all

Friday, November 30, 2012

పెళ్ళికి ముందే కళ్ళ క్రింద నల్లటి వలయాల.. ఇవిగో చిట్కాలు...!

సాధారణంగా మనిషి ఎంత అందంగా.. ఎంత రంగుతో ఉన్నరానేది ముఖ్యం కాదు. ఎటువంటి లోపం లేకుండా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. కనుముక్కుతీరు ఎంత చక్కగా ఉన్నా చర్మం అందంగా ఉంటేనే మరింత ఆకర్శణీయంగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలోని తేమ తగ్గిపోతుంటుంది. క్రమేపీ చర్మం మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా తయారవుతుంది. ప్రస్తుతల కాలంలో వయస్సు పైబడిన వారికి మాత్రమే కాదు టీనేజ్ లో వున్న వారిని కూడా ఈ నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖం అందంగా కనబడటం కోసం ఎన్నో ఫేస్ ప్యాక్ లు, మరెప్నో, బ్యూటీ క్రీములు వినియోగిస్తుంటారు. అయితే అందంగా కనబడం ముఖ చర్మ ఒక్కటే కాదు ముఖంలో ఉన్న ప్రతి భాగం అందంగా కనబడేలా చూసుకోవాలి.
reduce dark circles before the wedding

ముందుగా ముఖంలో స్పష్టంగా కనిపించేది కళ్ళు. అవి మనని నడిపించడమే కాదు, ముఖానికి గొప్ప అందాన్నీ ఇస్తాయి. అంత ముఖ్యమైన నయనాలచుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు అందవిహీనంగా కనిపిస్తాయి. అసలు ఈ డార్క్‌ సర్కిల్క్‌ ఎందుకు ఏర్పడ్తాయంటే నిద్ర తక్కువైనా, మానసిక వత్తిడి ఎక్కువైనా, మరేవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇవి వాటికి బాహ్య సంకేతాలన్నమాట. మరి, ఈ వలయాలకు పరిష్కారం లేదా అంటే.. వుంది. డార్క్‌ సర్కిల్స్‌, రింకిల్స్‌ను పోగొట్టే లోషన్లు, ఆయింట్‌మెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిల్లో కొన్ని చర్మానికి హాని చేసే ప్రమాదం వుంది కనుక, సహజమైన పద్ధతుల ద్వారానే డార్క్‌ సర్కిల్స్‌ను పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడిక అందం, ఆకర్షణ మీ సొంతం.
మంచి నిద్ర: లేట్ నైట్ పార్టీలు, ఎక్కువ సేపు టీవీలు చూడటం వంటివాటికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం 7-8గంటల నిద్ర అవసరం. నిద్ర సమయాన్ని మార్చినా కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. కొందరు రాత్రి మేల్కొని పగలు నిద్రపోతుంటారు. ఇలా చేడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది.
బాదాం ఆయిల్: రాత్రిపూట పడుకునేముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ ను కంటి చుట్టూరాసీ నెమ్మదిగా మసాజ్ చేయాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి. అల్ఫా హైడ్రోక్సియాసిడ్స్ లేదా రెటివాల్స్ గల నైట్ క్రీమ్ను ముఖానికి మెడకు రోజూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
టీ బ్యాగ్స్: ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచడం మనలో చాలామందికి తెలిసిందే. అయితే చేసే పొరబాటేంటంటే.. వాటిని నేరుగా వాడేస్తుంటారు. ఏం చేయాలంటే.. టీ బ్యాగుల్ని ముందుగా ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరవాత కళ్లపై పెట్టుకోవాలి. అలాగే హెర్బల్‌ టీ బ్యాగుల్ని వాడకూడదు. వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు.
బంగాళదుంప: బంగాళా దుంపలో చర్మాన్ని తేటపరిచే (SkinLightening) తత్త్వం ఉంది. ఇది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళా దుంప రసాన్ని కంటి దింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. అలాగే బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.
నిమ్మరసం: నిమ్మరసం, టమాటరసం చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి నల్లనివలయాలపై ప్యాక్‌లా రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి. కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.
ఆహారం: ఇలా సౌందర్య చిత్కాలతోనే కాదు ఆహారము లో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందవచ్చును. విటమిన్ల లోకే"విటమిన్క్ష్ కి ఇదే గుణము(SkinLightening) ఉంది. కంటికింద మచ్చలతో భాధపదేవారు సౌందర్య ఛిట్కాలతోపాటు' కే ' విటమిన్ అధికంగా లభ్యమయ్యే ఆహారము తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. "కే విటమిన్ పుష్కలంగా లభించే ఆహారపార్దాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్, బీన్స్, సోయాబీన్స్, దోసకాయ, పచ్చిబఠానీలు, కాలేయము(Liver), చేప నూనె, పెరుగు, పాలు, అన్ని రకాల ఆకుకూరలు - పాలకురలో ఎక్కువ.

వేడినీళ్ళతో తలస్నానమా...?అయితే కేశాలు జాగ్రత్త...!

ప్రస్తుత కాలంలో రోజంతా పనితో, విపరీతమైన అలసటతో వేడెక్కిన బుర్ర ప్రశాంతంగా మారాలంటే వేడి నీటి కంటే మించిన మందు మరొకటి లేదు. ఆఫీసులో, వృత్తిజీవనంలో ఒళ్లు హూనం అయ్యాక ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువ సేపు స్నానం చేస్తే ఆ పని తాలూకూ ఒత్తిళ్లు మటుమాయం అవుతాయి. ఇంకా చెప్పాలంటే వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును, వాష్ చేసేయవచ్చు. శరీరంలో ఇంద్రియాలన్నీ చురుగ్గా ఉండాలంటే వేడినీటి స్నానానికి మించి మరొక మందు లేదు.
hot water showers bad your hair

ఒకప్పుడు తలంటి స్నానం అంటే అది ఒక పెద్ద ప్రహసనంలా సాగేది. తలకే కాదు వంటికి కూడా నూనె రాసి, నలుగు పెట్టి మరీ స్నానం చేసేవారు. దీనితో అటు తల ఇటు శరీరం కూడా పరిశుభ్రమయ్యేవి. దీనివల్లే మసాజుల వంటివి ఆ కాలంలో తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా హడావిడే.. అంతా ఇన్‌స్టాంట్‌.. ఒంటిమీద సోప్‌వాష్‌ పోసుకొని ఒళ్ళు రుద్దుకుని, షాంపూతో బరబరా తలరుద్దేసుకొని ఐదు నిమిషాలలోపే తలంటిని, స్నానాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. కానీ స్నానమనే ప్రక్రియ రిలాక్సేషన్‌కు ఒక మంచి మందు.. ఇది భౌతిక, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందనే విషయం బహుకొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం...
నలుగు పెట్టి స్నానం చేయడం వల్ల శరీరంలోని సెల్యులైట్‌ టోన్‌ అవుతుంది.. శరీరానికి కూడా మసాజ్‌ జరుగుతుంది. శరీరంలో రక్తసరఫరా పెరగడమే కాకుండా చర్మం నిగనిగలాడుతూ టోన్డ్‌గా ఆరోగ్యంగా కనుపిస్తుంది. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఆ ఆవిరి రక్తనాళాలు విస్తరించేలా చేసి రక్తసరఫరాను పెంచుతుంది. రక్తసరఫరా బాగా జరిగినప్పుడు రక్తపోటు తగ్గడమే కాదు నరాలపై ఒత్తిడి కూడా తగ్గి ఆందోళన, ఒత్తిళ్లనుంచి వ్యక్తి బయటపడతాడు.
మంచి స్నానం నిద్ర పట్టేందుకు కూడా దోహదం చేస్తుంది. రాత్రి వేళల్లో నిద్ర పట్టక సమస్యలు ఎదుర్కొనే వారు గోరు వెచ్చటి నీటితో ఒక పది పదిహేను నిమిషాలు స్నానం చేస్తే శరీరానికి, మనస్సుకు రిలాక్సేషన్‌ వచ్చి నిద్ర ఇట్టే పట్టేస్తుందిట. వేడినీటి స్నానం చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది. శరీర వెనుక భాగ చర్మం, కండరాలు, భుజాలు, మొదలైనవి గట్టిగా బలపడుతాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి.
అయితే ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది. ఎందుకంటే వేడినీళ్లు తలలోని చర్మ రంధ్రాలను కూడా తెరచుకొనేలా చేస్తుంది. దాంతో హెయిర్ రూట్స్ కి హానీ కలిగి హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది. వేడీ నీళ్ళు కురులను బర్న్ చేస్తాయి. ఎందుకంటే కురులు ప్రోటీన్ తో తయారైయ్యేటటువంటి కెరోటిన్. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగ నష్టంపోవడం వల్ల హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. సాధారణంగా ఆహారపదార్థాలను ఎక్కువ ఉడికించడం లేదా ఎక్కువ కాచడం వల్ల ప్రోటీనులు పూర్తిగా నాశనం అవుతాయి. అదే విధంగా వేడి నీళ్ళు తలకు తగలడం వల్ల కూడా తలలోని కురుకు సంబంధించిన ప్రోటీనులు నాశం అయ్యి హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.
షాంపూ మరియు వేడి నీళ్ళ చాలా చెడ్డ కాంబినేషన్. తలకు షాంపూ పట్టించేటప్పుడు గోరు వెచ్చని నీటి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వేడినీళ్ళకు, గోరువెచ్చని నీటికి చాలా వ్యత్యాసం ఉంది. అది తెలుసుకొని తలకు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. తలకు కండిషన్ చేసిన తర్వాత కోల్డ్ షవర్ (చల్లనీటి స్నానం) చాలా అవసరం. చల్లనీటి స్నానంతో కురులు సున్నితంగా తయారవుతాయి. కాబట్టి హెయిర్ ఫాల్ ను అరికట్టి మంచి హెయిర్ గ్రోత్ ను ఆశించే వారు తలకు వేడినీటి స్నానం చేయకపోవడమే మంచిది. కాబట్టి శరీరానికి వేడి నీటి స్నానం ఎంత రిలాక్స్ ఇస్తుందో... తలకు చల్లనీటి స్నానం అంత రిలాక్స్ ఇస్తుంది

చలికాలపు సౌందర్య రాశి.. నేచ్యురల్ ప్రూట్ ఫేస్ మాస్క్

ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అని పిలుస్తుంటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు ఇస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. తినడానికే కాదు, బ్యూటీ కేర్ కోసం కూడా ఆరంజ్ ఫ్రూట్ ని ఉపయోగించవచ్చు.
homemade orange face packs

ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్‌నో రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది. కాగా 200 మంది కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్‌పై ఈ పరిశోధన జరిగిందని యూకే కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్ వెల్లడించింది. శీతాకాలంలో ఆరెంజ్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల అటు అరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి ఈ ఆరోగ్య ప్రధాయిని ఆరెంజ్ ఈ చలికాలంలో చర్మాన్ని ఏవిధంగా రక్షిస్తుందో చూద్దాం...
ఆరెంజ్ ఫేస్ ప్యాక్: ఇది తయారు చేయడం చాలా సులభం. మీరు దీన్ని పేస్ట్ చేయాల్సిన పనిలేదు. ఆరెంజ్ తొనలను తొలగించి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి అంతే. ఇలా మర్ధన చేసిన పది నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం టైట్ గా మర్చుతుంది. ముఖంలో జిడ్డును తొలగిస్తుంది. కాంతివంతంగా మార్చుతుంది . వయస్సు పైబడినట్లు కనబడనియ్యదు. ఇలా ప్రతి రోజూ స్నానం చేసే ముందు రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
ఆరెంజ్ జ్యూస్ మరియు పాలు: చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇంకా బ్లాక్ హెడ్స్ తొలగించి చర్మాన్ని ప్రకాశంవంతంగా మార్చుతుంది. ఆరెండింటిని మిక్స్ చేసి ముఖానికి పట్టించి మసాజ్ చేసి, పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంలో మెరుపు సంతరించుకుంటుంది.
ఆరెంజ్ తొక్క మరియు పెరుగు: పేస్ స్క్రబ్ లో ఇది మరోక గొప్ప ప్రయోగం. ఈ ఫేస్ స్ర్క్ ఇటు మహిళలకు అటు పురుషులకు ఇద్దరికీ బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి తర్వాత మెత్తగా పౌడర్ చేసి, ఇట్లో స్టోర్ చేసుకొని సమయం దొరికినప్పుడల్లా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేయొచ్చు. దాంతో ముఖంలో నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి.
ఆరెంజ్ జ్యూస్-నిమ్మరసం-పెరుగు: సాధారణంగా హోంమేడ్ ఫేస్ ప్యాక్ లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి సాధారణ పదార్థాలు పెరుగు, నిమ్మరసం. వీటితో పాటు ఆరెంజ్ జ్యూస్ ను కూడా మిక్స్ చేయడం వల్ల చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సన్ బర్న్ నుండి కాపాడి చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.
ఆరెంజ్ తొక్క మరియు ఓట్స్ స్క్రబ్: ఈ చాలా సులభమైనటువంటి చిట్కా. చర్మాన్ని నేచురల్ గా, క్లియర్ గా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం తో పాటు, బ్లాక్ హెడ్స్, మచ్చలను తొలగించి ప్రకాశంవంతంగా మార్చుతుంది.

వేస్ట్ పేపర్ అని పారేయకండి..ఇలా వాడుకోండి

మనం అందరూ పర్యావరణ పరిరక్షణ గురించి వినే ఉంటాం. చెట్లను ఎలా సేవ్ చేయాలనేది.. వాటి వల్ల వాతారణానికి, ఎంత ప్రయోజనం అనేది కూడా అందిరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని, పాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించడానికి ఎన్నో పద్దతులను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఇంకా పేపర్ వాడకాన్ని కూడా తగ్గించాయి. పేపర్ వాడకం తగ్గిన తర్వాతే టాబ్లెట్స మరియు మొబైల్ ఫోన్ల రూపంలో ఇలా పేపర్ ను సేవ్ చేయగలుగుతున్నారు. కానీ ప్రింట్ మీడియా మాత్రం పేపర్ ను ఉపయోగిస్తోంది. వార్తాపత్రిక, వార్షిక నివేధిక లేదా మ్యాగజైన్ రూపంలో ప్రతి రోజూ ఉపగిస్తున్నాం. వాటిని చదివిన తర్వాత కుప్పలుతెప్పలుగా ఇంటి నిండా కొద్దిరోజులు పెట్టుకొని తర్వాత అమ్మే వారికి ఇచ్చేస్తుంటాం. లేదా వాటి కాల్చేస్తుంటాం. అయితే వాటిని ఇంటి సౌకర్యార్తం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించండి. వేస్ట్ న్యూస్ పేపర్స్ ఏవిధంగా ఉపయోగించుకోవాలో మీకోసం కొన్ని చిట్కాలు...
smart uses waste paper

1. క్లీనింగ్ గ్లాస్: వేస్ట్ న్యూస్ పేపర్ ను క్లీనింగ్ కోసం కామన్ గా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా గ్లాస్ వస్తువులు, గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్, గ్లాస్ మిర్రర్స్, టీవీ గ్లాస్ ఇలా వివిధ రాకాలైన వస్తువులను శుభ్రపరచడానికి వేస్ట్ న్యూస్ పేపర్ ను ఉపయోగించవచ్చు. న్యూస్ పేపర్ ను నీటిలో నానబెట్టి తర్వాత మరకబడిన గ్లాస్ వస్తువులను తుడవడం వల్ల శుభ్రపడుతాయి. తడి న్యూస్ వేస్ట్ న్యూస్ పేపర్ తో తుడిచిన తర్వాత పొడి న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల మార్పు మీకే తెలుస్తుంది. గ్లాస్ వస్తువులు మిళమిళ మెరుస్తుంటాయి.
2. ర్యాక్ కవర్స్/షెల్ఫ్ కవర్స్: ఇంట్లో కానీ, ఆఫీసులోకానీ రాక్స్, షెల్ఫ్స్ లో వస్తువలు, లేదా బుక్స్ సర్ధే ముందు ఈ వేస్ట్ న్యూస్ పేపర్ ను ఉపయోగించడం వల్ల ర్యాక్స్ డ్యామేజ్ కాకుండా మరకలు, గీతలు పడకుండా ఉంటాయి. అంతే కాకుండా చూడటానికి చాలా క్లీన్ గా ఉంటుంది. కాబట్టి బుక్ ర్యాక్స్, షూర్యాక్స్, వార్డ్ రోబ్, క్యాబినేట్ ర్యాక్స్, కిచెన్ ర్యాక్స్ లో వస్తువులను సర్ధడానికి ముందు న్యూస్ పేపర్ ను బేస్ గా ఉపయోగించాలి.
3. త్వరగా తడి ఆరడానికి: త్వరగా ఆఫీసుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో షూ నీటిలో తడిస్తే? ఆ తడిని వేస్ట్ న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల త్వరగా పీల్చుకుంటుంది. అంతే కాదు వుడెన్ డెస్క్ మీద కాఫీ లేదా టీ పొరబాటును వలకబోతే న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల అతి త్వరగా పీల్చుకుంటుంది. ఎమర్జెన్నీ టైమ్ లో షూను, టేబుల్స్ ను మరియు వస్తువును ఇలా తడి ఆర్పుకోవచ్చు.
4. ఇంటి డెకరేషన్: వేస్ట్ న్యూస్ పేపర్ ను పడేయడం లేదా అమ్మేయడానికి బదులు, కొంచెం సృజనాత్మకతను జోడించి ఇంటిని డెకరేట్ చేసుకోండి. న్యూస్ పేపర్ తో ఇంటిని డెకరేట్ చేయడానికి చాలా పద్దతులు ఉన్నాయి. ఇలా న్యూస్ పేపర్ ఉపయోగించడం వల్ల ఖర్చు తక్కు మరియు ఎకో ఫ్రెండ్లీ ఐడియా కూడానూ...ఉదాహరణకు ఫ్లవర్స్ లా తయారు చేసి వాటికి రంగులు అద్దండి. ఇంకా ల్యాంపులను తయారు చేసి అక్కడక్కడా హ్యాంగ్ చేయండి. చూడటానికి అందంగా ఆకర్షనీయంగా ఉంటుంది.
5. బొమ్మలు తయారీ: పిల్లలు ఎప్పుడు కొత్త బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి వారికి కొత్త కొత్త బొమ్మలు.. ఏరోప్లేన్, బోట్, అనిమల్స్, మరయు బర్డ్స్? వంటివి తయారు చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల వారు సంతోషంగా ఆడుకొంటారు. అంతే కాదు ఇటువంటి వాటితో పిల్లల రూమ్ ను కూడా డెకొరేట్ చేయొచ్చు.
6. ఎక్సట్రా మేకప్ తొలగించడానికి: ఒక్కో సందర్భంలో మేకప్ ఎక్కువవుతుంటుంది. లిప్ స్టిక్, లేదా పౌడర్ వంటివి ఎక్కవుఅవుతుంటాయి. అటువంటి సమయంలో వేస్ట్ న్యూస్ పేపర్ ను లిప్స్ మీద అద్దడం వల్ల ఆ ఎక్సట్రా లిప్ స్టిక్ ను తొలగించి లైట్ గా కనబడేలా చేస్తుంది.
7. వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంచడానికి: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను న్యూస్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో లేదా అలాగే ఆరబయట పెట్టడం వల్ల ఎక్కువ సమయం వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంటాయి.
8. ఐరన్ వస్తువులను శుభ్రపరచడానికి: తుప్పు పట్టిన ఐరన్ వస్తువులను న్యూస్ పేపర్ ఉపయోగించి తుడచడం వల్ల అతి సులవుగా తుప్పు వదిలిపోతుంది. ఆ తర్వాత వాటిని నీటితో శుభ్రం చేసుకోవచ్చు.
9. విత్తనాల నాణ్యత తెలుసుకోవడానికి: విత్తనాలు ఏవైనా సరే గార్డెన్ లో నాటాలనుకొన్నప్పుడు వాటిని తడిగా ఉన్న న్యూస్ పేపర్ లో చుట్టి రెండు మూడు రోజు అలాగే పెట్టి తర్వాత చూస్తే విత్తనాలు మొలకెత్తినట్లైతే వాటిని గార్డెన్ లో మొక్కలకోసం నాటువకోవచ్చు.

చలికాలంలో పిల్లల పట్ల పెద్దలు తీసుకోవల్సిన జాగ్రత్తలు...!

నవంబర్.. డిసెంబర్ మొదలైందంటే చాలు. చలి..చలి.. వాతావరణంలోని మార్పులతో పాటు శరీరంలో అనేక మార్పులకు చేటుచేసుకుంటుంది. అయితే ఇది ఈ మార్పులు పెద్దలకు మాత్రమే కాదు .. పిల్లల పట్లకూడా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలకు సంబంధించి పెద్దలకున్న అనేక సమస్యల్లో అసలు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. పొద్దున్న ఎనిమిదవుతున్నా ఇంకా ముసుగులోని వెచ్చదనాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడని పిల్లల్ని ‘స్కూలుకి టైమ్ అవుతోందంటూ తిరిగి రొటీన్‌ లోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు శీతాకాలంలో ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలా పొద్దున్నే లేవడమే కాదు, చలికాలంలో పిల్లలకు మరెన్నో సమస్యలు. వీటిలో ముఖ్యమైనవి ఆరోగ్యానికి సంబంధించినవి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పిల్లలకు కాలాలతో పనిలేదు. కాలం ఏదైనా వారి ఆటలు, వారి ఐస్‌క్రీంలు, వారి చాక్లెట్లు, వారి కూల్‌డ్రింకులు వారివే. కాబట్టి తల్లిదండ్రులే ఈ విషయాలు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకొనే ముందు అసలు చలికాలంలోనే పిల్లలకు ఈ ఇబ్బందులు ఎందుకొస్తాయనే పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండడం చాలా అవసరం.
చలికాలంలో పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుంది: చలికాలంలో పిల్లల శరీరతత్వంలో జరిగే మార్పులు, వాతావరణంలో జరిగే మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
Winter Health Safety Tips Kids

1. చలికాలంలో ముఖ్యమైన మార్పు ఉష్ణోగ్రత పడిపోవడం. పెరిగిన చలితోపాటు, గాలితోడై చలిగాలులు శరీరానికి మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రత, బయటి ఉష్ణోగ్రతల్లో సమతుల్యత లోపించి సమస్యలు సృష్టిస్తుంది. శ్వాసకోశాలలో, సైనస్‌లతో, చర్మంమీద దాని ప్రభావం ఉంటుంది.
2. చలికాలం పిల్లల్లో ఆకలి తగ్గిస్తుంది. చిరుతిళ్ళపై పిల్లలకుండే సహజమైన ఆసక్తితో వాటిని తింటారేమోగానీ, నిజమైన పోషక విలువలు గల అసలైన భోజనం మాత్రం వారికి ఇష్టముండదు. తిండి తగ్గిపోవడంతో శరీరం లో శక్తి కూడా సన్నగిల్లుతుంది. రోగనిరోధక శక్తి తగ్గి రోగాలు తేలిగ్గా దాడిచేస్తాయి.
3. చలికాలం గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అది రకరకాల వైరస్‌ లకు, బాక్టీరియాకి స్థావరమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవ సరంలేదు. శ్వాస ద్వారా చలిగాలులతో పాటు వైరస్, బాక్టీరియా కూడా వచ్చి చేరుతాయి.
4. చలికాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కాలంలో సూర్యుడు తక్కువ సేపు ఉండడమే కాకుండాఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. సూర్యకాంతి మనిషిని శక్తి వంతం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో రోగనిరోధకశక్తి, విటమిన్ ‘డి' శక్తిని ప్రసాదించేది సూర్యుడే. చలికాలంలో పిల్లల శరీరాలు ఎండను గ్రహించడం తగ్గిపోవడంతో ఆలోపం కూడా కొన్ని వ్యాధుల విజృంభణకు అవకాశం ఇస్తుంది. తల్లిదండ్రులు పైన వివరించినట్టుగా చలికా లంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలా వరకు అర్థమైపోతుంది.
ఆహారం: చలికాలంలో పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పోషక విలువలు కలిగిన ఆహారం మూడు పూటలా పిల్లలు తీసుకునేలా చూడాలి. భోజనం వేడివేడిగా, తాజాగా ఉండేలా చూడండి. ఫ్రిజ్‌లో పెట్టినవి వేడి చేసి ఇవ్వడం వంటివి చేయకండి. భోజనంలో కూరగాయలు, ముఖ్యంగా దుంపకూరలు ఉండేట్టుగా చూడండి. క్యారెట్, బీట్‌రూట్, బంగాళదుంప, చిలకడదుంప మొదలైన దుంపలు కూరగా గాని లేదా ఉడకబెట్టిగాని పిల్లలకు పెట్టండి. ఇవి పిల్లల్లో మలబద్దకాన్ని పోగొట్టే ఫైబర్, రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతలను కాపాడుతాయి. చలికాలంలో ప్రత్యేకంగా పండే ఆకుకూరలలో చలికాలం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక ఔషధగుణాలు ఉంటాయి. వీటిలో ఉండే రకరకాల విటమిన్లు, ఒమెగా 3, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం మొదలైనవి చర్మాన్ని పగలకుండా కాపాడుతాయి. వీటితో పాటు విటమిన్ ‘సి' గల పళ్ళు పిల్లలు ఎక్కువగా తినేలా చూడాలి. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలతో తినిపించాల్సినవైతే ఇక వాళ్ళు తినకుండా చూడాల్సిన వాటిలో ముఖ్యమైనది ఫ్రిజ్ నీళ్లు. ఐస్‌క్రీంలు, పంచదార కలిసిన ఏదైనాసరే చలికాలంలో పిల్లలకు మంచిదికాదు. వాటిని పిల్లలు తినకుండా వీలైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. చలికాలంలో వేడివేడి పల్లీలు గురించి చెప్పుకుంటుంటారు. నిజంగానే ఇవి పిల్లలకు ఎంతో మంచివి. చలికాలంలో వేయించిన పల్లీలులాంటి పప్పులు పిల్లలకు ‘ఇమ్యూన్ బూస్టర్'లుగా పనిచేస్తాయి.
దుస్తులు : చలికాలంలో కొన్ని స్కూళ్ళ యూనిఫాంలో స్వెట్టర్‌ లను కూడా జత చేశారంటే ఈ కాలంలో పిల్లలను చలి నుంచి కాపాడ్డానికి దుస్తులు విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో తల్లిదండ్రులు ఆర్థం చేసుకోవాలి. మంకీ క్యాప్‌లు, స్వెటర్‌లు, కాళ్ళకు సాక్స్‌లు, రాత్రిపూట చలిని తట్టుకునే దుప్పట్లు వీటితో పాటు రెగ్యులర్‌ గా వేసే దుస్తులు కూడా చలికి తట్టుకునేవిగా ఉండేలా చూసుకోవాలి. కాటన్ జీన్స్, ఉన్ని దుస్తులనే ఎక్కువగా వాడాలి. లోదుస్తులు, పైన వేసుకునేవి ఎప్పుడూ పూర్తిగా పొడిగా ఉండేట్టు చూడాలి. తడిసిన దుస్తులు పిల్లల ఒంటిమీద ఎక్కువసేపు ఉండడం చలికాలంలో ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. పిల్లలు మంకీక్యాప్, స్వెట్టర్‌లు వేసుకోడానికి మారాం చేస్తారు. లేదా వేసిన కాసేపటికే తీసివేస్తారు. అలా వారు చేయకుండా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి తల్లిదండ్రులు వాటిని తీసేయకుండా కాపాడాలి. ఒకవేశ అవి వేసుకోవడానికి పిల్లలకు దురదలు, బిగుతుగా ఉండడం వంటి సమస్యలుంటే వాటిని పరిశీలించి, వారికి సౌకర్యంగా ఉండేలా వాటిని మార్చాలి. చలికాలంలో దుస్తులతో పిల్లలకు ఎలర్జీలు వంటివి రాకుండా ఉండే నాణ్యతగల వాటినే కొనాలి.
ఎండ: చలికాలంలో అందరూ తపించిపోయేది ఎండకోసమే. కాస్త వీలు దొరికితే ఎండలో నిలబడాలనే ప్రయత్నం చేస్తారు. శీతాకాలం సూర్యుడు తక్కువ ప్రతాపంతో, కొంతసేపే ఉంటాడు కాబట్టి, ఉన్న కొద్ది సేపట్లోనే అత్యధిక సూర్యకాంతిని పిల్లల శరీరానికి పట్టేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల్ని ఎంత ఎక్కువసేపు ఎండలో ఆడుకోనిస్తే అంతమంచిది. ఎండవలన శరీరానికి కేవలం వేడి పుట్టడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని అవయవాలన్నీ ఎంతో ఆరోగ్యవం తంగా చురుకుగా పనిచేస్తాయి. ఎండలో నిలబడడం వలన విటమిన్ ‘డి' అనేది శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. చలికాలం వైరస్‌లతో పోరాడడానికి ఇది ఎంతో మంచిది.
డాక్టర్‌ని నిర్లక్ష్యం చేయకండి: చలికాలంలో పిల్లలకు సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు దగ్గు, తుమ్ములు, జలుబు, చర్మం పగలడం. ఇవి చెప్పుకోడానికి, చూడ్డానికి, చిన్నవిగానే అనిపిస్తాయి. దాంతో తల్లిదండ్రులు తమకు తెలిసిన చిన్న చిన్న చిట్కా వైద్యాలను పిల్లల మీద ప్రయోగించే ప్రయత్నంచేస్తారు. వాటితోనే తగ్గిపోతుందనుకుంటారు. కానీ చలికాలంలో పిల్లలకి సోకే వైరస్‌లు మామూలు చిట్కాలకు తగ్గవు. పైగా తేమతో శ్వాసకోశాలు కూడా అనారోగ్య పాలవుతాయి. ఈ కాలంలో తరచుగా పిల్లల డాక్టర్‌ని సంప్రదించి, వారి సలహాలను అనుసరించి మందులు తప్పనిసరిగా వాడాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే అనేక సవాళ్ళలో చలికాలంలో పిల్లల ఆరోగ్య పరిరక్షణ కూడా ఒకటి. తగిన జాగ్రత్తలతో, సూచించిన సలహాలతో ఈ చలికాలంలో కూడా పిల్లల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.

బనానా పులిహోర స్పెషల్ బ్రేక్ ఫాస్ట్

అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర,అరటి వేపుడు, అరటి బజ్జీ మెదలైనవి. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్‌ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. అరటితో పులిహోర ఎలాతయారు చేయాలో చూద్దాం...
banana pulihora

కావలసినపదార్థాలు:
అరటికాయ: 1-2
నిమ్మకాయ: 1
పచ్చిమిర్చి తరుగు: 2tbsp
పల్లీలు: 1/4cup
బియ్యం: 1cup
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1tsp
శనగపప్పు: 1tsp
ఎండుమిర్చి: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: ఒక కట్ట
జీడిపప్పు: 8-10
నూనె: సరిపడా
పసుపు: 1/4tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పొడిపొడిలాడేలా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత అరటికాయ చెక్కు తీసి, ముక్కలుగా కట్ చేసి, మూడు టీ స్పూన్ల నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి కాగిన తరవాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచుకోవాలి.
4. తర్వాత పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో వేయించిపెట్టుకున్న పదార్థాలను వేసి బాగా కలపాలి.
5. తరవాత జీడిపప్పు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే బనానా రైస్ రెడీ..

బదామీ పన్నీర్ గ్నేవీ: రైస్-రోటీ స్పెషల్

పన్నీర్ నాన్ వెంజ్ కాంబినేషన్ మాత్రమే కాదు వెజిటేరియన్ కాంబినేషన్ కూడా. పన్నీర్ తో తయారు చేసే ప్రతి వంటా ఎంతో రుచితో నోరూరించేస్తుంటి. చాలా ఇండ్లలో పన్నీర్ ను మహిళలే తయారు చేసుకొంటారు. పాలను బాగా మరింగించి అందులో కొద్దిగా నిమ్మరసం వేయగానే(సిట్రిక్ యాసిడ్ వల్ల) విడిపోతుంది. దాన్ని వడగట్టి పన్నీర్ గా తయారు చేసుకొంటారు. అయితే ఈ బిజీ లైఫ్ లో పన్నీర్ కూడా రెడీమేడ్ గా బయట మార్కెట్లో దొరుకుతోంది. పన్నీర్ ను వివిధ రకాలుగా వండుతారు. పన్నీర్ గ్రేవీ, పన్నీర్ మసాలా అనేవి ఇండియన్ వంటకాల్లో చాలా పాపులర్ వంటలు. కాబట్టి కొంచెం టేస్ట్ వెరైటీగా ఉండేందుకు బాదాం మిక్స్ చేసి ఎలా తయారు చేయాలో చూద్దాం...
badami paneer gravy recipe

పన్నీర్/కాటేజ్ చీజ్: 250gms (cut into cubes)
ఉల్లిపాయలు: 2
అల్లం: 1 inch
వెల్లుల్లి: 4:5 pods
బాదాం: 10:12 (soaked for 30 minutes)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
ఎండు మిర్చి: 3
టమోటో గుజ్జు: ½ cup
జీలకర్ర పొడి: 1tsp
పాలు: 1tbsp
గరం మసాలా: 1tsp
లవంగం: 1
పంచదార: ½ tsp
బిర్యానీ ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదాం, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మరియు రెండు ఎండు మిర్చి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా మెత్తగా పేస్ట్ ను తయారు చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, మీకు నచ్చిన సైజులు కట్ చేసి పన్నీర్ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి(కనీసం ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి) వీటి ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
3. తర్వాత ఒక బౌల్లో కారం, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి .
4. ఇప్పుడు పన్నీర్ వేయించుకొన్న అదే సాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఎండు మిచ్చి, వేసి వేయించి కలిపి పెట్టుకొన్న కారం, ధనియాలపొడి లిక్విడ్ ను మసాలా దినుసులు వేగుతున్న పాన్ లో పోసి బాగా కలియ బెట్టాలి.
5. ఇప్పుడు అందులోనే ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఎక్కువ మంటమీదా ఐదు నిముషాల పాటు ఉడికించాలి. ఐదు నుండి పదినిముషాల తర్వాత టమోటో గుజ్జును కూడా ఉడుకుతున్న మిశ్రమంలో పోయాలి.
6. రెండు మూడు నిముషాల తర్వాత గరం మసాలా, మరియు జీలకర్ర పొడి, చిలకరించి, అరకప్పు నీటిని పోసి బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం గ్రేవీలా చిక్కబడేటప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు, కొద్దిగా పాలు, మరియు పంచదార వేసి బాగా కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. అంతే బాదాం పన్నీర్ గ్రేవీ రెడీ... కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగుతో గార్నిష్ చేసి రోటీ, రైస్ తో సర్వ్ చేయాలి.

Wednesday, November 28, 2012

కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం

కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఆచరించినా సరిపోతుందనీ... అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. అదే ‘కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం’.
పౌర్ణమి... ప్రతినెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత. మరే పున్నమికీ ఉండదు. ఖగోళపరంగా చూస్తే... ఏడాది మొత్తమీదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. అంతలా వెలిగిపోయే వెనె్నలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలూ జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు.
కార్తీక పౌర్ణమినాడు వేకువజామునే లేచి శివనామ స్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు మహిళలు.
పెళ్లికాని అమ్మాయిలు కార్తీక దీపాలను నదుల్లో వదిలి, రాత్రికి తులసి కోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముతె్తైదువులు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ల నోము. ఈ నోముకోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. రెండోది కృత్తికా దీపాల నోము. ఆరోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా... కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట.
దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలకాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధనవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. వెలిగించే వాళ్లకి సహాయకులుగా ఉన్నా... కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజున... కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.
ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమినాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీప మాలలుగా పిలుస్తారు. గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక... ఇలపై శివుని ఆవాసంగా భావించే మహా పుణ్య క్షేత్రం వారణాసిలో గంగానది తీరంలోని ఘాట్‌లన్నీ కార్తీక పున్నమినాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని కార్తీక దీపార్తన అంటారు స్థానికులు. ఆరోజు పుష్కర్‌తోపాటు గంగానదిలో స్నానం చేస్తే ముక్తిని పొందుతారన్నది మరో నమ్మకం.
----------------------------
భగవంతుడే పనిచేయడానికి ప్రేరణ అయతే చేసే పని ఆరాధన .
భగవంతునిపై భారం వేసి ముందుకు సాగితే ఫలితం శుభమే.
Samputi Magazine



కార్తీక పౌర్ణమి

కార్తీకపౌర్ణమి పవిత్రమైనది. ఈ రోజు చేసే స్నానం, దానం, హోమాల వలన అనంతమైన పుణ్యం వస్తుందంటారు. ఈ రోజు గంగాస్నానం చేసి సాయం సమయంలో దీపారాధన చేయాలి. ఈ రోజు చేసే దీపారాధన వలన పది యజ్ఞాలు చేసిన ప్రతిఫలం పొందవచ్చు. ఈ రోజు వ్రతం ఆచరించి సత్యనారాయణ కధను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు,తులసిచెట్టు ఈ మూడింటో ఎక్కడో ఒక చోట దీపారాధన వెలిగించాలి. కాశీలో ఈ రీతిని జరుగుతుంటాయి. కార్తీక పౌర్ణమి చేసి జాగయరణ చేస్తే కోరుకున్నవన్ని నెరనేరతాయని చెబుతారు

చలికాలం చల్లగా జారుకోవడానికి..నులివెచ్చని జాగ్రత్తలు..!

సాధారణంగా వాతావరణ విషయంలో అన్ని కాలాల్లో కంటే చలికాలం అంటే చాలా మంది ఇష్టం ఎందుకంటే మరి కొద్దిసేపు ఎంచక్కా వెచ్చగా పడుకోవచ్చని. చలికాలంలో వీచే కఠినమైన చల్ల గాలుల వల్ల పడక మీద నుండి లేవబుద్ది కానీవ్వదు. మరి వాతావరణం చల్లగా చల్లగా ుంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ?ఎందుకేంటండి.... చాలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమ్ ను తినేయడమే కాదు మన శరీరం మీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది ప్రత్యేకంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. చలికాలం అనగానే ఓ వెరపు. బుగ్గలు ఎర్రగా అయిపోయి, పెదాలు, పాదాలు పగుళ్లు, చేతులు పొడిగా మారి, చర్మం చిట్లి... మొత్తానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది పరిస్థితి. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, శిరోజాలకు ఎదుర్యే సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో చూద్దాం..
winter season body care tips

చర్మ సంరక్షణ: ఈ కాలంలో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మాయిశ్చరైజర్లు వాడాలి. మీగడ ముఖానికి, చేతులకు రాసుకుని స్నానంచేయాలి. ఈ కాలంలో సబ్బుకన్నా సున్నిపిండి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసుకుని స్నానంచేయాలి. రాత్రి పడుకునేముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకుని పడుకోవాలి. లేదంటే కొబ్బరినూనె రాయాలి. ఫేస్‌ప్యాక్‌లు ముఖాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకని ఫేస్‌ప్యాక్‌లు పళ్ల మిశ్రమం వంటివైతే బెటర్‌. పగులుతున్నాయి కదాని పదేపదే పెదాలను తడి చేసుకోరాదు. పెదాలు పగలకుండా లిప్‌బామ్‌, విటమిన్‌ ఇ ఆయిల్‌ అప్లై చేయాలి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకోబోయేముందు లోషన్‌ లేదా గ్లిజరిన్‌ రాసుకోవాలి. చర్మ సమస్యలు ఎదురైతే వైద్యుని సంప్రదించాలి.
ఎండనుండి: సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు. ఈ సమయంలోనూ అవసరమే! చలికాలంలో ఎండ చురుక్కు మంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అది వేడితో మరింత ఇబ్బందిపడుతుంది.
శిరోజాలు: ఈకాలంలో ఎదురయ్యే జుట్టు పొడిబారడం, చిట్లటం, చుండ్రువంటివి రాకుండా జాగ్రత్తపడాలి. హెయిర్‌ డ్రైయ్యర్‌ వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది.
ఆహారం: చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే! ముఖ్యంగా సూప్‌లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. ప్రోటీన్లు గల గింజధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్‌ పళ్లు తీసుకోవాలి. ఆయా కాలానికి అనుగుణంగా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ఆ పళ్లలో ఉంటాయి మరి! వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తినడం, బయటి నీళ్లు తాగడం వంటివి చలికాలం అనికాదు, ఏం కాలంలోనూ మంచిదికాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు.
దుస్తులు: చలి గాలి సోకని మందపాటి దుస్తులు ధరించాలి. దుప్పట్లు, రగ్గులు చలికాలంలో కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తూ గ్లిజరిన్ సబ్బుకుగాని సున్నిపిండిని గానీ వాడాలి. చలికాలంలో సాధారణ సబ్బు వాడకం వలన ముఖం మీద చర్మం బిగుసుకుని బిరుసుగా గరుకుగా ఉంటుంది. అందువలన చలికాలములో సున్నిపిండి, కుంకుడుకాయలతో ఒళ్ళు రుద్దుకోవడం మంచిది.
పరిశుభ్రత: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్వెట్టర్లు, రగ్గులు ఎండలో వేస్తుండాలి. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చాలు... చలికాలం చలచల్లగా జారుకోడానికి!

శీతాకాలంలో మొటిమలు రావడానికి ప్రధాన కారణం..!?

సాధారణంగా చాలా మంది మొటిమలు, మచ్చలు ఏర్పడ్డానికి కారణం ఆయిల్ స్కిన్ మరియు వేడి వల్ల వస్తుంటాయి అనుకొంటుంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వేసవి కాలంలోనే ఎదురౌతాయి. అలాగే శీతాకాలంలో కూడా మొటిమలు రావడానికి అవకాశం ఉంది. కొంత మందిని ఇచ్చిన వివరణ ప్రకారం వేసవిలో కంటే శీతాకాలంలోనే మొటిమలు ఎక్కువగా బాధిస్తాయని తెలిసింది. ఐతే ఇది చెమట, వేడి వల్ల వచ్చే మొటిమలు కాదా..? మరి అయితే శీతాకాంలో మొటిమలకు దారితీసే కారణాలేంటి? ఒక సారి చూద్దాం...
why do we get acne winter

1. ఎక్కువగా కోల్డ్ క్రీమ్స్ ను ఉపయోగించడం: లిక్విడ్ రూపంలో కాకుండి చిక్కగా ఉండే కోల్డ్ క్రీమ్స్ చర్మానికి రాయడం వల్ల మొటిమలు ఏర్పడ్డ ప్రదేశం, మొటిమల వల్ల ఏర్పడ్డ రంద్రాలు మొత్తం నల్లగా మార్చివేస్తుంది కోల్డ్ క్రీమ్. శీతాకాలంలో చాలా వరకు పొడి చర్మం కలిగి ఉంటారు. కాబట్టి కోల్డ్ క్రీమ్ ను అప్లై చేయడం వల్ల చర్మంలో తేమ బయటకు రానివ్వకుండా అడ్డుకుంటుంది. దాంతో ముఖంగా నల్లగా కనిపిస్తుంటుంది. దాంతో ముఖం అసహ్యంగా కనబడుతుంది.
2. థిక్(చిక్కటి)కోల్డ్ క్రీమ్: శీతాకాలంలో పొడి బారిన చర్మ సంరక్షణకు కోల్డ్ క్రీమ్ మాయిశ్చరైజర్ చేయడం సహజం. అయితే మాయిశ్చరైజింగ్ కోసం చాలా చిక్కగా ఉండేటటువంటి కోల్డ్ క్రీమ్ ఎంపిక చేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను మూసుకొనేలా చేసి చర్మాన్ని నల్లగా మార్చుతుంది. కాబట్టి లైట్ గా ఉండే బాడీ లోషన్ లేదా ఫేష్ లోషన్ ను అప్లై చేయడం వల్ల మొటిమలు.. మచ్చల నివారణ పొందవచ్చు.
3. నో స్వెట్ -నో క్లీనింగ్: ఒక రకంగా చెమట కూడా మొటిమలు రావడానికి కారణమే. అయితే చెమట పట్టడం అనేది శరీర ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చెమట పట్టడం వల్ల చర్మలోపల ఉన్న దుమ్ము, ధూళి చెమట రూపంలో బయటకు విసర్జింపబడుతుంది. అయితే శీతాకాలంలో ఎక్కువ చెమట పట్టదు. దాంతో దుమ్ము, ధూళి కణాలు చర్మంలోపలే నిలిచి ఉండిపోతాయి. ఈ టాక్సిన్స్ వల్ల శీతాకాలంలో మొటిమలు రావడానికి ప్రధాన కారణం అవుతుంది.
4. ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవడం: సాధారణంగా శీతాకాలంలో చలి వల్ల ఏదైనా చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు తాకాలంటే ఇష్టం ఉండదు. చల్లని వాతావరణం వల్ల ముఖం కూడా సరిగా శుభ్రం చేసుకోరు. వేసవిలో శరీర సంరక్షణకు, ముఖ సంరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం ఫలితంగా చర్మం మురికిగా మారుతుంది. కొన్ని సార్లు మేకప్ తొలగించుకోవడం మర్చిపోతారు. దాంతో కూడా మొటిమలు మచ్చలు సులభంగా ఏర్పడుతాయి.
5. సన్ స్క్రీన్ ఉపయోగించకపోవడం: ఏకాలంలో నైనా సరే సూర్యకిరణాలు డైరెక్ట్ గా చర్మ మీద పడినప్పుడు చర్మ సమస్యలు ఏర్పడాటానికి అవకాశం ఉంది. చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు ఏర్పడం ఇవన్ని సూర్యరశ్మి వల్లే. కాబట్టి శీతాకాలంలో కూడా బయటకు వెళ్ళె అరగంట ముందే సన్ స్ర్కీన్ లోషన్ ను అప్లై చేసుకొని వెళ్ళాలి. చలికాలంలో సూర్యరశ్మి హానికరం కాకపోయినా, సూర్యకిరణాల్లో ఆల్ట్రావయొలెట్ కిరణాలు ఉండటం వల్ల చర్మనికి హానికలిగిస్తుంది. కాబట్టి సన్ స్ర్కీన్ లోషన్ తప్పనిసరి.
మరి మొటిమలు నిరోధించడానికి ఏమి చెయ్యాలి?
1. శీతాకాలంలో చర్మానికి ఒక సారి మాత్రమే కోల్డ్ క్రీమ్ ను అప్లై చేయాలి.
2. క్రమం తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక వేళ శుభ్రం చేసుకొన్న తర్వాత ముఖం డ్రైగా కనబడుతుంటే ఫేస్ వాష్ చేసుకొన్న ప్రతి సారి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
3. ఎక్కువ నీళ్ళు తాగుతుండాలి. లేదంటే శరీరంలోపల అధిక వేడికి గురిఅవుతుంది. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో శీతాకాలంలో ఏర్పడే మొటిమలను నివారించవచ్చు.

సహజమైన అందానికి పసుపు..గంధం..!

స్వాభావికంగా ఉండే కొన్ని మామూలు పదార్థాలతో జీవితాన్ని చాలా అందంగా చేసుకోవచ్చు. అలాంటి అందాన్ని పెంపొందించుకునే సాధారణ పదార్థాలను ఎప్పటి నుంచో మనం వాడుతూనే ఉన్నాం . సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో కొత్త కొత్త సౌందర్య సాధనాలు వచ్చినా అవి మాత్రం ఆరోగ్యకరమైనవిగా ఎప్పుడో కాలానుగుణంగా నిలదొక్కుకొన్నాయి. ఇటీవల వాస్తవరూపంలో వాటి ఉపయోగాన్ని మరిచిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యం కోసం వాటి ప్రాముఖ్యతను గుర్తుచేసుకుందాం. వాటిలో కొన్ని మీ కోసం........
Natural Skin Care With Turmeric Sandal
1. పసుపు: పసుపు కొమ్ములుగా పేర్కొనే ఒక మొక్కల వేళ్ళను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వంటలోనూ పసుపును విరివిగా వాడుతుంటారు. పసుపు కీటక వినాశనిగా పనిచేస్తుంది. దానితో పాటు ముఖానికి కూడా సౌందర్య సాధనంగా పసుపు రాసుకుంటారు. అందువల్ల ముఖానికి మెరుగైన ఛాయ వస్తుంది. అయితే దీర్ఘకాలంపాటు పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దానివల్ల ముఖం తడికోల్పోయి పొడిబారే అవకాశం ఉంది.
2. చందనం: మన తెలుగు సంసృతిలోని ఎన్నో ఉత్పవాల్లో కాళ్లకు పసుపుతో పాటు...మెడపై గంధం రాసుకేనే సంప్రదాయం కూడా ఉంది అంటే సౌందర్య సాధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంసృతిలో అంతర్భాగంగా మారింది. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యగా ఉపయోగించడంతో పాటు చలువచేసే సాధనంగా వాడతారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గందాన్ని తయారు చేసి వాడతారు. దీన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో పెఫ్యూమ్స్ లో, సబ్బుల్లో , ఫేస్ ప్యాకులుగానూ ఉపయోగిస్తున్నారు. చందనంతో ముఖానికి ప్యాక్ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే...
3. శనగపిండి: ముఖానికి ఉన్న జిడ్డు తొలగించడానికి దీన్ని ఒక ప్యాక్ లా వేసుకోవడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతి, దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో మేని ఛాయ మెరుగవుతుందన్నది విశ్వాసం.
4. కొబ్బరి నూనె: ఇది ముదిరిన కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంసృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే ఇది శ్రేష్టమైనది. దీనితో పాటు ఆరోగ్యకరమైన, కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా మామూలే. కొబ్బరి నూనెను శరీరానికి బాగా పట్టించి మర్ధన చేయడం వల్ల శరీరానకి కావలసిన తేమ అంది, చర్మం చూడటానికి సున్నితంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
5. గోరింటాకు: ఇటీవల మెహందీ పేరిట ప్రాచుర్యం పొందిన ఆకు నుంచి తీసే ఈ ఉత్పాదనను సౌందర్య సాధనంగా ఎప్పటినుంచో మన సంసృతిలో ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్ ఏజెంట్ గా మాత్రమేకాక...చల్లదనాన్ని ఇచ్చే సౌందర్యసాధనంగా పేరుపొందింది.ఇటీవల దీన్నీ తలకు వేసే రంగుల్లో ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లిసంబరాల్లో ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది ఒక సంసృతి వేడుక.
6. సాంబ్రాణి: ఇది కొన్ని రసాయనాలతో పాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి రోజూ చంటిపిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందులోనుంచి వచ్చే పొగ క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలున్న గదిలో దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకొని హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేస్తుందన్నామాట....

గుత్తివంకాయను మరిపించే గుత్తికాకరకాయ

సాధరణంగా వెజిటేరియన్స్ వివిధ రకాల కూరగాయలతో వివిధ రకాల వంటలు వండుతుంటారు. అయితే రొటీన్ గా వండటం కంటే అప్పుడప్పుడు కొంచె డిఫరెంట్ గా వండటం వల్ల వాటి రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. తినడానికి కూడా బోర్ అనిపించదు. చాలా మంది కాకరకాయను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానిలో ఉండే చేదువల్ల. అయితే దానిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొన్న తర్వాత తినకుండా మాత్రం ఉండరు. కాబట్టి కాకరకాయ చేదులేకుండా చేసే విధానంలో కొంచెం మార్పు చేసి చూడండి...ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో...
bharwa karela stuffed bitter gourd


కావలసిన పదార్థాలు:
చిన్న సైజు కాకరకాయలు: 6
పసుపు: 1tsp
నిమ్మరసం: 2tbsp
జీలకర్ర: 1tsp
ఇంగువ: 1 pinch
నువ్వులు లేదా సన్ ఫ్లవర్ గింజలు: 1tsp
ధనియాలపొడి: 1tsp
కారం: 1tsp
ఆంచూర్(ఎండిన మామిడికాయపొడి): 1tsp
శెనగపిండి: 2tbsp
నూనె: 4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పల నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, రెండు చెంచాల నిమ్మరసం వేసి నీటిని మరిగించాలి.
2. తర్వాత కాకరకాలయను మీకు కావల్సిన సైజులో నిలువుగా కట్ చేసి లోపల ఉన్న గూడును, గింజలను తొలగించాలి. ఆ తర్వాత పైన మరింగించి పెట్టుకొన్న నీటిలో 20 నిముషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల చేదు తొలగిపోతుంది. అరగంట తర్వాత వేడినీటిలో నానబెట్టిన కాకరకాయలను నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా పాన్ లో కొద్దిగా నూనె వేసి ఐదు నిముషాల పాటు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేసి, కాగిన తర్వాత అందులో జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి వేగించాలి.
4. తర్వాత అందులోనే శెనపిండి, ధనియాలపొడి, నువ్వులు, కారం, ఆంచూర్ పౌడర్ ఇలా అన్ని వేసి బాగా వేగించాలి.
5. మసాలా అంతా బాగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేయించి పెట్టుకొన్న కాకరకాయ మధ్యలో ఫ్రైచేసిన మిశ్రమాన్ని నింపి, పైన మరో కాకరకాయ ముక్కతో క్లోజ్ చేసి దారంతో కట్టేయాలి. అందువల్ల లోపల ఉన్న మసాలా మిశ్రమం బయటకు విడిపోకుండా ఉంటుంది.
6. ఇప్పుడు మిగిలిన నూనెను పాన్ వేసి వేడి అయిన తర్వాత స్టఫ్ చేసిపెట్టుకొన్న కాకరకాయను అందులో వేసి మూత పెట్టి మరో 10-15నిముషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలియబెడుతుండాలి. అప్పుడే అన్ని వైపులా కాకరకాయ బాగా ఉడుకుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పప్పు, అన్నంతో సైడ్ డిష్ గా స్టఫ్ కాకరకాయ మంచి కాంబినేషన్.

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చికెన్ షీక్ కబాబ్

కబాబ్స్ ఇండియాలో చాలా ఫేమస్. చాలా రుచిగా... వివిధ రకాల టేస్ట్ లతో, తయారు చేస్తారు. నాన్ వెజ్ వెరైటీలలో షీక్ కబాబ్స్ కు మించిన టేస్ట్ లేదంటే నమ్మండి. చికెన్ కబాబ్ లకంటే మరింత టేస్ట్ గా ఉండే ఈ షీక్ కబాబ్స్ ఎందకంట టేస్టీగా ఉంటాయంటే .. నిప్పుల మీద లేదా మైక్రో వోవెన్ లో కాల్చడం వల్ల సుగంధ మసాలా దినుసులు బాగా పట్టించడం వల్ల అంత టేస్టీ గా ఉంటాయి. అయితే ఇవి రెస్టారెంట్లకే పరమితం కాకుండా మనం కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం....
make chicken sheek kebabs at home

కావలసిన పదార్థాలు:
చికెన్: 500 grams (minced)
నెయ్యి: 2tbsp
ఉల్లిపాయ: 1 (chopped)
వెల్లుల్లి: 5 cloves
అల్లం: 1/2 inch
పచ్చిమిర్చి: 4
పుదీనా: 1 spring (chopped finely)
కొత్తిమీర ఆకులు: 1 spring (chopped finely)
కారం: 1tsp
శెనగపిండి: 2tbsp
జీలకర్ర: 1tsp
లవంగాలు: 4
యాలకలు: 4
చెక్క: 1/2 inch
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
బొగ్గు ముక్కలు: 3-4
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, మీడియం మంట మీదు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
2. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి వాటితో పాటు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. అంతలోపు సుగంధ మసాలాదినుసులు (యాలకులు, చెక్క, లవంగాలు, జీకర్ర) ఇవన్నీ పాన్ లో వేసి తక్కువ మంట మీద వేయించి పెట్టుకోవాలి.
4. ఈ సుగంధ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకొని ముందగా పేస్ట్ చేసుకొన్న ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమంలో కలుపుకోవాలి.
5. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిపెట్టుకొన్న చికెన్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇంకా అందులో ఉప్పు, నెయ్యి, కారం,కొత్తిమీర,పుదీనా తరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు రెండు చెంచాల శెనగపిండి కూడా చికెన్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టి రెండు మూడు గంటల తర్వాత లేదా ఇంకా ఎక్కువ సమయం పెట్టినా కూడా మసాలాలు బాగా పడుతాయి.
7. వండేందుకు ఒక గంట ముందు ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలను ఉన్న గిన్నెలోనే చికెన్ మద్యలో ఖాలీ ప్రదేశం ఉండేలా గిన్నెలో రౌండ్ గా సర్దుకోవాలి. ఖాలీగా ఉన్న ఆ ప్రదేశంలో బాగా కాలుతున్న బొగ్గుముక్కలను పోయాలి. దాంతోనే కబాబ్స్ కు మంచి వాసన వస్తుంది.
8. అరగంట తర్వాత కాలిన చికెన్ ముక్కలను ఒక కడ్డి(షీవర్స్)తో గుచ్చి పైకి తీసుకొని, బొగ్గులను ఆర్పేయాలి. ఇప్పుడు ఆ కడ్డీకున్న చికెన్ ముక్కలకు కొద్దిగా నెయ్యి రాయాలి.
9. ఈ చికెన్ గుచ్చిన షీకర్స్ ను మైక్రోవోవెన్ లో పెట్టి 30-60డిగ్రీ పవర్ లో బేక్ చేయాలి. ఈ షీకర్స్ తిరుగుతుండేలా చూసుకోవాలి. అప్పుడే చికెన్ అన్నివైపులా బాగా ఫ్రై అవుతుంది. బాగా బేక్ అయిన తర్వాత వొవెన్ ఆఫ్ చేసి పది నిముషాల తర్వాత బయటకు తీసి ఉల్లిపాయతో సర్వ్ చేయాలి అంతే చికెన్ షీక్ కబాబ్ రెడీ.

క్యారెట్ ఓట్స్ తో ఫ్యాట్ లెస్ వింటర్ సూప్...

చలికాలం వచ్చేసింది. ఓ ప్రక్క చలి.. మరో ప్రక్క మంచు. శరీరాన్ని గజగజా వనికిస్తుంటే ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం ఆరోగ్యకరమైన సూప్స్ త్రాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. హెల్తీ సూప్స్ తాగడం వల్ల ఒత్తిడిని తగ్గించి హృదయాన్ని తేలికపరుస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం..
ఓట్స్ : 1/4cup
క్యారట్: 2
ఉల్లిపాయ: 1
వెన్న: 1tps
ఉప్పు: రుచికి తగినంత
మిరియాలపొడి: 1/2tsp
కొత్తిమిర తరుగు: 2tbsp
Healthy Winter Soup Carrot Oats Soup
తయారు చేయు విధానం:
1. ముందుగా క్యారట్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకగిన్నెలో రెండుకప్పుల నీళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి.
2. ఉడికించిన క్యారెట్, ఉల్లిపాయలు చల్లారాక గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో వెన్నవేసి వేడి చేసి అందులో ఓట్స్ వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత ఇందులో కప్పుడు నీళ్ళు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇందులో గ్రైండ్ చేసి వడగట్టి పెట్టుకొన్న క్యారెట్ రసం, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేవరకు మరిగించాలి. ఇందులో టమాటా లేదా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. అంతే ఈ విటర్ లో హెల్తీ క్యారెట్ ఓట్స్ సూప్ రెడీ...

మీ జీవిత కాలాన్ని రెట్టింపు చేసే హెల్తీ హ్యాబిట్స్...

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకూ పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనాబ్రతికేయగలడు. మనిషికే కాదు, ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆహ్లాదం.. నిజమైన సంతోషం ఎంతో విలువైనది. మనిషి జీవితంలో ప్రశాంతత ఉన్నప్పుడు ఆనందం, సంతోషమనేది సాధ్యమవుతుంది. మనిషికి సంతోషమనేది పెద్ద ఆస్తి. అంతకుమించిన ఆస్తి ప్రస్తుత సమాజంలో దొరకదు. నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్న సమయంలో కొద్దిపాటి సంతోషం అవసరం. నేటి సమాజంలో మనిషి మానసిక క్షోభకు గురౌతున్నాడు. దానికి ఏకైక విరుగుడు సంతోషమే. సంతోషంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా నిత్య కృషివలుడుగా ఉండటం సాధ్యపడుతుంది. ప్రతి కుటుంబంలో జీవిత భాగస్వామి వారి పార్ట్నర్ కోసం లేదా పిల్లల కోసం తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. వారి పట్ల ప్రేమను కలిగి ఉంటారు.

భోజనాన్ని మరచిపోకూడదు: మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగ గడపడానికి సరైన ఆహారాన్ని, సరైన టైమ్ కు తీసుకోవాలి. ఇలా సమయానికి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. స్థిర శక్తిని కలిగి ఉంటుంది. సమయం తప్పించి తినడం లేదా అసలు తినకకుండా ఉండటం వల్ల తర్వాత తీసుకోనే ఆహరం వేగంగా తినడం లేదా ఎక్కువగా తినడం వల్ల క్యాలొరీలు శరీరానికి ఎక్కువగా అంధించబడి, బరువు పెరగడానికి దారితీస్తుంది.



రెగ్యులర్ ఎక్సర్ సైజ్: వ్యాయామం ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాయామం అంటే శారీరక, మానసిక వ్యాయామం. 'ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు' ఉండాలి. వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచి ఎటు కావాలంటే అటు వంగేటట్లు చేస్తుంది. కుటుంబ సభ్యులకు క్రమం తప్పని వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. జిమ్‌, ఎరోబిక్స్‌, చురుగ్గా నడవడం, ఈత, షటిల్‌ లేదా ఇంకేవైనా శరీరానికి వ్యాయామాన్నందించే ఆటలు ఆడాలి. దాంతో మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది ఇంకా బరువును కంట్రోల్ చేస్తుంది, డయాబెటిస్ వంటివి రాకుండా సహయపడుతుంది. దాంతో మీ కుటుంబ సభ్యలంతా ఎల్లప్పుడు ఆరోగ్యంగా..నిత్య యవ్వనంతో జీవించగలుగుతారు.



బ్రెషింగ్ చేసే విధానం: నోరు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుందంటారు. అది అక్షరాల నిజం. నోరు ఆరోగ్యంగా ఉంచకోవడం వల్ల రక్తప్రసరణ జరిపే ధమనులు ఆరోగ్యం ఉంటాయి. మంచి రక్తాన్ని శరీరానికి ప్రసరింపచేస్తాయి. రెగ్యలర్ గా రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం వల్ల నోట్లో ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు గుండెకు ప్రసరించే రక్తంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడి, కుటుంబం సభ్యలు జీవితకాలన్ని పెంచుతుంది.


అందరూ కలసి ఆటలు ఆడటం: భారతదేశంలో చాలా వరకూ పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పూర్తిగా కరువౌంది. అలాంటప్పుడు సంతోషంగా, ఆహ్లాదంగా గడపడం కోసం వారాంతంలో, సెలవుదినాల్లో బయట విహారయాత్రకు ప్లాన్ చేసి అందురూ కలిసేలా చూడండి. విహార యాత్రలో ఫ్యామిలీప్లాన్, ప్యామిలీ స్పోర్ట్స్ వంటివి మీమ్మల్ని మీకుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచడమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్నిస్తుంది. శారీర బరువు, ఒత్తిడిని తగ్గించేందుకు బాగా సహాయం చేస్తుంది. అంతే కాదు కుటుంబ సభ్యలు మధ్య కమ్యూనికేషన్ బలపడానికి మరింత సహాయం చేస్తుంది.


మంచి ఆహారం: మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అని కాదు. రుచికరమైనదని కూడా కాదు. మంచి ఆహారం అంటే శరీరానికి మేలు చేసేది. దీనిలో పౌష్టికత బాగా ఉండాలి. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు తగిన నిష్పత్తిలో ఉండాలి. 8 నుండి 10 గ్లాసుల నీరు కూడా తాగాలి. వయసును బట్టి, ఆడమగా తేడాను బట్టి, చేసే శ్రమను బట్టి ఆహారం తీసుకోవాలి. ఎవరికి వారు తాము ఎలాంటి సమతులాహారం తీసుకోవాలో తెలుసుకుని భుజిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాల బారిన పడకుండా మన శరీరం కాపాడుతుంది.



హెల్తీ బ్రేక్ ఫ్యాస్ట్: ప్రతి రోజూ మనం ఉదయాన్నే తీసుకొనే అల్పాహరం భోజనం కంటే విలువైనది.. ఆరోగ్యకరమైనది. రోజంతటికీ కావల్సిన శక్తిని ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తోనే అందుతుంది. కాబట్టి మీరు, మీకుటుంబ సభ్యలు ప్రతి రోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకొనేలా శ్రద్ద తీసుకోండి. పెద్దలు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడ వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. పిల్లల విషయంలో వారి శరీర పెరుగుదలకు, మెదడు చురుగ్గా ఉండటం కోసం అల్పాహరం అవసరం. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లేకుండా ఎవ్వరి బయటకు అనుమతించకూడదు.



చేతులు-కాళ్ళు పరిశుభ్రంగా: ఉదయం నిద్రలేవగానే ముఖం, కాళ్లు కడుక్కోవడం బయటినుండి ఇంట్లోకి వచ్చినపుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం, భోజనం ముందు, తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవడం, రోజూ స్నానం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. కాళ్ళు చేతులు మంచి యాంటి బయోటిక్ సోపులను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.



సరైన నిద్ర: నిద్రించే సమయంలో శరీరం విశ్రాంతిలో ఉంటుంది. శరీరం లోపలి అవయవాల పని చురుకుదనం తగ్గుతుంది. మెదడు నిద్రావస్థలో ఉంటుంది. గుండె కొట్టుకునే రేటు కూడా నిమిషానికి 72 నుండి 55కి పడిపోతుంది. గాఢ నిద్ర అనంతరం మేల్కొనగానే మనసు, శరీరం చాలా తాజాగా ఉంటాయనేది మనకు అనుభవంలోని విషయమే. నిద్రలేమితో శరీరంలో ఆమ్లాల పరిమాణం పెరిగి కంటికింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొంతమంది మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తారు. ఈ కాస్త నిద్ర వారి మెదడులో చురుకుదనాన్ని పెంచుతుంది. ప్రతి రోజూ 6 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. అంతకు మించిన నిద్ర చాలా ప్రమాదం. ఇది బద్దకాన్ని పెంచుతుంది.



రెగ్యులర్ హెల్త్ చెకప్(వైద్య పరీక్షలు): అనవసరమైన ఆరోగ్య సమస్యలు మరియు భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్యాలు, వాటి తాలుకూ భారీ వ్యయాలను నివారించాలంటే రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరం. ఆరోగ్యం వయస్సును బట్టి, స్త్రీ, పురుషులను బట్టి, మారుతుంటాయి. కాబట్టి రెగ్యులర్ చెకప్ లో రక్త పరీక్ష, బీపి, కొలెస్ట్రాల్ చెకప్ వంటివి చేయించుకోవడం చాలా అవసరం.



బంధాలు బలపరచుకోవడం(బెటర్ రిలేషన్ షిప్): మీరు, మీ జీవిత భాగస్వామి మధ్య ప్రేమ సజీవంగా, జీవిత కాలం ఉండాలంటే శృంగారం అవసరం. మీ ఆరోగ్యానికి పెంపొందించుకోవడానికి, జీవితకాలం ఒకరికొకరు తోడుగా గడిపేందుకు ఇది సహాయం చేస్తుంది.



కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా, వారి పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నా అందంతా సంతోషంగా గడపడం కోసమే. ఆనందగా గడపడానికి కావల్సింది సంతోషమే అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే సంతోషంగా గడపడం, లేదా సంతోషంగా ఉండటం అన్నది ఎంత మంది ఫాలో అవుతన్నారు చెప్పండి? జీవితం ఆనందమయంగా గడపడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. దానికి గొప్ప ఉద్యోగం, బోలెడంత డబ్బు, ఉండనక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు చేర్పులు ద్వారా సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకు కొన్ని హెల్తీ ఫ్యామిలీ హ్యాబిట్స్ ను అలవర్చుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా గడపగలరు. ఈ అలవాట్లును అవవర్చుకోగలిగినట్లైతే మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండగలరు.

నిమ్మ-తేనె జ్యూస్ లో దాగున్న బోలెడు ఆరోగ్యప్రయోజనాలు...

సాధారణంగా మనం వినే ఉంటాం నిమ్మరసం, తేనెలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో అని. అధ్భుతమైన ఈ రెండింటి కాంబినేషన్ కొద్దిగా ఉప్పగా, రుచిగా, తియ్యగా, కమ్మగా ఉండే ఈ కలయిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగిస్తుంది. డైటేరియన్ నుండి ఫిట్ నెస్ వరకూ ఇది అద్భుతమైన ఫలితాలను అంధిస్తుంది. డైయట్ ఫాలో అయ్యే వారు కనీసం రోజుకు ఒక్కసారైనా ఒక్క గ్లాస్ ఈ కాంబినేష్ డ్రింక్ ను తాగాల్సిందే అంటున్నారు. ఎందుకంటే అతి త్వరగా సహజంగా బరువును తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అంతే కాదు తేనె-నిమ్మరసం కాంబినేషన్ లో ఇంకా బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అవి మీరు తెలుసుకోవాలంటే ఈ నిమ్మ-తెనె కాంబినేషన్ లోని డ్రింక్ తాగాల్సిందే. మరీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం...
benefits drinking lemon honey juice

1. బరువు తగ్గించడానికి: ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ మరియు తేనెలోని యాంటిఆక్సిడెంట్స్ వేడి నీళ్ళలో కలపడం వల్ల అద్భుతమైనటువంటి జ్యూస్ గా తయారై మంచి ఫలితాలనందిస్తుంది. ఎవరైతే బరువు తగ్గించుకోవడానికి అధికంగా వర్కౌట్స్ చేస్తున్నారో వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
2. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: నిమ్మరసంతో మరొకో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం. జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను నివారిస్తుంది. మీరు కనుక కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లైతే నిమ్మరసం, తెనె మిశ్రమాన్ని కలిపిన జ్యూస్ ను సేవించండి.
3. శరీరాన్ని శుభ్రపరచడానికి: ఇది మరొక ఆరోగ్య ప్రయోజం. నిమ్మరసం, తేనెతో మిశ్రమంతో తీసుకొనే ఈ జ్యూస్ ను వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయబడుతుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గి, మెరిసే చర్మాన్ని సొతం చేసుకోవాలనుకొంటే ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగాలి. తేనె, నిమ్మరసం వేడినీళ్ళతో మిక్స్ చేసి తాడం వల్ల మలబద్దకాన్ని పోగొట్టి, ప్రేగును శుభ్రం చేస్తుంది.
4. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది: ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది సాధారణ సమస్యగా మారింది. అందుకు కారణం తక్కుగా నీళ్ళు తాగడం, క్యాల్షియం అధికంగా ఉండటం చేత కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అలాగే యూరిన్ ఎక్కువ సేపు పోకుండా అలాగే ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏమికాదు క్యాల్షియం నిక్షేపాలు నిల్వ ఉంటాయి. వీటిని కిడ్నీస్టోన్స్ అంటాం. కాబట్టి వాటిని కరిగించడానికి ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరంలో అధిక కాల్షియంను తొలగించడానికి నిమ్మకాయం బాగా పనిచేస్తుంది.
5. గొంతు నొప్పిని నివారిస్తుంది: గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ కలిగి ఉండటం వల్ల గొంతు సమస్యలు కలిగించే జర్మ్స్ ను చంపేస్తుంది . వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.
6. పెద్దప్రేగు క్యాన్సర్ ను అడ్డుకొంటుంది: తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ అనామ్లజనకాలతో పోరడాకలిగే శక్తి ఉండి, పెద్ద పేగుకు క్యాన్సర్ కు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

మధుమేహాన్ని నియంత్రించగలిగే సహాయకారి...!

సాధారణంగా మన శరీరం పెరుగుతున్న వయస్సుతో పాటు దానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యపరంగా జింక్ లోపం అనేది సాధారణ సమస్య. మరీ ముఖ్యంగా వెజిటేరియన్ ఎక్కువగా తీసుకొనే వారికి. మనం రోజూ తీసుకొనే ఆహారంతో జింక్ అందదు. ముఖ్యంగా జింక్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా జింక్ కు, డయాబెటిస్ కు దగ్గర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. జింక్ లోపం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నాయి కొన్ని పరిశోధనలు. డయాబెటీస్ అనేది జీవన విధానంలో మార్పుల వల్ల ఏర్పడుతుంది . కాబట్టి జింక్ కంట్రోల్ చేసుకొన్నట్లైతే డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు అంటున్నారు. వైద్య నిపుణులు.
zinc can control your diabetes

జింక్ శరీరం కోల్పోయిన యాంటీబాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, బీన్స్‌, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం, జింక్ లోపం అధికంగా ఉంగే శరీరం దుర్వాసనలు వెలువరించవచ్చు. అలాకాకుండా మధుమేహం కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మలబద్దకం వంటివి కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. మెగ్నీషియం, జింక్ ఉన్నపదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. దీనికి తోడు మంచి నీటిని కనీసం ఎనిమిది గ్లాసులు రోజులో తీసుకుంటే చాలా ఈ సమస్య అంతగా వేధించదు. మరి జింక్ డయాబెటిస్ ను ఎలా నియంత్రిస్తుందో చూద్దాం...
డయాబెటీస్ అనేది హార్మోన్ లోపం. ఇన్సులిన్ హార్మోన్ అనేది డయాబెటిస్ కు ప్రధాన లక్షణం. శరీరంలో హార్మోనులను సమతుల్య చేయడానికి జింక్ చాలా అవసరం. శరీరంలో జింక్ వల్ల 300వివిధ రకాల హార్మోన్ల చర్యలు నియంత్రిస్తుంది. కాబట్టి జింక్ మధుమేహగ్రస్తులకు రక్షణ కలిగిస్తుంది. ఎక్కువ మినిరిల్స్ తీసుకోవడం వల్ల మధుమేహం నుండి ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్ ను కంట్రోల్ చేస్తుంది.
మానవ శరీరంలోని గ్లెసెమిక్ ను జింక్ మెరుగుపరుస్తుంది. శరీరంలో గ్లెసెమిక్ స్థాయి తగ్గిపోవడం వల్ల మధుమేహానికి చాలా ప్రమాధకరం. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు షుగర్ వెల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి జింక్ చాలా అవసరం.
మధుమేహం వల్ల మెదట రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అటువంటప్పుడు జింక్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ఇతర రోగాలన బారీన పడకుండా చేస్తుంది.
మధుమేహం శరీరాన్ని బలహీన పరుస్తుంది కాబట్టి ఏదైనా గాయాలు ఏర్పడినప్పుడు అవి నయం కావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అటువంటప్పుడు జింక్ తీసుకోవడం వల్ల శరీరానికి ఇది ఒకరకమైనటువంటి కషాయంలా పనిచేస్తుంది. గాయాలను త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు గాయాలు సెప్టిక్ కాకుండా నిరోధిస్తుంది.
ఒక వేళ మధుమేహం ఒక స్టేజ్ ధాటిన తర్వాత పురుషుల్లో సెక్స్ మీద ప్రభావం చూపుతుంది మరియు అది వారిని నపుంసకుడిని చేయవచ్చు. కాబటి శరీరానికి కావలసినంత జింక్ సంప్లిమెంట్ ను అందించడం వల్ల ఇటువంటి సమస్యలను సులభంగా ఎదుర్కొనవచ్చు.
మధుమేహం వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ హెయిర్ ఫాల్. చర్మం సమస్యలు. కాబట్ట తగిన పాళ్ళలో జింక్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఈ రెండు సమస్యలను అరికట్టవచ్చు. అంతే కాదు హెయిర్ లాస్ ను పూర్తిగా అరికట్టడంలో జింక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చర్మానికి రక్షణ కల్పించి వయస్సు పైబడినవారిగా కనబడనివ్వకుండా సహాయపడుతుంది. వృద్ధాప్యం లక్షణాలకు వ్యతిరేక ప్రభావం కలిగి ఉంటుంది. కాబట్టి జింక్ వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు అని తెలుసుకోండి...

మసాలా మహారాణి దాల్

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. 1/4 కేజీ
  • అల్లం. చిన్నముక్క
  • పచ్చికొబ్బరి. కాస్తంత
  • ఉల్లిపాయలు. 2
  • పచ్చిమిర్చి. 6
  • వెల్లుల్లి రెబ్బలు. 2
  • టొమోటోలు. 4
  • నూనె. 100 గ్రా.
  • పసుపు. చిటికెడు
  • నెయ్యి. 2 టీస్పూ.
  • జీలకర్ర. 1 టీస్పూ.
  • ఆవాలు. 1 టీస్పూ.
  • కరివేపాకు. 2 రెమ్మలు
  • నిమ్మకాయ. 1
  • కొత్తిమీర. 1 కట్ట
    Picture  Recipe

తయారీ విధానం

కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరిని కలిపి ముద్దగా నూరి ఉంచాలి.
బాణెలిలో నూనె పోసి కాగిన తరువాత, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, టొమోటో ముక్కలను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు విడిగా ఉడికించి ఉంచిన పప్పను ఇందులో వేసి కలపాలి.
కాసేపటి తరువాత మసాలా ముద్దను కూడా వేసి బాగా కలిపి, ఉప్పు సరిజూడాలి. విడిగా మరో బాణెలిలో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు చేసి ఉడుకున్న పప్పులో కలపాలి.
చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే మసాలా మహారాణి దాల్ రెడీ

రాజ్మా దాల్‌

కావలసిన పదార్థాలు

  • రాజ్మా. 1/2 కప్పు
  • మినప్పప్పు. 1/4 కప్పు
  • శెనగపప్పు. 1/4 కప్పు
  • టొమోటో గుజ్జు. 1/2 కప్పు
  • ఇంగువ. కొద్దిగా
  • కారం. 2 టీస్పూ.
  • జీలకర్ర. 2 టీస్పూ.
  • అల్లంముద్ద. 2 టీస్పూ.
  • నూనె. తగినంత
  • ఉప్పు. సరిపడా
  • జీలకర్ర పొడి. 2 టీస్పూ.
  • గరంమసాలా. 2 టీస్పూ.
  • మెంతిపొడి. కొద్దిగా
  • పాలు. 2 కప్పులు
  • మీగడ. 4 టీస్పూ.
  • వెన్న. 4 టీస్పూ.
  • కొత్తిమీర. కొద్దిగా

    Picture  Recipe

తయారీ విధానం

ముందుగా పప్పులన్నీ శుభ్రంగా కడగాలి. ప్రెషర్‌కుక్కర్లో ఇవన్నీ వేసి కారం, ఉప్పు, ఇంగువ, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి.
మరో బాణెలిలో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
తరవాత కారం, టొమాటో గుజ్జు, ఉప్పు, జీలకర్ర పొడి, గరంమసాలా, మెంతి పొడి, పాలు, మీగడ, వెన్న అన్నీ వేసి ఉడికించిన పప్పు కూడా వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి దించాలి.
చివరగా కొత్తిమీర అలంకరించి వడ్డిస్తే సరి.!

పంచరత్ని దాల్‌

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు. 1 కప్పు
  • పెసరపప్పు. 1 కప్పు
  • సెనగపప్పు. 1 కప్పు
  • ఎర్ర కందిపప్పు. 1 కప్పు
  • పొట్టుతీయని పెసరపప్పు. 1 కప్పు
  • పసుపు. 2 టీస్పూ
  • ఉల్లిపాయలు. 8
  • జీలకర్ర. 2 టీస్పూ
  • నెయ్యి. 8 టీస్పూ
  • కొత్తిమీర. కొద్దిగా
  • టొమాటో గుజ్జు. 1 కప్పు
  • జీలకర్ర పొడి. 2 టీస్పూ
  • గరంమసాలా. 2 టీస్పూ
  • ఎండుమిర్చి. 6
  • ఉప్పు. తగినంత
    Picture  Recipe

తయారీ విధానం

పప్పులన్నింటినీ శుభ్రంగా కడగాలి. వీటిని ఓ పాత్రలో వేసి ఉప్పు, పసుపు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
టొమాటో గుజ్జు, జీలకర్ర పొడి, గరంమసాలా అన్నీ కలిపి మరికాసేపు ఉడికించాలి.
విడిగా మరో బాణెలిలో నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసి, గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి.
తరవాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించి, పప్పులో కలిపి సన్నగా కోసిన కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. అంతే పంచరత్ని దాల్ స్పెషల్ రెఢీ!