంతో మెరుగుదల ని గమనించవచ్చు.



మొటిమల మచ్చలని మసాజ్ చెయ్యండి. మసాజ్ వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి మచ్చలు కలిగిన ఈ ప్రాంతానికి పోషకాలు చేరుకుంటాయి. అంతే కాకుండా, మచ్చల కణ జాలం ని విచ్చిన్నం చెయ్యడానికి కూడా ఈ మసాజ్ ఉపయోగపడుతుంది.



మీ ముని వేళ్ళపై కొన్ని చుక్కల రోజ్ హిప్ సీడ్ ఆయిల్ ని వేసుకుని. మొటిమల మచ్చలపై సుతారంగా రబ్ చెయ్యండి. ప్రతి రెండు రోజులకు ఒకసారి వల్ల మొటిమల మచ్చలను నిర్మూలించేందుకు ఈ విధానాన్నివాడండి. హెల్త్ ఫుడ్ స్టోర్స్ లో రోజ్ హిప్ సీడ్ ఆయిల్ లభ్యం అవుతుంది.




ఒక కప్పు పాలు ని చిక్కగా కాచి అందులో కొంత నిమ్మరసాన్ని కలపాలి. పొయ్య మీద నుండి తీసి కొంత సేపు చల్లారడానికి గరిటతో తిప్పుతూ ఉండాలి. ఆ వచ్చిన పేస్టు ని నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోవాలి. ఒక గంట తరువాత లేదా మరునాడు ఉదయం ముఖాన్ని కడుక్కోవాలి. ఇది పాటించడం వల్ల చర్మం మృదువు గా మారుతుంది.



రోజ్ వాటర్ తో గంధపు పేస్టు ని కలిపి చర్మంపై మొటిమల మచ్చలు కలిగిన చోట అప్లై చెయ్యాలి. రాత్రంతా అలాగే ఉంచి మరునాడు ఉదయం చల్లటి నీళ్ళతో కడగాలి.




రోజుని తియ్యగా మార్చే శక్తి కలిగినట్టే తేనె కి చర్మాన్ని కూడా ప్రకాశవంతంగా మార్చే శక్తి ఉంది. చర్మం పై న దెబ్బ తిన్న ప్రదేశాలలో ఈ తేనె ని అప్లై చెయ్యడం వల్ల మొటిమల మచ్చలు తొలగిపోతాయి. చర్మం యవ్వనగా కనబడుతుంది.




కొంత నీళ్ళతో బేకింగ్ వాటర్ ని కలిపి పేస్టు లాగా చేసుకోవాలి. మొటిమల మచ్చలపై అప్లై చేసే ముందు ఈ పేస్టు నురగ లాగా వచ్చే వరకు ఆగాలి. వృత్తాకార కదలికల లో ఈ పేస్టు ని చర్మం పై అప్లై చేసి కొంత సేపు తరువాత స్వచ్చటి నీళ్ళతో కడగాలి.

స్వచ్చమైన చర్మం పొందడానికి ఫేస్ స్టీమింగ్ టిప్స్..!

ఫేస్ స్టీమింగ్ (ఆవిరి పట్టడం)ముఖానికి స్టీమింగ్ చేయడం చాలా మంచిది. స్టీమింగ్ వల్ల చర్మంలో ఉన్న మలినాలు, దుమ్ము, దూళి తొలగిపోయి, చర్మరంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మ గ్రంధులను శుభ్రపరుస్తుంది. ఆవిరి పట్టడం లేదా స్టీమింగ్‍ చేయడం ద్వారా మూసుకుపోయిన రంధ్రాలను తెరిచి, blackheads and whiteheads రిమూవ్‍ చేయవచ్చు, ఇంకా పింపుల్స్ రాకుండా నిరోధించవచ్చు. చర్మ రంధ్రాలకు దుమ్ము, ధూలి అడ్డుపడితే అది చర్మానికి చికాకు కలిగిస్తుంది, దాంతో ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది. చర్మ రంధ్రాలు తెరచుకోవడం వల్ల మెటిమలకు దారితీస్తుంది.

అందువల్ల చర్మంలోని దుమ్ము, ధూళి, మరియు మృత కణాలను తొలగించడానికి ముఖానికి స్టీమింగ్ (ఆవిరి పట్టడం)ఒక అద్భుతమైన మార్గం.స్టీమింగ్ (ముఖానికి ఆవిరి పట్టడం)ద్వారా ముఖ చర్మం లోపల మరియు చర్మ మీద(బయట) శుభ్రం అవుతుంది. ఫేస్ స్టీమింగ్ వల్ల ఆవిరి పట్టిన ప్రదేశంలో చెమట పడుతుంది. దాంతో చర్మంలో దాగి ఉన్న దుమ్ము, ధూళి, మురికి మరియు శిధిలాలు బయటకు నెట్టివేయబడుతుంది. ఫేస్ స్టీమింగ్ చాలా సులభ పద్దతి.

ఈ పద్దతిని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు.ఫేస్ స్టీమింగ్ కోసం కొన్ని డిఫరెంట్ పద్దతులు..


హాట్ వాటర్ స్టీమింగ్: ఫేస్ స్టీమింగ్, ముందుగా మీ కురులను హెయిర్ బ్యాండ్ లేదా హెయిర్ రిబ్బన్ తో ముడి వేసుకోవాలి. తర్వాత చిన్న పాట్(కుండ)తీసుకొని అందులో కొద్దిగా నీరు నింపాలి. ఈ నీటిని బాగా వేడి చేయాలి. నీరు బాగా వేడయ్యాక, నీటి ముడగలు క్రిందిపోయేందుకు టెంపరేచర్ ను తగ్గించుకోవాలి. తర్వాత కుండలోని నీటిని మరో గిన్నెలోని మార్చుకొని ఈ వేడి నీటిని టేబుల్ మీద పెట్టాలి. తర్వాత తల, ముఖం కవర్ అయ్యేలా ఒక టవల్ ను పూర్తిగా కప్పుకోవాలి. (లేదంటే ఆవిరి మొత్తం బయటకు పోతుంది. దాంతో త్వరగా నీరు చల్లబడిపోతాయి). ముఖాన్ని వేడినీటి గిన్నెకు దగ్గరగా పెట్టాలి. టెంపరేచర్ తగ్గే కొద్దీ ఇలా తలను క్రింది(గిన్నెకు దగ్గర)కి వంచుతూ పోవాలి. ఇలా 10-15నిముషాలు ఆవిరి పట్టాలి. తర్వాత ఒక కాటన్ వస్త్రంతో చెమటను అంత తుడవాలి . తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొని పత్తిని తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ వేసి ముఖాన్ని తుడవాలి.


హెర్బల్ స్టీమింగ్: మీరు స్టీమింగ్ చేసే నీటిలో కొన్ని మూలికలు వేసి స్టీమ్ చేయవచ్చు. దాంతో హెర్బల్ ఫేస్ స్టీమ్ చేసుకోవచ్చు. మొదటి పద్దతి ప్రకారమే నీరు కాచే కుండలోనే నీటితో పాటు హెర్బ్స్ ను కూడా వేసి ఉడికించుకోవాలి. మీకు పొడి చర్మం కలవారైతే లావెండర్ లేదా చమోమైల్ హెర్బల్స్ చాలా ఉపయోగకరం. మీ చర్మం జిడ్డు చర్మం అయితే సేజ్ లేదా రోస్మెరీ బాగా సహాయపడుతుంది. మీది సాధారణ చర్మం అయితే లావెండర్ లేదా రోజ్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి.


స్టీమ్ ఐరన్: నీరును బాయిల్ చేయడాని కంటే, మీరు స్టీమ్ ఐరన్ ను పద్దతిని పాటించవచ్చు . ఈ స్టీమ్ ఐరన్ మీ ముఖానికి ఆవిరి పట్టించడంలో అద్భుతమైన మార్గం. ఇది చర్మంలో దాగి ఉన్న మలినాలంటినీ తొలగిస్తుంది. చర్మ రంధ్రాల్లో ఉన్న దుమ్మును తొలగిస్తాయి. చర్మాన్ని స్వచ్ఛమైనదిగా మరియు తాజాగా ఉంచుతుంది. స్టీమ్ ఐరన్ తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మర్చిపోకండి.



వాటర్ వాపొరైజర్: వాటర్ వాపొరైజర్ ను ఉపయోగించి వాటర్ స్టీమ్ చేయడం చాలా ప్రభావంతమైన మార్గం. మీ ముఖానికి చాలా తేలికగా మరియు సులభంగా ఆవిరి పట్టవచ్చు. వాటర్ వాపొరైజర్ మీరు స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోవచ్చు. స్నానం నుండి వచ్చే ఆవిరి మీ ముఖం పరిశుద్ధమైనదిగా మరియు రిఫ్రెష్ గా మార్చుతుంది.



స్టీమ్ షవర్: షవర్ ను బాత్ చేస్తున్నప్పుడు నీళ్ళు వేడిగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి స్టీమ్ బాత్ చేయానుకొన్నప్పుడు బాత్ రూమ్ కు ఎక్కడా చిన్న గ్యాప్ లేకుండా చేసుకోవాలి. డోర్స్ మరియు ఫ్లోర్ వద్ద గ్యాప్ లేకుండా చేసుకోవాలి. తర్వాత స్నానం చేయడం వల్ల ముఖం ఆవిరి పట్టి శరీరం మొత్తం చెమటలు పట్టడం మొదలవుతుంది. దాంతో చెమట రూపంలో శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు విసర్జింపబడుతాయి. ఫేస్ట్ స్టీమ్ కు ఇది ఒక అద్భుతమైన మార్గం. మీ ముఖ చర్మం శుభ్రం చేసుకొన్న తర్వాత మామిశ్చరైజర్ ను రాయడం మర్చిపోకండి.


ముగింపు: ఇవన్నీ కూడా చాలా సులభంగా మీ ముఖ చర్మానికి స్టీమింగ్ చేసే పద్ధతులు. మీ ముఖానికి తరుచూ ఆవిరి పట్టడం వల్ల మీ ముఖంలో మెరుపు సంతరించుకుంటుంది.

మీ జుట్టు వేగంగా, పొడవుగా పెరగాలంటే?10 టిప్స్

అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవాటి జుట్టు కలిగి ఉండావలని ప్రతి అమ్మాయి డ్రీమ్. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకోగలరు.

ఎందుకంటే, జుట్టు వేగంగా, మరియు మందంగా పెంచుకోవాలంటే అందుకు చాలా ప్రయత్నం చేయాలి.జుట్టు పెరుగుదల దాని సొంత సమూహాన్ని కలిగి ఉంటుంది. కేశాలకు సరైన పోషణ(తలకు తరచూ నూనె పెట్టడం, కండీషన్, షాంపు, డైటై) అంధించడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుందని మనందరికీ తెలుసు. అందుకు మనం చాలా స్టెప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ బిజీ షెడ్యూల్లో, జుట్టు పెరుగుదలకు ఇవన్నీ చేయాల్సంటే కొద్దిగా అగ్ని పరీక్షవంటిదే. అయితే, పాత ఫ్యాషన్ కృషి లేకుండా నిజంగా ఏదీ జరగదు.

ఏమైనా మీ జుట్టు వేడి మరియు కాలుష్యం యొక్క తీవ్రతను భరించలేకపోవడం కూడా జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది. మీరు నిజంగా మీ జుట్టును వేగంగా మరియు పొడవుగా పెంచుకోవాలనుకుంటే అందుకు కొన్ని అనుసరించాల్సిన సాధారణ దశలు ఉన్నాయి .ఈ దశలన్నీ కూడా సరైన జుట్టు పెరగుదల కోసం మీరు తెలుసుకోవాలి. జుట్టుకు నూనె రాయడం, తలస్నం, పోషకాహారం, వంటివి మీ కేశాలు మీరు అనుకున్నట్లు పెరగడానికి బాగా సహాయపడుతాయి.

బిజీగా ఉన్న మహిళల కోసం ఈ పద్దతులను ఇక్కడ పొందుపరుస్తున్నాం. వీటిన పరిశీలించినట్లైతే మీరు కూడా మీ కేశసంపదను పెంపొందించుకోవచ్చు. మరి ఆ దశలేంటో ఒకసారి చూద్దాం..


తలను రెగ్యులర్ దువ్వాలి: ఒక రోజులో 50 సార్లు కనుక దువ్వెనతో దువ్వడం వల్ల కొత్తగా హెయిర్ ఫాలీ సెల్స్ వ్రుద్దిచెందుతాయి. చాలా వరకూ మనందరూ ఒక రోజులో రెండు సార్లు కంటే ఎక్కువగా దువ్వరు. కాబట్టి ఈ పద్దని మార్చుకోవాలి.


కొంత ఒత్తిడితో బ్రష్ చేయాలి: మీరు హెయిర్ బ్రెష్ ను మీ కేశాలకు ఉపయోగించేటప్పుడు, మీ తల మీద కొంత ఒత్తిడిని కలిగించాలి. దాంతో తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు వేగంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.


నూనె రాయడం: ఆయిలింగ్. కనీసం వారంలో ఒకసారైనా జుట్టుకు నూనె రాయాలి. మీకు వీక్ డేస్ లో సమయం లేకపోతే వీకెండ్ లో తలకు పూర్తిగా నూనె రాసి ఆదివారం ఉదయం తలస్నానం చేసుకోవచ్చు. ఆయిల్ కేశాలకు పోషణను అంధిస్తుంది.

మందార నూనె: సహజంగా లభించే పదార్థాలతో మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా జుట్టు పెరుగుదలలో కూడా. అందుకు కొన్ని మందార పువ్వులు లేదా మొగ్గలను గోరువెచ్చని కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నాననివ్వాలి. తర్వాత ఈ నూనెను తలకు మర్ధన చేయాలి . ఇలా చేయడం వల్ల కేశాలు మందంగా మరియు వేగంగా పెరుగుతాయి.


కేశాలను ముడి వేయడం: నిద్రించే ముందు మీ జుట్టును ఒకసారి దువ్వాలి. తర్వాత జడ లేదా ముడి వేసుకోవాలి. దాంతో కేశాలు చిక్కుబడకుండా, కేశాలకు ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది.


విటమిన్ ఇ రిచ్ ఫుడ్స్: జట్టు పెరుగుదలకు విటమిన్ ఇ రిచ్ ఫుడ్ చాలా బాగా సహాయపడుతాయి. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు ఉదాహరణకు బాదం వంటివి ఎక్కువగా తీసుకోవాలి.



బాదం నూనె: చాలా వరకూ మన భారతీయులు జుట్టు పెరుగుదలకు కొబ్బరినూనె మాత్రమే ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని సహజ నూనెలను కూడా కేశాలకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలలో మార్పులు మీరు గమనించవచ్చు.

వేడినీటితో తలస్నానం చేయకూడదు: హాట్ వాటర్ షవర్ కేశాలను డ్యామేజ్ చేస్తుంది. వేడి నీళ్ళు చర్మ రంధ్రాలను తెరుచుకొనేలా చేస్తుంది. దాంతో జుట్టు అధికంగా రాలడానికి దారితీస్తుంది.



కేశాలను శుభ్రంగా ఉంచుకోవాలి: సాధారణంగా తలస్నానానికి ఎక్కువగా షాంపూను వాడుతుంటారు. అధిక షాంపు వాడకం వల్ల హెయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. కేశాలను శుభ్రం చేసుకోవడానికి ముందు తలకు నూనె రాయడం చాలా అవసరం. తలకు శుభ్రంగా ఉంచుకోవడం కూడా జుట్టు పెరుగుదలకు ముఖ్య కారణం. కాబట్టి వారానికి కనీసం 3సార్లు తలస్నానానికి మన్నికైన షాంపూను వాడండి.


తలకు స్కార్ఫ్: మీరు, కఠిన మైన ఎండ వేడికి బయట తిరగదల్చుకొన్నప్పుడు కఠినమైన సూర్య కిరణాలు మీ కేశాలకు హాని కలిగిస్తాయి. మీ కేశాలలో నాణ్యత లోపిస్తుంది. పెరుదలకు లోపం కలిగిస్తుంది. కాబట్టి సన్ ప్రొటక్షన్ కోసం తలకు స్కార్ఫ్ లేదా హాట్ పెట్టుకోవడం చాలా అవసరం

tip

అజీర్ణ వ్యాధికి: శొంఠి పొడిని బెల్లంతో కలిపి భోజనానికి ముందు తినుచున్నను అజీర్ణ వ్యాధి తగ్గును.

tip

ప్రతీరోజూ ఉదయాన్నే పరగడుపున 10 లేత కరివేపాకుల్ని తింతే అటు జుట్టు లో సరీరంలో కాంతి నిగారింపు వస్తుంది.

tip

పచ్చకర్పూరం నూనెతో మర్దన చేయించుకుంటే, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులనుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

నార్‌తిండియన్...

 

     



పంజాబీల ఫుడ్ హ్యాబిట్స్ పుష్టికరమైనవి.
తిన్నంతా... ఒంటికి పడుతుంది.
మెదడుకు పదునూ పెడుతుంది!
ఏది పడితే అది వండేయరు.
వాళ్ల స్టౌవ్‌ల మీద -ఉడికితే సంప్రదాయం ఉడకాలి.
లేదంటే ‘సీజన్’ ఆవిర్లు వదలాలి.
అర్థం కాలేదా?
ప్రయోగాలు చెయ్యరు. ఓన్లీ ట్రెడిషనల్.
ఏదోఒకటిలే అనుకోరు. ఓన్లీ సీజనల్.
రుచికి, శుచికీ సమాన ప్రాముఖ్యం ఇచ్చేనార్త్ ఇండియన్‌ల ఘుమఘుమలే...
ఈవారం మన ‘రుచులు’.


ఆలూ కీ టిక్కీ

కావలసినవి:
బ్రెడ్‌క్రంబ్స్ - రెండు టేబుల్ స్పూన్లు; చాట్‌మసాలా - టేబుల్ స్పూను; పచ్చిమిర్చి - రెండు; ఉల్లితరుగు - పావుకప్పు; బంగాళదుంపలు - 6; కారం - 2 టేబుల్ స్పూన్లు; రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి తగినంత; వేయించిన పల్లీలు - పావు కప్పు; ఉప్పు - తగినంత; పసుపు - పావు టేబుల్ స్పూను

తయారి:
బంగాళదుంపలను ఉడికించి, తొక్కు తీసి ముక్కలుగా కట్ చేయాలి

ఒకపాత్రలో, బంగాళదుంపముక్కలు, బ్రెడ్ క్రంబ్స్, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, ధనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు, పల్లీలు, చాట్‌మసాలా జతచేయాలి

అన్నిటినీ బాగా మెత్తగా అయ్యేలా చేతితో కలపాలి

కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని అరచేతిలోకి తీసుకుని వడ మాదిరిగా ఒత్తాలి

పాన్‌లో నూనె వేసి వేడయ్యాక, వీటిని అందులో వేసి వేయించాలి.

కార్న్ మసాలా రైస్

కావలసినవి:

బాస్మతి బియ్యం - కప్పు; జీడిపప్పు పలుకులు - 10; కారం - టీ స్పూను; మొక్కజొన్న గింజలు - కప్పు; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; గరంమసాలా - అర టీ స్పూను; బఠాణీ - కప్పు; నిమ్మరసం - టేబుల్ స్పూను; నూనె లేదా నెయ్యి - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; సాంబార్ మసాలా - టీ స్పూను; పంచదార - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను

తయారి:
ఒక పెద్ద పాత్రలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించి, తీసి పక్కన ఉంచాలి

అదే పాత్రలో జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి

మొక్కజొన్న గింజలు, బఠాణీ, బాస్మతి బియ్యం, మసాలాలు వేసి ఒకసారి బాగా కలిపి 5 కప్పుల నీరు పోసి ఉడికించాలి

పూర్తిగా ఉడికిన తర్వాత నిమ్మరసం, పంచదార, కొత్తిమీర, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి వేడిగా సర్వ్ చేయాలి.

పంజాబీ కడీ

కావలసినవి:
మజ్జిగ - రెండు కప్పులు; ధనియాలు - అర టీ స్పూను; ధనియాలపొడి - పావు టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; గరంమసాలా - చిటికెడు; నెయ్యి - టీ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; శనగపిండి - 4 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి - రెండు; కసూరీమేథీ - టీ స్పూన్; మెంతులు - టీ స్పూను; నూనె - తగినంత; ఉల్లితరుగు - పావు కప్పు; కారం - తగినంత; ఉప్పు - తగినంత; పసుపు - టీ స్పూను; రిఫైన్‌డ్ ఆయిల్ - 2టీ స్పూన్లు; నీరు - కొద్దిగా.

తయారి:
ఒక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, ఉల్లితరుగు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొద్దిగా నీరు జత చేసి కలపాలి

స్టౌ మీద బాణలి ఉంచి, నూనె వేసి కాగాక, ఈ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించి పక్కన ఉంచాలి

ఒక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి

అందులో మజ్జిగ వేసి బాగా మెత్తగా అయ్యేలా కలపాలి

స్టౌ మీద బాణలి ఉంచి రిఫైన్‌డ్ ఆయిల్ వేసి కాగాక అందులో మెంతులు, ధనియాలు, అల్లంవెల్లుల్లిపేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి

మజ్జిగ మిశ్రమం వేసి బాగా కలపాలి

కసూరీమేథీ వేసి బాగా కలిపి సన్నని మంట మీద సుమారు అరగంటసేపు ఉడకనివ్వాలి

వేయించి ఉంచుకున్న పకోడీలు వేసి ఐదు నిముషాలు ఉడికించాలి

ఒక పాన్‌లో నెయ్యి వేసి కరిగాక కారం, ధనియాలపొడి, గరంమసాలా వేసి కొద్దిగా వేయించి ఉడికించిన మజ్జిగ మిశ్రమంలో వేయాలి.

పాటియాలా ముర్గ్

కావలసినవి:
ఆమ్లెట్ - 2; చికెన్ - 100 గ్రా.; క్యాప్సికమ్ - 1; ఉల్లితరుగు - ఒకటిన్నర కప్పులు; టొమాటో - 6; జీడిపప్పు - 50 గ్రా.; కారం - కొద్దిగా; జీలకర్రపొడి - టీ స్పూను; గరంమసాలా - టీ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను

తయారి:
జీడిపప్పు, టొమాటో, ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి... వీటిని విడివిడిగా పేస్ట్ చేయాలి ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, వేడయ్యాక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి

ఉల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి

టొమాటో ప్యూరీ వేసి కొద్దిగా ఉడికించాలి

చివరగా జీడిపప్పు పేస్ట్ వేసి అవసరమైతే కొద్దిగా నీరు పోసి ఉడికించాలి

కారం, జీలకర్రపొడి, గరంమసాలా, ఉప్పు వేసి మరోమారు కలపాలి

చికెన్ ముక్కలను ఆమ్లెట్‌లో రోల్ చేయాలి

ముందుగా తయారుచేసి ఉంచుకున్న గ్రేవీలో వేయాలి

మూత ఉంచి సన్నటి సెగ మీద ఐదు నిముషాలు ఉడికించాలి

టొమాటో, ఉల్లిచక్రాలు, క్యాప్సికమ్ చక్రాలతో గార్నిష్‌చేయాలి.

పంజాబీ లస్సీ

కావలసినవి:
క్రీమ్ - 50 గ్రా.; ఐస్ క్యూబ్స్ - 100 గ్రా.; రోజ్ ఎసెన్స్ - కొద్దిగా; పంచదార - 150 గ్రా.; పెరుగు - అర కిలో.

తయారి:
ఒక పెద్ద పాత్రలో పెరుగు, ఐస్ క్యూబ్స్, పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి

పొడవాటి గ్లాసులో తయారు చేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమం, రోజ్ ఎసెన్స్ వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి

సర్వ్ చేసే ముందు క్రీమ్‌తో గార్నిష్ చేయాలి.

ధాబే ది దాల్

కావలసినవి:
మినప్పప్పు - అర కప్పు; రాజ్మా - పావు కప్పు; ఉల్లితరుగు - అర కప్పు; టొమాటో ప్యూరీ - అర కప్పు; వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను; జీలకర్ర - టీ స్పూను; కారం - టేబుల్ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ధనియాలపొడి - 2 టీ స్పూన్లు; తాజా క్రీమ్ - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత.

తయారి:
మినప్పప్పు, రాజ్మాలను విడివిడిగా రాత్రంతా నానబెట్టాలి

మరుసటిరోజు వీటిని కుకర్‌లో ఉంచి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి

చల్లారాక ఒక గరిటెతో వీటిని మెత్తగా అయ్యేలా మెదపాలి

ఒక పాన్‌ను స్టౌ మీద ఉంచి నూనె లేదా బటర్ వేసి కాగాక, వెల్లుల్లి పేస్ట్ వేసి, గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి

టొమాటో ప్యూరీ వేసి నూనె విడేవరకు వేయించాలి

కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు వేసి బాగా వేయించాలి

ఉడికించి, మెత్తగా చేసిన పప్పుల మిశ్రమాన్ని వేయాలి

బాగా ఉడుకుతుండగా, తాజా క్రీమ్ వేసి పది నిముషాలు సన్నటి సెగ మీద ఉంచాలి

రోటీ, నాన్‌లతో తింటే రుచిగా ఉంటుంది.

కర్టెసీ: హోటల్ టైమ్ స్క్వేర్ బ్లూ - బి
హైదరాబాద్


చెఫ్: వాహిద్ ఖాన్

Monday, June 17, 2013

తెల్లజుట్టు రాకుండా....


 
 ముఫ్పయి అయిదేళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం సర్వసాధారణం. అంతకు ముందే జుట్టు తెల్లబడుతూ ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, వేపుళ్లు, మసాలాలు తినడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడు తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని నివారించ గలుగుతాం.

ఒక స్పూన్‌ కర్పూరం పొడిని కొబ్బరినూనెలో కలుపుకొని ప్రతిరోజు తలకి మసాజ్‌ చేసుకోవాలి.
మల్లెతీగ వేర్లని, నిమ్మరసంతో కలిపి గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.

తలస్నానానికి వీలైనంత వరకు కుంకుడు, శీకాయ, హెర్బల్‌ షాంపూలనే వాడాలి. జుట్టుకు తరచూ నూనెతో మసాజ్‌ చేయడం చాలా అవసరం.

వారానికి రెండు-మూడు సార్లు మస్టర్డ్‌ ఆయిల్‌ కానీ, కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.తలస్నానం తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలంతా మసాజ్‌ చేస్తే బ్లడ్‌ సర్క్యులేషన్‌ పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవు తుంది.

కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది. తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపు వస్తుంది.
జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది,,,?
ఈకాలంలో చుండ్రుకు అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా జుట్టు ఎక్కువ శాతం రాలిపోతుంటుంది.
జుట్టు ఈ వాతావరణానికి పేలవంగా, రఫ్‌గనూ తయా రవుతుంది.
తేలికపాటి షాంపూలు కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. కఠినమైన షాంపూలు శిరోజాల్లోని సహజమైన నూనెల్ని హరించి వేస్తాయి.
అలాగే బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్‌ అప్లయి చేయాలి. లేదా కండీషనర్‌ కలిసి ఉన్న షాంపూను ఎంచుకోవాలి.

హెయిర్‌ డ్రయర్‌ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉండాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది.

వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచేయాలి.
కొబ్బరినూనె, నువు్వలు లేదా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వేడిచేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడినీటిలో ముంచిన టవల్‌ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్‌ను వేడినీటిలో ముంచి చుట్టుకుని కొద్దినిమాషాలు ఉంచుకోవాలి.

ఐ క్రీములు వాడితే...


 
NewsListandDetailsచర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా చేయటంలో ఐ క్రీములెంతగానో తోడ్పడుతాయి. ముఖంలో కంటి చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దాని వల్లే ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్‌ ప్రభావం ఉండదు.

ఈ సున్నితమైన చర్మం మాయిశ్చరైజర్‌ తాలూకూ గుణాన్ని గ్రహించదు. ఈ కంటి చుట్టూ ఉండే ప్రాంతాన్ని టిష్యూ పేపర్‌తో పోల్చవచ్చు. మిగతా ముఖంలో ఉండే చర్మాన్ని రైటింగ్‌ పేపర్‌తో పోల్చవచ్చు.

సో... కంటిచుట్టూ ఉండే ప్రాంతంలో వాడే ఏ క్రిములైనా మంచివి, సున్నితమైనవి వాడాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సున్నిత చర్మానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎలాంటి ఐక్రీములు వాడాలో తెలుసుకుందాం.


- లైట్‌ క్రీములు వాడండి. తెలిసి తెలియక మాయిశ్చరైజర్‌లు రాస్తే ఫలితం కనబడదు సరికదా వాపులు లాంటివి రావచ్చు.

- పడుకునే ముందు ఐ క్రీములు వాడండి.

- కనురెప్పలను చాలా శ్రద్ధగా చూసుకోవాలి.

- ఐజెల్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతాయి. అలాంటి వాటితో కంటి క్రింద చారలు, నల్లటి లేయర్లను లేకుండా చేసుకోవచ్చు.

- నైట్‌ క్రీములు చర్మానికి రాసినప్పుడు చర్మకణాలతో కలిసిపోయి చర్మానికి కొత్తదనంతో పాటు పోషకవిలువలు కూడా ఇస్తాయి.

- ఎలాంటివి కొనాలి? ఏ వస్తువులు కొనాలి? బ్యూటీ ఉత్పత్తులు కొనటం తలనొప్పిగా ఉందా?

- క్లెన్సర్‌, టోనర్‌, మాయిశ్చరైజర్‌ లాంటి అందాన్నిచ్చే సౌందర్య ఉత్పత్తులు కొనే ముందు మీకు కావలసిన పోషక పదార్థాలు ఉన్నాయో లేదో చూడండి. అయితే మీ చర్మ తత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీ చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకుని వాడండి. లేదా బ్యూటీషియన్‌ను సంప్రదించండి.

చిన్ని మనసుతో స్నేహంగా...


 
NewsListandDetails 'చిన్ని పసిబుర్రలో ఎన్ని ఆలోచనలో' అంటూ ఒక్కోసారి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకు మురిసిపోతూ, మరొకవైపు ఆశ్యర్యపోతూ ఉంటారు తల్లితండ్రులు. నిజమే పసివయసులో వారికి ప్రత్యేకించి సృజనాత్మకతను నేర్పనవసరంలేదు. వారే అనేక ఆలోచనలకు పునాది వేస్తారు. ఆ పసిమనసు మెదడులో ఎంత ఆలోచనా శక్తి ఉందో ప్రతి తల్లికీ తెలిసే ఉంటుంది. అయితే వారిలోని కళలకు ప్రోత్సాహం ఒక్క పొగడ్తకో, ముద్దుల వర్షంతో ముం చెత్తడానికో పరిమితమై పోకూడదు. వారి సృజనాత్మకతకు ఊతమివ్వాలి. అప్పుడే వారిలోని కళ ఇంటిల్లి పాదికీ కళను తెస్తుంది.
విద్యార్థిగా పరిచయం కాకముందునుంచే ఇంట్లో వాతావరణం, ప్రోత్సాహాన్ని బట్టి చాలా మంది చిన్నారుల్లో అనేక కళలు ఉట్టి పడుతుంటాయి. ఇంటిదగ్గర అప్పటికే చదువుకుంటున్న వారిని చూసి వారి పలక, పుస్తకాలను లాక్కుని పిచ్చిగీతలు గీయడంతో తమ చేతివ్రాత ప్రస్థానాన్ని మొదలుపెడతారు ఈ బుడతలు. ఈ వయసులోనే ఒక్కోసారి ఊహించని రీతిలో వారికి ఆడుకోవడానికి కొని ఇచ్చిన బొమ్మల రూపాలను గీయాలని చూడటం, ఇంట్లో ఉన్న చిన్నచిన్న వస్తువులతో ఏదో రూపాన్ని తయారు చేయడానికి ప్రయత్నించటం చేస్తుంటారు. ఇవే పిల్లల్లో సృజనాత్మకతను గమనించడానికి ప్రధానమైన ఆధారాలు అంటున్నారు నిపుణులు. ఇక్కడి నుంచే వాళ్ళకళలకు పదును పెట్టడం కూడా అంత కష్టంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది కాదు అంటున్నారు. కావలసిందల్లా వారిని కాస్త దగ్గరగా గమనిస్తూ మరికాస్త శ్రద్ధ జోడించడం.
అలా కాకుండా...
ఏదైనా కాగితంపై గీతలు గీస్తుంటే చాలు 'ఏయ్...ఏంటి ఆ పిచ్చిగీతలు, అన్నీ నాశనం చేస్తున్నావ్‌' అంటూ పెద్దగా అరుపులు వినిపిస్తాయి. నిజానికి పిచ్చి గీతలకు, బాపు బొమ్మకు తేడా తెలియదు వారికి. ఆమాటకొస్తే ఎంత గొప్ప చిత్రమైనా రూపుదిద్దుకోవలసింది ప్రధానంగా గీతతోనే కదా! అందరితో ఆడుకోవలసిన అంత చిన్న వయసులోనే ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ పసివారిలో, అదేదో చేయకూడని పని అనే ముద్రను ఎందుకు వేయడం? అలాంటి సమయంలో వారికి బొమ్మకు, పిచ్చిగీతలకు తేడా చూపించే ప్రయత్నం చేయండి. వారు పెట్టిన గీతలకే బొమ్మరూపం తెచ్చి చూపించండి. వారి ఆలోచన మరింత ముందుకు నడుస్తుంది. అంతే కాదు మంచిమంచి బొమ్మలు, చిత్రాలు వారికి సులభంగా అర్థమయ్యేవి తెచ్చి ఇవ్వండి. ఇవి కొత్తకొత్త ఆలోచనలు చేసే బుల్లి మేధావి మెదడుకు సాయం చేస్తాయి.
అవి గొప్పవే మరి
కాస్త ఎదిగే కొద్దీ వారు వేస్తున్న చిన్న చిన్న పెయింట్స్‌ ఎంతో ఆలోచింపజేసేవిగా అంతకుమించి అందంగా కూడా ఉంటాయి. అలాంటివాటిని బాగుందమ్మా అంటూ పక్కన పెట్టడం అలవాటు. కానీ ఇలాంటి వాటిని చక్కగా ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో గోడకు అమర్చితే అది చూసిన ప్రతిసారీ వారికి ఇంకా మంచి పెయింట్‌ వేయాలనో, ఇంకా మంచి కళాకృతిని తయారు చేయాలనో అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు వాటిగురించి అడగటం మీరు చెప్పడం, వాళ్లు మీ చిన్నారులను మెచ్చుకోవటం ఇవన్నీ వారికి మంచి ప్రోత్సాహాన్నిచ్చే టానిక్‌లా పనిచేస్తాయి. ఇంట్లో గది గోడలకు నిండుదనాన్ని, గదికి అందాన్ని ఇస్తాయని అప్పుడప్పుడూ బజార్లో చిత్రపటాలు కొంటూ ఉంటారు. కానీ ఆ ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోనే మీ పసివాళ్ల కళాఖండాలకు ఫ్రేమ్‌లు కట్టిస్తే రెండు విధాలా మంచిది. వాళ్లలో సృజనాత్మకతను పెంపొందించే (అందుబాటులో ఉండే వస్తువులతో చేసిన) కళాకృతులు ఏవైనా తెచ్చి వారికి బహుమతిగా అందజేస్తే వాటినుండి ఎన్నో కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు పసివాళ్లు. అందుకే వారి చేతుల్లో రూపుదిద్దుకున్న దేన్నీ అశ్రద్ధగా పక్కన పడేసే ప్రయత్నం చేయకుంటే మంచిది.
కాస్త ఆలోచించి...
ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న వస్తువులన్నీ చిత్రలేఖనం, మంచిమంచి హస్తకళలతో మెరుగులు దిద్దుకొని వస్తున్నాయి. గ్లాసు దగ్గరనుంచి ప్లేటువరకు, గడియారం దగ్గరనుంచి టేబుల్‌ ల్యాంప్‌ వరకూ అన్నింటిలోనూ హస్త కళల ఉనికిని చాటే సామాగ్రి ఎక్కువగా వస్తోంది. ఇది కూడా మీ పిల్లల కళలను ప్రోత్సహించడానికి ఉపయో గపడుతుంది. చేయ వలసిందల్లా ఇంటికి సంబం ధించి ఏదైనా సామాగ్రి కొనేటపుడు కాస్త ఆలోచిం చి, చిన్నారుల అభిరుచు లకు దగ్గరగా, ప్రోత్సా హకరంగా ఉన్న వాటిని కొంటే చాలు. మంచి పెయింటింగ్స్‌, హస్త కళలతో రూపుదిద్దుకున్నవి కొంటే నిత్యం వాటి అవసరం ఉన్న పిల్లలు వాటిని గమనిస్తూనే ఉంటారు. అచ్చం అలానే మరొక వస్తువుపై వేసే ప్రయత్నమూ చేస్తారు. దానికి మీరు ప్రత్యేకించి వారిని ఉత్సాహ పరచవచ్చు. క్రమేపి ఇంట్లో ఉన్న వస్తు వులపై మీ పిల్లల కళానైపుణ్యం దర్శన మివ్వటానికి ఎంతో కాలం పట్టదు. అది వారికి భవిష్యత్తును ఇచ్చే మంచి వృత్తిగా మారినా ఆనందమే కదా! మీరు వెళ్లే ఫంక్షన్‌లకు వారే మంచిమంచి గిఫ్ట్స్‌తయారు చేసి ఇస్తే ఎంత సంతృప్తిగా ఉంటుంది.

జీవితాన్ని మలిచే చక్కటి ఆలోచన


 
NewsListandDetails జీవితంలో విజయానికి ఎన్నో ఉపాయాలున్నాయి. కాని మనం పనిచేయనిదే అవి పనిచేయవు. ఎప్పటిపని అప్పుడు పూర్తిచేసుకొంటే మనసు ఉత్తేజపడుతుంది. మరో కార్యానికి కార్యోన్ముఖుడిని చేస్తుంది. గమ్యాన్ని చేరుకోవడం కన్నా ఆ దిశగా కార్యసిద్ధికి ప్రయాణించడమే ముఖ్యం.

అందుబాటులో ఉన్న మంచితనంతో పొందటమే ముఖ్యం. జీవితంలోని మంచి వినండి. అనండి. చూడండి. తలంచండి. చేయండి. చేయించండి. అదే అతిగొప్ప కళ.

- మనుషుల చేత వాడబడుతున్న అతిశక్తివంతమైన మందులు మాటలు. మన నాలుక మనం చెప్పినట్లు వినకపోవడమే అన్ని అనర్థాలకు మూలం. మాటలు తెలివైన వారికి పాచికల వంటివి. తెలివిలేని వారికి డబ్బుల వంటివి. మీరు చెప్పడానికి ఏమీ లేనప్పుడు మాట్లాడకండి.

- హితమితప్రియభాషణం మనిషికి అరుదైన భూషణం. కలిసిపో మంచి మనసున్న వారితో కలిసి జీవించాలి మనసైనవారితో.

- నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని స్మరించకండి. ఎవరైనా మీకు ఉపకారం చేస్తే దాన్ని విస్మరించబోకండి.

- జీవితంలో ఎదురయ్యే సాధారణ విషయాలను కూడా అసాధారణంగా ఆలోచించి పరిష్కరించగలిగినప్పుడు నీవు ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయికి చేరుకుంటావు.

- ఉన్న వైపుకు పురోగమించడమే కాని ఉన్నదాన్ని పెంచడంలో పురోగతి ఉండదు. సాధించాలనే సత్‌సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.

- తోటివారితో మంచిగా జీవించాలి, మీ మంచితనాన్ని తోటివారికి పంచాలి. అదే మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మానవుడు దానవుడుగా మారడం అతని ఓటమి. మనిషి మహామనిషిగా రూపాంతరం చెందటం అతని చమత్కారం. మానవుడు మనిషిగా మారడం గెలుపు. నిన్ను చూసి నీవు మనసారా నవ్వగలిగిన రోజున నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. జీవితం అనేది రాళ్ల గని వంటిది. మంచిశిలను ఎంచుకుని శిల్పాన్ని మలిచినట్లే మన వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి.

- పనిలో నిమగ్నమై పట్టుదలతో పనులు చేసేవారికి ఆరోగ్యం చెడిపోదు. ముసలితనం రాదు. తన వృత్తిని పవిత్రంగా, గౌరవంగా భావించే వ్యక్తి, ఒక క్షణం కూడా సోమరిగా ఉండలేడు. మనం చేయవలసిన పని మానేసి మరెవరో వచ్చి చేసిపెడతారని ఎదురు చూడడం వెర్రితనం. పనిచేసేతత్వమూ, పనిపట్ల విశ్వాసము విజయానికి మూలకారణాలు. మనం ఎలాంటి పనులు చేయాలో మనం నిర్ణయించుకొనేటట్లుగానే మనం ఎటువంటి వారమో మనం చేసే పనులు నిర్ణయిస్తాయి.

- జీవితం ఒక రంగుల వలయం. రంగుల రాట్నం. దాన్ని మలచుకునే విధానంలోనే ఫలితాలు ఆధారపడి ఉంటుంది. నీతినిజాయితీతో కష్టపడి పనిచేస్తే తప్పకుండా సంతోషకరమైన జీవితం లభిస్తుంది.

- మనం ఎంత చేయగలమో దానిని బట్టి మన విలువను నిర్ణయించుకుంటాము. బయటి వారు మనం ఎంత చేశామో దానిని బట్టి విలువ కడతారు. మీలో తప్పిదాలు ఉన్నప్పుడు వాటిని ఒప్పుకుని తక్షణమే తొలగించుకోవడానికి ఏమాత్రం భయపడకు.

- సంకల్పం, బలం ఉన్నచోట అపజయమనేది ఉండదు. స్వశక్తిని నమ్ముకొన్న వారే దేనినైనా సాధించగలరు. ఏమి చేశారన్నది కాదు ఎటువంటి ఉద్దేశంతో చేశారన్నది పరిశీలించాలి. నమ్మకంతో ప్రారంభమైన కార్యం సంశయాలతో ముగుస్తుంది. సందేహాలతో మొదలుపెట్టిన పని నమ్మకానికి దారితీస్తుంది. మనిషి జీవితాన్ని మలిచేది అతని ఆలోచనే. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు. వారికి ఆలోచనే మిత్రులు, నేస్తాలు.

- నీతికి నీవు కట్టుబడి ఉంటే అందుకుంటావు ప్రగతి మెట్లు. భీతిని వీడి ముందుకేగితే విజయమే నిన్ను వరిస్తుంది. మనిషి సాటి మనిషిని ప్రేమిస్తే సమాజం, మనిషి తోటి మనిషిని హింసిస్తే అరణ్యం.

- మంచి ప్రవర్తన, మంచి నైతిక విలువలు మనకు స్థిరమైన, శ్రేష్ఠమైన నేస్తాలు, మనిషి తన జీవనమార్గంలోని రెండు పటిష్టమైన దారులని ఏమాత్రం పట్టు సడలనివ్వకూడదు. ఆ రెండు దారులే ఆశ, నమ్మకం. మంచి సామర్థ్యం కలిగి ఉండడం గొప్ప విషయమే. కానీ ఇతరుల సామర్థ్యాన్ని గుర్తించడం అన్నది మరీ గొప్పవిషయం.

- ఎంత చదివినా ఎన్ని వ్రాసినా క్రమశిక్షణలేని జీవితం వ్యర్థం. ఎంత గొప్పవాడయినా క్యారెక్టరు లేని మనిషి బ్రతుకు శూన్యం. ఎంత సంపాదించినా ఒకనాడది వదలి వెళ్లాల్సిందే. ఎంతకాలం కలిసి ఉన్నా చివరకు విడిపోవాల్సిందే.

- ఎంతకాలం జీవించినా ఒకనాడు మృత్యువాత పడాల్సిందే. నీవెంత పైకెదిగినా ఈ జీవిత సత్యాలను అనుభవించాల్సిందే. కోపమొక్కటి నీ దరిచేరకున్న ముఖమున చిరునవు్వ వెలుగుచున్న ఎంత ధనమున్న వీటి ముందు సున్నా. ఓరిమి జీవితానికి ప్రకాశం ఉద్రేకం బ్రతుకుకు వినాశం.

- పరిశీలనతో పరిష్కరించుకోగల ఆత్మస్థయిర్యం ఉండాలి. సర్దుకుపోవడం, అవగాహనతో మెలగడం, పరులను ప్రేమించగలగడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అలవచ్చుకోవాలి. మనకి జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా మనకంటే గొప్పవాడై ఉంటాడు. అలాంటి వ్యక్తుల నుండీ ఎంతో కొంత నేర్చుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. - ఆర్వీఎమ్‌

తిర్యక్ తాడాసనం యోగా ఎలా చేయాలి?

 

యోగా:

పాదాలను దగ్గరగా ఉంచి చేతులను శరీరానికి ఇరువైపులా తాకించి నిటారుగా సమస్థితిలో నిలబడాలి.

చేతులను నిదానంగా పైకి తీసుకుని ఫొటోలో ఉన్నట్లుగా ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్లతో కలిపి ఉంచాలి.

పూర్తిగా శ్వాస తీసుకుని రెండు అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచాలి.

ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ శరీరాన్ని ఎడమవైపుకి తిప్పి కాలివేళ్ల మీద నిలబడాలి. ఈ స్థితిలో శరీరాన్ని వీలైనంత వరకు పైకి లాగిపట్టి ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.

ఇదే క్రమాన్ని కుడివైపు కూడా చేయాలి. అలాగే పాదాలను ఒక అడుగు దూరంలో ఉంచి కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

ఉపయోగాలు
పొడవు పెరగడానికి దోహదం చేస్తుంది.

కండరాలు, నరాలు, పేగులు, వెన్ను ఉత్తేజితమవుతాయి. మలబద్దకం వదులుతుంది.

జీర్ణశక్తి పెరుగుతుంది, కాళ్లు చేతులు, నడుము శక్తిమంతం అవుతాయి.

కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి క్రమంగా తగ్గిపోతాయి.

రక్తప్రసరణ క్రమబద్ధమవుతుంది.శరీరం చైతన్యవంతం అవుతుంది.

దేహాన్ని మెలితిప్పడం వల్ల ఛాతీ కండరాలు శక్తిమంతం అవుతాయి. శ్వాస క్రియ చక్కగా జరుగుతుంది.

మానసిక ఒత్తిడులు తొలగిపోతాయి.

జాగ్రత్తలు
మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు.

భుజాలు అరిగిపోయిన వాళ్లు, స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు చేయకూడదు.

కాలివేళ్లు, మడమలకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా ఈ ఆసనాన్ని సాధన చేయరాదు.

మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్
 

పదినెలల బాబుకు విరేచనాలు... ఏం చేయాలి?

 

ఆయుర్వేదం
మా బాబు వయసు 10 నెలలు. గత మూడు వారాలుగా పలుచగా నీళ్లలాగ విరేచనాలవుతున్నాయి. పరిమాణం స్వల్పమే అయినా, రోజుకి 9-10 సార్లు అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఈ సమస్యకు ఆయుర్వేదంలో మందులు తెలియజేయగలరు.
- భానుమతి, జహీరాబాద్


నీళ్ల విరేచనాలను ఆయుర్వేదంలో అతిసారం అంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి ఒక వర్గంగాను, ఇతర కారణాల వల్ల వచ్చేవి ఇంకో వర్గంగాను ఆయుర్వేదంలో వివరించారు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవల్ (ఆంత్రకృములు) మొదలైనవి సాధారణంగా కలిగే ఇన్ఫెక్షన్స్. ఇతర కారణాల్లో ముఖ్యమైనవి...

కొందరికి తల్లి పాలు పడకపోవడం

కొన్ని ఆహార పదార్థాలకు అసాత్మ్యత

కారం, పులుపు ఎక్కువగా తినడం

కొన్ని మందుల వల్ల కలిగే దుష్ర్పభావాలు

జీర్ణకోశసమస్యలు

భయం, కోపం, విచారం వంటి మానసిక ఉద్వేగాలు, పిల్లలకు దంతాలు జనిస్తున్నప్పుడు మొదలైనవి.

మీ బాబు వయసు రీత్యా ఇది ‘దంతోద్భవజన్య అతిసారం’ కావచ్చు. విరేచనాలతో బాబు వాంతులు, జ్వరం లేకపోతే పెద్దగా కంగారు పడవద్దు. పిల్లలకు ప్రతిదినం ఇచ్చే ఘనాహారం, ద్రవాహారం అదేవిధంగా ఇవ్వాలి. ముఖ్యంగా సోడియం, పొటాషియం కలిగి ఉన్న ద్రవాహారం పుష్కలంగా తాగించాలి. సహజసిద్ధమైన కొబ్బరినీళ్లు ప్రశస్తమైన ద్రవాహారమని గుర్తుంచుకోండి. పలుచని మజ్జిగ, బార్లీ నీళ్లు కూడా మంచివే. ఒక కప్పు నీళ్లలో (మరిగించి చల్లార్చినవి) ఒక చెంచా శర్కర, చిటికెడు ఉప్పు, మూడు చుక్కల నిమ్మరసం కలిపి, ఇంట్లో తయారుచేసుకుని, ఆరారా తాగిస్తే డీహైడ్రేషన్ (శోష) రాకుండా ఉంటుంది.

ఔషధం
కర్పూరరస (మాత్రలు) ఉదయం 1 - రాత్రి 1

లశునాదివటి (మాత్రలు) ఉదయం 1 - రాత్రి 1

దాడిమాష్టకచూర్ణం : ఒకటి, రెండు గ్రాములు (పిల్లలకు) తేనెతో గాని, పాలతోగాని, రోజూ మూడుపూటలా

గమనిక : ఈ మూడింటిలో ఏ ఒక్క మందైనా సరిపోతుంది.

శిశువుకు ఆరవ నెల వచ్చినప్పటి నుంచి ఈ కింది మందులు వాడితే దంతాలు జనించేటప్పుడు కలిగే అనేక సమస్యల (జ్వరం, విరేచనాలు, వాంతులు మొదలైనవి) నివారణకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఇవి ఎంతకాలమైనా వాడుకోవచ్చు.

జహర్‌మొహర్ పిష్ఠి మరియు ప్రవాళపిష్ఠి (భస్మాలు): వీటిని ఒక్కొ క్క చిటికెడు తీసుకుని తేనెతో రోజూ రెండు పూటలా నాకించాలి.

అరవిందాసవ (ద్రావకం): ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి రెండు పూటలా తాగించాలి.

విరేచనాలు తగ్గటానికి సాధారణ చిట్కాలు (గృహవైద్యం)
వామును కొద్దిగా వేయిచి, నీళ్లతో మరిగించి తాగాలి. శిశువులకు : ఒక చెంచా రెండు లేదా మూడు పూటలా. పెద్దలకు: ఐదు చెంచాలు రెండు లేదా మూడుపూటలా.

జాజికాయని అరగదీసి ముద్దగా చేసి పావు చెంచా మోతాదును తేనెతో రెండుపూటలా నాకించాలి.

అతిసార నివారణకు జాగ్రత్తలు ( ముఖ్యంగా వర్షాకాలంలో)
మరిగించి చల్లార్చిన నీళ్లు తాగాలి. బయటి ఆహారం జోలికి పోవద్దు. నిల్వ ఉంచిన ఆహారం, ఫ్రిజ్‌లో ఎక్కువకాలం దాచి ఉంచిన ఆహారం తినవద్దు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం మంచిది.

ఐస్‌క్రీములు, శీతలపానీనియాలు, నూడుల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఆహారాన్ని తాజాగా వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి.

ఇల్లు, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం.

పిల్లలకు పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో కారం తగ్గించాలి. రోజూ వెల్లుల్లిపాయలు తినడం మంచిది.