all

Tuesday, December 4, 2012

ఇంతిలోని శక్తి ఇంతింత కాదయా..!

‘ఆడవాళ్లు అబలలు.. బాహ్య ప్రపంచం ఏమీ తెలియని అజ్ఞానులు’-అనుకునే రోజులు పోయ దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయ. అటు చదువుల్లోనూ, ఇటు ఉద్యోగాల్లోనూ కూడా మగవాళ్ళకంటే ఆడవాళ్లే ముందున్నారన్న విషయాన్ని, సంపాదనలో కూడా ఆడవాళ్లే ముందు వరసలో నిలబడ్డారని చార్టడ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన ఆర్థిక, గణాంక నిపుణులు ఓ సర్వేలో తేల్చి చెప్పారు. కొద్దికాలంలోనే ఈ పెరుగుదల మరింత అనూహ్యంగా ఉంటుందని కూడా చెప్పారు. భవిష్యత్‌లో- పురుషులు స్ర్తిలకన్నా ఎక్కువ సంపాదనాపరులనో లేక సరిసమానంగా సంపాదిస్తున్నారనో వింతగా చెప్పుకోవచ్చు. స్ర్తిలే ఎక్కువగా సంపాదిస్తున్నారన్న విషయం బాగా వ్యాప్తిలోకొస్తుంది. నిజంగా అలాగే జరిగితే- పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రభావం పెళ్లిళ్లమీదా పడుతుంది. పెళ్లిళ్ళ తంతులో పెనుమార్పులే రావొచ్చు!
అసలు మహిళల ప్రగతి ఎలా సాధ్యమైందని అని ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయ. సంవత్సరాల తరబడి మహిళా హక్కుల కోసం పోరాటాలు జరిగాయ. విద్యలో ఆడపిల్లలు మగపిల్లలతో పోటీపడడమే కాదు వారికన్నా ఎక్కువ శ్రద్ధతో చదివి, ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులవడం సాధ్యమైంది. మంచి ప్రవర్తనతోనూ, సామర్థ్యంతోనూ, నిజాయితీతోనూ, సరైన వ్యక్తిత్వంతో అమ్మాయలు రాణించగలుగుతున్నారు. ఇక మగపిల్లలు అనేకమంది దురలవాట్లకు లోనవుతున్నారు. ధూమపానం, తాగుడు, హుక్కా, డ్రగ్స్‌వంటి వ్యసనాల్లో పడడం, క్లబ్బుల్లో, పబ్బుల్లో పడి చదువుకునే వయస్సులో చదువునీ, ఉద్యోగం చేసే వయస్సులో ఉద్యోగాన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తూ జల్సాగా తిరగడానికి అలవాటుపడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంచి కుటుంబాల్లో నుంచి వచ్చే పిల్లలు కూడా పిచ్చి పిచ్చి టైటిల్స్‌లో వచ్చే సినిమాలు చూసి ఆ హీరోల్లా (వాళ్లు నిజ జీవితంలో బాగానే వుంటారు, డబ్బు కోసం ఓ వృత్తిగా అలా నటిస్తున్నారని అనుకోకుండా) వుండడానికి ప్రయత్నిస్తూ, పతనమైపోతున్నారు చాలామంది. మరికొందరు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయమని భావిస్తున్నారు. చదువైనా డబ్బు సంపాదనకేగా!- అనే వెర్రి ఆలోచనలతో అదేదో ముందే సంపాదనామార్గం ఎన్నుకుంటే పోలేదూ అని చదువుని నిర్లక్ష్యం చేసి పెడదారులు పడుతున్నారు.
ఆడపిల్లలు బాగా చదువుకుని, చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. పైగా కాలం తెచ్చే మార్పులవల్ల అంటే, మహిళలను ప్రోత్సహించే పథకాలూ, మహిళా సంఘాల ప్రవచనాలవల్ల, కాస్త ఎదిగిన ఆడపిల్లలు మగ పిల్లలంటే భయాన్ని పోగొట్టుకుంటున్నారు. నిర్భయంగా, బాలుర కాలేజీలోనూ ఎలాంటి న్యూనతాభావం లేకుండా ధైర్యంగా చదువుకోగలుగుతున్నారు.
సహజంగా బాలికలలో బాలురకంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మాభిమానమూ ఎక్కువే. పట్టుదల కూడా ఎక్కువే. ఏదైనా సాధించాలనుకుంటే లక్ష్యసిద్ధి కోసం పాటుపడతారు. అందుకే అన్నారు మన పూర్వీకులు- ‘‘ముదితల్ నేర్వగలేని విద్య కలదే, ముద్దార నేర్పింపగన్’’ అని. ఆ రోజుల్లో అనేక అభద్రతా కారణాల వల్ల, అర్థంలేని అనేక ఆచారాల వల్లా, మూఢ నమ్మకాల వల్లా పాటించలేకపోయారు. క్రమేణా అవి తగ్గి, ఆడపిల్లలకు అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి అని చాలామంది విద్యావేత్తలూ, మేధావులూ అభిప్రాయపడుతున్నారు.
ఇలా పరిస్థితులు అనుకూలించడంతో పెరిగిన మహిళల ఆదాయం కనీసం కొన్ని దశాబ్దాలు ఇలాగే సాగుతుందని, చార్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుడు మహేశ్ వాస్వానీ చెప్పారు. మగ పిల్లలు ఈ విషయాన్ని గ్రహించి శ్రద్ధ తీసుకోకపోతే వారి ప్రాముఖ్యం గణనీయంగా పడిపోతుంది కనుక, ఇప్పటినుంచే వారు నైపుణ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉంది. బాధ్యతగల పౌరులుగా వారు మెలగాలని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళల ఆలోచనా ధోరణి, ఆచరణలు చాలా మారిపోయాయి. వారిలో నైపుణ్యం కూడా బాగా పెరిగిపోతోంది. ఈ మార్పు ఇప్పటికే తెలుస్తూన్నా, రాను రాను ఇంకా ప్రస్ఫుటంగా తెలుస్తుందని చెబుతున్నారు పరిశీలకులు. ఈ రీతిలో పురుషులూ పుంజుకుంటే, భారతదేశం అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తుందని వారు అంటున్నారు. ‘‘మేరా భారత్ మహాన్... హై...!

ఫ్లోరైడ్ ఉన్న నీరు ప్రమాదమా!

మనం తాగే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. కలుషిత నీరు ఎంతో ప్రమాదకరం. అందునా ఫ్లోరైడ్, ఇతర లవణాలు అధికశాతంలో ఉన్న నీరు మరీ ప్రమాదకరం. ఇది నేరుగా మన శరీర వ్యవస్థనే దెబ్బతీస్తుంది.

నీటిలో ఫ్లోరైడ్ శాతం 1.5 మి.గ్రా. కంటే ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. మెడ వంగిపోవడం, కాళ్లు, చేతులు వంకరలు తిరగడం, ఎముకలు పెళుసుగా తయారై విరిగిపోవడం వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. దురదృష్టమేమంటే ఈ నీటిని చాలాకాలం నుంచీ తాగుతున్నప్పటికీ దాని ప్రభావం తొలిదశలో ఏమీ తెలియదు. కనీసం 12 సంవత్సరాల నుంచి బయటపడుతూ ఉంటుంది. పంటిమీద పచ్చగా గార ఏర్పడుతుంది. దీని ద్వారా ఫ్లోరైడ్ సోకిందని చెప్పవచ్చు

పావురం తెలివి!-kids story

ఒకరోజు పులి సింహంతో పోట్లాడి గెలవాలనుకుంది. అంతే! వెంటనే సింహం గుహ దగ్గరికి వెళ్లి ధైర్యంగా నిలబడి గట్టిగా అరిచింది. అది మధ్యాహ్నం కావడంతో సింహం బాగా తిని నిద్రపోతోంది. పులి గాండ్రింపులకు మేల్కొని కోపగించుకుంది. ‘‘ఎవరక్కడ?’’ అని అరిచింది. పులి మరింత గట్టిగా అరిచింది. దాంతో సింహం కోపంగా గుహలోంచి బయటికి వచ్చి పులివైపు తీక్షణంగా చూసింది.

‘‘ఎందుకలా అరుస్తున్నావు? నీకేం పనిలేదా? ఫో’’ అంది. పులి ఏమాత్రం భయపడలేదు. ‘‘ఈ ప్రాంతమంతా నాది. నన్ను వెళ్లమనడానికి నువ్వెరవు?’’ అని ప్రశ్నించింది. అదే సమయానికి ఒక పావురం వచ్చి ఏం జరిగిందని అడిగింది. అవి చెప్పింది విని ‘‘ఓస్ ఇంతేనా?’’ అంది పావురం.

వెంటనే వాటి మధ్య నిలిచి సింహాన్ని గుహలోకి వెళ్లమంది. దాని వెనకనే పావురం కూడా వెళ్లింది. లోపలికి వెళ్లిన తర్వాత సింహాన్ని తన చెవుల్లో దూది పెట్టుకోమంది. ‘‘అప్పుడు పులి ఎంత అరిచినా వినపడదు, హాయిగా నిద్ర పోవచ్చు’’నంది. సింహం సంతోషించి దూది పెట్టుకుంది. పావురం గుహలోంచి బయటికి వచ్చి పులి దగ్గరికి వెళ్లి, ‘‘ఇపుడు నీ ఇష్టం వచ్చినంత గట్టిగా అరుచుకో, సింహం నిన్నేమీ చేయలేదు’’ అంది.

పులి అలానే చేసింది. సింహానికి నిద్రాభంగం కలగలేదు. మర్నాడు సింహం బయటికి వచ్చి ఎదురుగా ఓ చెట్టుమీదికి వచ్చిన పావురానికి కృతజ్ఞతలు చెప్పింది. మధ్యాహ్నం పులి దగ్గరికి రివ్వున వెళ్లి, ‘‘నువ్వు సింహం గుహదగ్గరే అరవాలని లేదు. అదుగో ఆ గుట్టమీద ఎక్కి కూడా అరవచ్చు. అప్పుడు అడవంతా వినపడుతుంది. నీకు ఎదురులేదు’’అని బుజ్జగించింది. ‘‘ఆహా ఎంత మంచి మాట చెప్పావు మిత్రమా!’’ అని పులి ఆ గుట్టమీదకి ఎక్కింది. పావురం చక్కగా ఎగిరి వె ళ్లిపోయింది.
అందరం జీవితమనే వరదలో కొట్టుకుపోయేవారమే. కొందరు మాత్రమే ఆకాశంలోని తారకలను చూడగలరు.
- ఆస్కార్‌వైల్డ్

అందమె ఆనందం

గంధం చెక్కను కొద్దిగా నీళ్లు వేసి, రాయి మీద అరగదీసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. మొటిమలు, యాక్నే సమస్యలు తగ్గుముఖం పడతాయి.

గురువాక్యం శిరోధార్యం-నిత్య సందేశం

రామునివల్ల ఉత్తమగతి పొందిన కబంధుడు తాను పొందిన సాయానికి కృతజ్ఞత చూపిస్తూ ‘‘రామా! సుగ్రీవుని వద్దకు వెడితే నీకు ఉపకారం జరుగుతుంది. దారిలో మతంగ ముని ఆశ్రమం ఉంటుంది. అక్కడకు తప్పకుండా వెళ్ళు. అక్కడ నీకోసం శబరి ఎదురు చూస్తోంది, ఆమెకు నీ దర్శనభాగ్యాన్ని కలిగించు. ఆమె చేసే సేవలను అందుకుని ఆమెను తరింపజెయ్యి. నీకు మంచి జరుగుతుంది’’ అని చెప్పి అదృశ్యమైపోయాడు.

పంపా సరస్సు సమీపంలో ఉన్న మతంగ మహర్షికి శిష్యురాలు శబరి. గురువును సేవించడమే తన జీవితానికి ధన్యత్వంగా భావిస్తూ, సేవ చేసింది. కొంతకాలం తరువాత మతంగుడు యోగం ద్వారా తన భౌతిక శరీరాన్ని విడిచి, పుణ్యలోకాలకు వెళ్ళాలనుకొన్నాడు. తనను కూడా తీసుకుపొమ్మంది శబరి. ‘‘నువ్వు ఇంకా కొంతకాలం ఈలోకంలోనే ఉండాలి. దైవసేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండు. శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఒకనాడు ఇక్కడికి వస్తారు. ఆయనను సేవించు. ఆ పుణ్యం వల్ల నీకు మోక్షం లభిస్తుంది’’ అని చెప్పి, గురువు సిద్ధిని పొందాడు. రాముడు ఎవరో తనకు తెలీదు. ఎందుకు వస్తాడో తెలీదు. తనకు ఏ సంబంధమూ లేని వ్యక్తికోసం తాను ఎందుకు ఎదురు చూడాలని అడగలేదు. గురువు వాక్యం శిరోధార్యం అనుకుని, అలాగే ఎదురుచూస్తోంది.

క్రమక్రమంగా వయసు మీదపడుతోంది. శరీరానికి పటుత్వం తప్పుతోంది. వార్ధక్యం బాధిస్తోంది. జరాదుఃఖాన్ని భరిస్తోంది. తలచుకుంటే గురుసేవ వలన తనకు లభించిన యోగవిద్య ద్వారా శరీరాన్ని విడిచిపెట్టగలదు శబరి. కాని గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పోనీ ఇంతకాలానికి వస్తాడని ఒక స్పష్టమైన సమయాన్నైనా గురువుగారు చెప్పలేదు. చెప్పమని శబరి అడుగనూ లేదు. గురువు చెప్పింది వినడమే తప్ప, ఎదురుప్రశ్నలు వేసే అలవాటు, తిరస్కరించే నైజం లేదు. అందుకని రాముని రాకకోసం ఎదురు చూస్తోంది.

శబరి చూపులు ఫలించాయి. రాముడు రానే వచ్చాడు. అవధి లేని ఆనందంతో గబగబ ఎదురేగింది. సాదరంగా ఆహ్వానించింది. పాద్యం, అర్ఘ్యం ఇచ్చింది. కూర్చోవడానికి ఆసనాన్ని సిద్ధం చేసింది. ఆ అడవిలో దొరికే మధురమైన ఆహారాన్ని తెచ్చి ఇచ్చింది. ఆయన రాక వల్ల తనకు విముక్తి కలిగిందని కాకుండా గురువాజ్ఞను పాటించేందుకు ఇన్నాళ్ళకు అవకాశం దొరికిందని ఆనందపడి, కుశలప్రశ్నలు వేసింది. ఆమె చేసిన సపర్యలన్నీ ఆనందంగా స్వీకరించాడు రాముడు. ఆ తరువాత సోదరులు ఇద్దరూ చూస్తుండగానే ఆమె మోక్షాన్ని పొందింది.

రాముడు తన గురువులైన వశిష్ఠ విశ్వామిత్రులను ఏనాడూ తిరస్కరించలేదు. అందువల్లే మరొక గురుభక్తురాలికి మోక్షాన్ని అనుగ్రహించగలిగాడు. ఆయుర్వేదశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన ఇందీవరాక్షుడు, అవసరం తీరగానే తన గురువైన బ్రహ్మమిత్రుని దూషించాడు. ఫలితంగా విద్య నిరుపయోగమైపోవడమే కాకుండా బ్రహ్మరాక్షస జన్మను పొందాడు. అందువల్ల గురువాక్యం శిరోధార్యం. గురుద్రోహం, గురుతిరస్కరణం, గురుద్రవ్యాపహరణం మహాపాతకం.

- డా. కడిమిళ్ళ వరప్రసాద్

బిగ్ బాసెస్..!---అలా పెంచాం *;*






పిల్లల బుర్రల్లో యక్ష ప్రశ్నలుంటాయి... పెద్దలకు లక్ష పనులుంటాయి. ప్రతి ప్రశ్నకూ జవాబు దొరకదు...ప్రతి జవాబూ సంతృప్తినివ్వదు. పైగా శ్రవణ్, సంజయ్ వండర్ కిడ్స్! ఏమిటి? ఎందుకు? ఎలా? అని కొరుక్కుతినేస్తున్నారు! వాట్ టు డూ? దేవుడా!.. ఆలోచించారు తల్లిదండ్రులు. తాము కూడా ఓ మూడు ‘ఎ’లను ప్రయోగించారు. ఎఫెక్షన్... యాక్సెప్టెన్స్... అచీవ్‌మెంట్! పథకం ఫలించింది! ప్రశ్నల్లోంచి ప్రయోగాల్లోకి వచ్చారు పిల్లలు. ప్రయోగాల్లోంచి ప్రోగ్రామింగ్‌లోకి వచ్చారు. ఇప్పుడీ చిన్నారులిద్దరూ ‘గోడెమైన్షన్స్’ అనే కంపెనీకి బాస్‌లు! ఎలా సాధ్యం? ‘‘పిల్లల్ని వేలు పెట్టనివ్వండి. వేలెత్తి మాత్రం చూపకండి. అప్పుడు ఏదైనా సాధ్యమే’’ అంటున్న కుమరన్ కపుల్ పెంపకంలోని మెళకువలే ఈ వారం మన ‘ అలా పెంచాం’.

‘ఎఫెక్షన్... యాక్సెప్టెన్స్... అచీవ్‌మెంట్... ఈ మూడు పదాలు ఆంగ్లభాషలో ‘ఏ’తో మొదలవుతాయి. ఈ మూడు ‘ఏ’లను మేము మా పెంపకంలో పాటించాం. మా పిల్లల అభివృద్ధికి కారణం ప్రేమ.. అంగీకారం... సాఫల్యం’ అన్నారు శ్రవణ్, సంజయ్‌ల తల్లిదండ్రులు కుమరన్, జ్యోతిలక్ష్మిలు.

‘పిల్లలను ప్రేమించాలి. వారి ఇష్టాయిష్టాలను స్వీకరించాలి. అప్పుడే వారు ఏ విజయాన్నైనా సాధించగలరు’ అంటారు వాళ్లు. ఈ భార్యాభర్తలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వీరు సమీప బంధువులు.

‘‘బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా మాకు పరిచయమై 1998లో వివాహం చేసుకున్నాం. మంచి అవకాశం రావడంతో కాపురాన్ని యూఎస్‌కు షిఫ్ట్ చేశాం. అక్కడ పిల్లలు ఎదుగుతున్న సమయంలో వారిపై పాశ్చాత్య ప్రభావం ఉండకూడదని 2004 డిశంబరులో శాశ్వతంగా ఇండియాకు వచ్చేశాం. నాది బెంగళూరైనా, మా వారిది చెన్నై కావడంతో చెన్నైలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నాం’’ అన్నారు జ్యోతి లక్ష్మి.

డబ్బు కాదు... పిల్లలే ముఖ్యం
‘‘పెద్దబాబును రెండవ తరగతి, చిన్నబాబును యూకేజీలో చేర్పించాక నేను చెన్నైలోని ఒక ప్రముఖ అమెరికన్ కంపెనీలో డెరైక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. తను మాత్రం పెద్దజీతం కోసం పిల్లల జీవితాన్ని తాకట్టుపెట్టకూడదన్న ఉద్దేశ్యంతో ఉద్యోగం జోలికి వెళ్లలేదు’’ అన్నారు కుమరన్. ‘‘బిడ్డల పెంపకంలో మేమిద్దరం ఎవరిపాత్ర వారిదిగా వ్యవహరించాం. పిల్లలు డ్రీమ్స్‌ను సెట్ చేసుకోలేరు, అందుకే అన్ని విషయాల్లోనూ ఎంకరేజ్ చేసేదానిని’’ అని చెప్పారు జ్యోతి ‘‘చిన్నప్పుడే ఐన్‌స్టీన్ వంటి ప్రముఖ సైంటిస్టులు, వారి గొప్పదనం, వారు కనుగొన్నవాటి గురించి ఎక్కువగా చెప్పేదానిని. విమానాన్ని రైట్ బ్రదర్స్ మొదటగా కనుగొన్నారు, మీరు కూడా మన దేశానికి ఏదైనా తయారు చేసి ఇవ్వాలని చెప్పాను. భారతదేశంలో ఒక గొప్ప కంపెనీ మీ ఇద్దరి నుండి రావాలని బోధించాను’’ అన్నారామె.

ప్రశ్నించడమే జ్ఞానం...
‘‘నేను హోమ్‌సైన్స్‌లో చైల్డ్‌సైకాలజీ చదివాను, ఇది నా పిల్లల పెంపకంలో ఎంతో పనికివచ్చింది’’ అని జ్యోతిలక్ష్మి ఆనందపడ్డారు. ‘‘అది ముట్టుకోవద్దు, ఇది చెడిపోతుంది... అంటూ పిల్లలకు పెద్దలు ఆంక్షలు విధించడం తప్పు. ఉదాహరణకు.. టీ కప్పు కిందపడితే పగిలిపోతుందని పిల్లలకు తెలియాలంటే వారిచేతికి ఇచ్చితీరాలి. లేకపోతే అలానే డార్క్‌లో మిగిలిపోతారు’’ అన్నారామె. ‘‘ఇంటిలోని కంప్యూటర్‌లో ఆఫీసు పనిచేసుకుంటున్నపుడు మూడు నాలుగేళ్ల వయసులోనే ఇద్దరూ వెనుక నిలబడి గమనించేవారు.

ప్రతి చిన్నవిషయాన్నీ ప్రశ్నించేవారు, ఇద్దరం ఓపిగ్గా బదులిచ్చేవాళ్లం’’ అని సురేంద్రన్ అన్నారు. ‘‘కంప్యూటర్ వారిలోని ఆసక్తికి బీజం వేసింది. క్రమేణా వారే సొంతగా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను నేర్పించడం ప్రారంభించాం. అవసరమైన పుస్తకాలను ఇచ్చాం. చాలా వేగంగా వాటిల్లోని అంశాలను అందిపుచ్చుకోవడం ప్రారంభించారు. మొదట మొబైల్ ఫోన్ ప్రోగ్రామింగ్ చేస్తామన్నారు. అది నాకు తెలియకపోవడంతో అందుకు సంబంధించిన పుస్తకాలను తెచ్చిచ్చాను’’ అని సురేంద్రన్ తెలిపారు.

సంస్థ స్థాపన..
‘‘హైస్కూలు విద్యార్థులుగా కేవలం ఏడేళ్ల సాధనతో గో డైమన్షన్స్ అనే కంపెనీని రిజిష్టర్ చేయించారు. మొబైల్‌ఫోన్స్‌లో గేమ్స్, లెర్నింగ్ అప్లికేషన్స్, లైఫ్‌స్టైల్ అప్లికేషన్స్ తయారుచేశారు. ఐపాడ్, ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్‌లలో అప్లికేషన్‌ను డెవలప్‌చేసే సాఫ్ట్‌వేర్‌ను వీళ్లు కనుక్కొన్నారు. జావా, సీ లాంగ్వేజ్‌ల ద్వారా ఈ ప్రోగ్రామ్‌ను డెవలప్ చేశారు. ఇటువంటి సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో పూర్తిగా కొత్త. క్యాచ్‌మీ కాప్, కలర్ పల్లెట్, ఆల్ఫాబీట్ బోర్డ్, ప్రేయర్ ప్లానెట్ అనే నాలుగు మొబైల్ అప్లికేషన్స్‌ను పిల్లలు కనుగొన్నారు. ఈ నాలుగు అప్లికేషన్స్ 43 దేశాల్లో ప్రఖ్యాతి పొందాయి, 18 వేల డౌన్‌లోడ్లు అయ్యాయి. డౌన్‌లోడ్ ఉచితంగా పెట్టినా ప్రకటనల ద్వారా ఆపిల్ కంపెనీ నుండి కేవలం ఆరునెలల్లో 200 యూఎస్ డాలర్లను పిల్లలు ఆర్జించారు’’ అన్నారు ఇద్దరూ.

ప్రేమ - భక్తి
‘‘భగవంతుని పట్ల భక్తిభావనను పిల్లల్లో పెంచడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. అందుకే పిల్లలు తమ కంపెనీకి గో డైమన్షన్స్ అనే పేరుపెట్టుకున్నారు. కంపెనీ తొలి మూడు ఇంగ్లీషు అక్షరాలు కలిపి చదివితే గాడ్ అని వస్తుంది. అలాగే డైమన్షన్స్ అంటే ఒకేదానికి కట్టుబడకుండా భిన్నకోణాల్లో ఎదగాలనే భావనను సంస్థ పేరు ద్వారా మా పిల్లలు వెలిబుచ్చారు. ఒకసారి మేం నలుగురం చెన్నై నుండి యూఎస్‌కు బయలుదేరాం. విమానం గాలిలో తీవ్రంగా కుదుపులకు లోనైంది. నాకు భయమేసింది. నా బ్యాగులో భద్రపరుచుకునే దేవుని విగ్రహం కోసం పాకులాడాను. ఎంతో వెతికిన తరువాత విగ్రహం దొరికింది. దానిని ఒళ్లో పెట్టుకుని ప్రార్థించాను. మా పిల్లలు ఇదంతా గమనించారు.

విమానం యూఎస్‌లో ల్యాండయ్యేలోగా ప్రేయర్ ప్లానెట్ అనే మొబైల్ అప్లికేషన్‌ను కనుగొన్నారు. మొబైల్ ద్వారా సులభరీతిలో అన్నిమతాల దేవుళ్ల బొమ్మలను చూస్తూ నామస్మరణను వినేలా అప్లికేషన్‌ను అప్పటికప్పుడే రూపొందించారు. ఈ ప్రేయర్ ప్లానెట్ ఎంతో ప్రఖ్యాతిని పొందింది. అలాగని వారు పుస్తకాల పురుగులు కారు. సంగీతం, గానం, నాట్యం, రచన, క్రీడలు అన్నింటిలో మెచ్చదగిన ప్రవేశం ఉంది.

మొబైల్‌లో రూట్‌మ్యాప్, వాతావరణ కాలుష్యశాతాన్ని తెలుసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేయాలని, అంధులు మనిషి తోడు లేకుండా సెల్‌ఫోన్ సహాయంతో నడిచే సాఫ్ట్‌వేర్‌ను క నిపెట్టాలని మా పిల్లలు భావిస్తున్నారు. పిల్లలు స్నేహితుల్లా మెలగాలని చెప్పడం ఇద్దరి మధ్య అనుబంధాన్ని శాశ్వతం చేస్తుంది. అందుకే మా పిల్లలు ప్రతి విషయాన్నీ మాతో షేర్ చేసుకుంటారు. ఉన్నత చదువులున్న తల్లిదండ్రులే పిల్లలను తీర్చిదిద్దగలరని చెప్పలేం. పిల్లల ఆసక్తిని గుర్తించడం, తగిన విధంగా ప్రోత్సహించడంలోనే ఉంటుంది పెంపకంలోని మెళకువ. లెట్ దెమ్ డ్రీమ్ బిగ్ ’’ అంటూ ముగించారు ఆ తల్లిదండ్రులు.
- కొట్రా నందగోపాల్, బ్యూరో చీఫ్, చెన్నై
ఫొటోలు: వన్నె శ్రీనివాసులు


టీ కప్పు కిందపడితే పగిలిపోతుందని పిల్లలకు తెలియాలంటే కప్పును వారిచేతికి ఇచ్చితీరాలి. లేకుంటే అలానే డార్క్‌లో మిగిలిపోతారు అంటారు కుమరన్ కపుల్. ఈ ప్రోత్సాహమే శ్రవణ్ (13), సంజయ్ (11) లు గోడెమైన్షన్స్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించి, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించేలా చేసింది. ప్రస్తుతం తమ కంపెనీకి ఒకరు చైర్మన్‌గా, మరొకరు సిఈవోగా ఉన్న ఈ వండర్ కిడ్స్‌తో తల్లిదండ్రులు జ్యోతిలక్ష్మి, సురేంద్రకుమరన్

బ్యాచిలర్ బాబులు.. మీ రూమ్‌లో ఇవున్నాయా..?

సాధారణంగా కాలేజీ చదువులు ముగయగానే ఉద్యోగాలంటూ... సొంత మనుషులను, కొన్ని సంబంధ భాంద్యవ్యాలను సొంత ఊరును వదులు కొన్ని ఇతర ప్రదేశాలకు వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలుపెడుతారు. యూత్ బ్యాచిలర్ జీవితాన్ని గడుతారు. అక్కడ ఒక ప్రత్యేకమైన వాతవరణం. ఒంటరితనంతో జీవించాల్సి ఉంటుంది. అయితే బ్యాచిలర్ లైఫ్ ను కూడా బ్యూటిఫుల్ లైఫ్ గా మలచుకోన్నప్పు వారి జీవితం మరింత సుఖంగా మార్చుకోగలుగుతారు.
ఒంటరిగా నివశించే వాతావరణంతో పాటు వారికి కావాల్సిన సదుపాయాలను కూడా పర్ఫెక్ట్ గా అమర్చుకోగలిగినప్పుడు వారి జీవితం హాయిగా ఉంటుంది. అందుకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. కానీ కొన్ని వస్తువును మాత్రం మీ బ్యాచిలర్ జీవితాని తప్పకుండా ఉండాల్సినవి, ఉపయోగపడే వాటిని తప్పకుండా అమర్చుకోగలగాలి. మరి అవేంటో చూద్దాం..


కాఫీ మేకర్


మీకు కాఫీ అంటే చాలా ఇష్టం కాద. కాబట్టి కాఫీ మేకర్ మీ కొనుగోలు లిస్ట్ లో మొదటిది, తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోండి.ఒక మంచి కాఫీ మేకర్ ను కొనడం వల్ల మీ బ్యాచిలర్ హోంలో ఒక అలంకరణగానే కాదు మీ అవసరాన్ని తీర్చిదికగా కూడా ఉంటుంది. మీ రూమ్ కు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా చిటికెలో కాఫీ కలిపి ఉవ్వొచ్చు. మీరు అలసిన రూమ్ కి రాగానే మీకు చక్కటి కాఫీ తయారు చేసే మిషన్ మీ చెంత ఉంటే ఒక మనిషి మీతో ఉన్నట్టే అని భావించాలి.
 

ఫ్లాట్ స్ర్కీన్ టెలివిజన్


బ్యాచిలర్ రూమ్ లో మరొకటి తప్పనిసరిగా ఉండేది. మీకు ఎంటర్ టైన్మెంట్ అందించేది టెలివిజన్. వీడియోగేమ్స్.
మీకు మీ ఫ్రెండ్ లా ట్రీట్ చేసిది వీడియో గేమ్స్. ఇక ఫ్లాట్ స్ర్కీన్ టెలివిజన్ రాత్రి సమయంలో కొంచెం ఎంటర్ టైన్మె అందించే క్రికెట్, ఫుట్ బాల్ వంటి స్పోర్ట్స్ ను చూసి ఎంజాయ్ చేయడానికి. కాబట్టి టెలివిజన్ రెండవదిగా మీ లిస్ట్ లో చేర్చుకోండి.


మినీ ఫర్నీచర్


బ్యాచిలర్ లైఫ్ అయినా మినీ ఫర్నీచర్ ను మెయింటైన్ చేయడం మంచిది. వాటి ఉపయోగం చాలానే ఉంటుంది.
అందులో మీకేవైతే ఉపయోగపడుతాయో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తెచ్చుకోవడం మంచిది. చిన్న టేబుల్, ఫోల్డిండ్ కుర్చీలు, ఐరన్ టేబుల్, టేబుల్ ల్యాప్, ఫ్యాన్ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.


బీన్ బ్యాగ్స్


ఇవి కుర్చోవడానికి సుతిమెత్తగా సౌకర్యవంతంగా ఉంటాయి. బీన్ బ్యాగ్స్ ఇంట్లో ఉండటం వల్ల ఒక కొత్త లుక్ వస్తుంది.ఇది ఆకర్షణ మాత్రమే కాదు సౌకర్యవంతం కూడా. అంతే కాకుండా వీటిని మీరు మీ ఇంట్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ సౌకర్యవంతంగా అమర్చుకోవచ్చు.
 

మినీ బార్


వారాంతంలో లేదా బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకొన్నప్పుడు మీకంటూ ఓ మినీ బార్ ను మెయింటైన్ చేయడం ఆహ్లాదపరుస్తుంది. మీకు ఆ సౌకర్యం లేకపోయినా మీరంతకు మీరు అమర్చుకోవచ్చు. అందు కోసం ఒక సర్వింగ్ కార్ట్ తెచ్చుకిన లివింగ్ రూమ్ లో అమర్చుకోవచ్చు. ఒక్కసారిగా కార్ట్ అమర్చిన తర్వాత అందులో మార్టిన్ షేకర్, కొన్ని మార్టిన్ గ్లాసెస్ మరియు కొన్ని చిన్న గ్లాసులు ఇలా అన్ని అమర్చుకొన్న తర్వాత మీకు కావలసిన మీ ఫేవరెట్స్ తో నింపేసుకోండి. మీకు తాగే అలవాటు లేకున్నా ఈ అరేంజ్ చేయడం వల్ల మీ కోసం వచ్చే అతిథులకు ఓ గొప్ప ఆతిథ్యం ఇస్తున్న ఫీలింగ్ వారిలో కలుగచేస్తుంది.
 

సంవత్సరం పొడవునా పూచే నందివర్ధనం...

నందివర్ధనం పూలను ఎక్కువగా దేవుని పూజకు వాడతారు. చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. ఇందులో ఐదు రెక్కల నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి. రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి వర్షాకాలం, ఎండకాలం ఎక్కువ పూస్తాయి. శీతాకాలంలో తక్కువగా పూస్తాయి. కొత్త ఆవిష్కరణల్లో భాగంగా పువ్వు రంగులో మార్పు రాలేదు కానీ ఆకులు మాత్రం ఆకుపచ్చ, తెలుపురంగులు మిళితమై వస్తున్నాయి. ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. తాజా ఆవిష్కరణల్లో వీటిని కుండీల్లో పెంచడానికి వీలుగా ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే పెరిగేటట్లు చేస్తున్నారు. నందివర్ధనం పూలు సీజన్ లో లెక్కలేనన్ని పూస్తాయి. ఎక్కువ రోజలు పూస్తాయి. పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటుంది.

How Grow Nandivardhanam At Home Garden
నూనె రాసినట్లుగా నిగనిగలాడే ఆకుల మధ్యనుంచి అయిదు రేకులతో నక్షత్రాల్లా విప్పారిన గరుడవర్ధనం పూవును చూస్తున్నా, ప్రసన్నతకు మరో పేరులా ధవళవర్ణంలో ముద్దగా మెరిసే నందివర్ధనాలను చూస్తున్నా మనసు పవిత్ర భావనతో, ప్రశాంతతో నిండిపోతుంది. నలుపుతెలుపుల సమ్మేళనమే, సమన్వయమే జీవితమనే గొప్ప సత్యాన్ని నందివర్ధనాలు మనకు చెబుతున్నట్లుంటుంది. అనాదిగా ఇంటి తోటలో పెంచుకునే ఈ మొక్కల శాస్ర్తియ నామం ఒకటే- టాబర్‌నేమాంటోనియా కొరొనేరియా! వీటిని కేప్ జాస్మిన్ అని కూడా అంటారు.
ఏడాది పొడవునా పూసే ఈ మొక్కలు ఒక మీటరునుంచి నాలుగుమీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. ఈమధ్యకాలంలో బాల్కనీల్లో సైతం పెంచుకునేలా, కుండీలో పెంచుకోడానికి అనువుగా అర మీటరు లోపునే ఉండి 365 రోజులూ పూసే నందివర్ధనం రకాన్ని సైతం ఉత్పత్తిచేసారు. మామూల మొక్కలనైనా మరీ ఎత్తుగా పెరగకుండా అవసరమైన మేరకు ప్రూన్ చేయవచ్చు. ఈ మొక్కలను పశువులు, జంతువులు ముట్టుకోకపోవటం గొప్ప విశేషం. కొమ్మలను నాటడం ద్వారా వీటిని ప్రవర్ధనం చేస్తారు.
నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతిని, మగతను, విష ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువులు పేర్కొన్నాయి. గృహ చికిత్సలు...
అప్పుడప్పుడు నందివర్ధనం చెట్టుకు ఆకులుకు తెగులు పట్టి ముడతలు పడుతుంటాయి. వర్షాకాలం మొదట్లో ఈ తెగులు మొదలవుతుంది. పురుగు ఆకులోని రసం పీల్చేస్తుంది. ఈ పురుగులను బొచ్చు పురుగులు అంటాం. బొచ్చు పురుగుకి రక్షణ కవచం. మనం పైన స్ప్రే చేసిన మందులు పురుగును చేరకుండా బొచ్చు అడ్డుకుంటుంది. పురుగు లేత దశలో అంటే రక్షణ కవచం ఏర్పడక ముందే జాగ్రత్త పడాలి. అప్పుడైతే ఏ సాధారణమైన పురుగుమందు చల్లినా పురుగు చనిపోతుంది. ఈ పురుగు పోవడానికి చల్లే మందులను నందివర్థనం మొక్క ఆకుల మీ దచల్లకూడదు, చెట్టు మొదట్లోచల్లాలి.

ఆరోగ్యానికి హాని కలిగించే బిగువైన జీన్స్!

పిరుదులు ఒత్తేస్తూ, తొడలు పిసికేస్తూ బిగువుగా, గట్టిగా వుండే జీన్స్ పేంట్లు ఆరోగ్యానికి మంచివి కావని అవి మీ నరాలను తోడేస్తాయని డాక్టర్లు చెపుతున్నారు. మెరాల్జియా పరేస్తటికా అనే స్ధితికి చిహ్నంగా చురుక్కు మనటం, తిమ్మిరెక్కటం వంటి లక్షణాలు కనపడతాయి. తొడకు ముందుభాగంలో వుండే ఒక నరం బాగా ఒత్తబడితే ఈ పరిస్ధితి ఏర్పడుతుంది. ఈ జీన్స్ గుడ్డలు, అంత త్వరగా ఫ్యాషన్ ప్రపంచంనుండి తొలగే లాగ లేవని యువత వాటిని బాగా ఆదరిస్తోందని, జీన్స్ దుస్తుల వ్యాపారం జోరని తయారీదారులు చెపుతున్నారు.
Tight Jeans May Jeopardize Health


అవి ఫ్యాషన్ ప్రపంచంలో వున్నంతకాలం తమ విక్రయాలు బాగానే వుంటాయని, అందుకనే వారు వాటిని అమ్ముతున్నట్లు విక్రయదారులు తెలిపినట్లు న్యూ యార్క్ డైలీ పేర్కొంది. నేటి యువతరంలో ఎన్నో చెడు అలవాట్లు చోటు చేసుకుంటున్నాయి వాటిలో ఆరోగ్యానికి హానికలిగించే జీన్స్ కూడా ఒకటి అంటున్నారు ధరించేవారు. హై హీల్స్ లేదా సిగరెట్ తాగటం చెడు అలవాట్లే. ఆరోగ్యానికి హాని కలిగించేవే, అదే రకంగా ఇపుడు వేసే జీన్స్ కూడాను అని సరిపెట్టేసుకుంటున్నారు.

అయితే, చర్మానికి అంటుకుపోయే జీన్స్ అయినప్పటికి అవి నరాలకు నష్టం కలిగించే వ్యాధులు కలిగించటం లేదని, బ్రూక్లీన్ లోని మెయిమోనైడ్స్ మెడికల్ సెంటర్ వాస్కులర్ సర్జరీ ఛీఫ్ డా. , డా. రాబర్ట్ రీ తెలిపారు. అయితే, ఏదో ఒక దశలో వారి కాళ్ళు ఇక లేవని తెలిశాక అపుడు అకస్మాత్తుగా తమ కామన్ సెన్స్ ఉపయోగించుతారని, కొద్దిపాటి పెద్ద సైజులకు మారటం మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికి ఫ్యాషన్ కావాలనుకునేవారు వేరే దుస్తులను ఉపయోగించకపోయినప్పటికి సమస్యలు వచ్చే వరకు వీటిలోనే తమ రిలాక్సేషన్ పొందవచ్చన్నారు.

నేడు తాజాగా న్యూయార్క్ నగరం అంతా టైట్ జీన్స్ తో నిండిపోయింది. వారికి వేరే మార్గం సైతం కనపడకుండా వుంది. అంటూ ఒక సర్జన్ వ్యాఖ్యానించారు. ధరించే వారికి తిమ్మిర్లు ఎక్కటం, కాళ్ళు, పాదాల సమస్యలు లేకుంటే, ఈ ప్యాంట్లు నిరభ్యరంతరంగా వేసుకోవచ్చు. స్కిన్నీ జీన్స్ స్ధానంలో యాసిడ్ వాష్ అతి త్వరలో అధికంగా ఆక్రమిస్తోంది. జీన్స్ తో పోలిస్తే యాసిడ్ వాష్ మరింత సౌకర్యంట.

తాజా పరిశోధనలో పురుషులలో జీన్స్ పట్ల ఆసక్తి తగ్గినప్పటికి మహిళలలో జీన్స్ ధరించాలనే కోరిక బాగా కొనసాగుతోందట. పురుషులు వీటికి కొద్దిపాటి విశ్రాంతినిచ్చారని, కాని వాస్తవానికి ఈ స్కిన్నీ జీన్స్ అంత సౌకర్యం మరొకటి ప్రస్తుత దుస్తులలో లేదని ఆమె తెలిపారు. అయితే, అవి బిగువు అనే కారణంగానైనా కొంతమంది వాటిని పక్కన పెట్టటం మంచిదే అంటున్నారు ఆమె.

Monday, December 3, 2012

వేస్ట్ పేపర్ అని పారేయకండి..ఇలా వాడుకోండి

మనం అందరూ పర్యావరణ పరిరక్షణ గురించి వినే ఉంటాం. చెట్లను ఎలా సేవ్ చేయాలనేది.. వాటి వల్ల వాతారణానికి, ఎంత ప్రయోజనం అనేది కూడా అందిరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని, పాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించడానికి ఎన్నో పద్దతులను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఇంకా పేపర్ వాడకాన్ని కూడా తగ్గించాయి. పేపర్ వాడకం తగ్గిన తర్వాతే టాబ్లెట్స మరియు మొబైల్ ఫోన్ల రూపంలో ఇలా పేపర్ ను సేవ్ చేయగలుగుతున్నారు. కానీ ప్రింట్ మీడియా మాత్రం పేపర్ ను ఉపయోగిస్తోంది. వార్తాపత్రిక, వార్షిక నివేధిక లేదా మ్యాగజైన్ రూపంలో ప్రతి రోజూ ఉపగిస్తున్నాం. వాటిని చదివిన తర్వాత కుప్పలుతెప్పలుగా ఇంటి నిండా కొద్దిరోజులు పెట్టుకొని తర్వాత అమ్మే వారికి ఇచ్చేస్తుంటాం. లేదా వాటి కాల్చేస్తుంటాం. అయితే వాటిని ఇంటి సౌకర్యార్తం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించండి. వేస్ట్ న్యూస్ పేపర్స్ ఏవిధంగా ఉపయోగించుకోవాలో మీకోసం కొన్ని చిట్కాలు...
smart uses waste paper

1. క్లీనింగ్ గ్లాస్: వేస్ట్ న్యూస్ పేపర్ ను క్లీనింగ్ కోసం కామన్ గా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా గ్లాస్ వస్తువులు, గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్, గ్లాస్ మిర్రర్స్, టీవీ గ్లాస్ ఇలా వివిధ రాకాలైన వస్తువులను శుభ్రపరచడానికి వేస్ట్ న్యూస్ పేపర్ ను ఉపయోగించవచ్చు. న్యూస్ పేపర్ ను నీటిలో నానబెట్టి తర్వాత మరకబడిన గ్లాస్ వస్తువులను తుడవడం వల్ల శుభ్రపడుతాయి. తడి న్యూస్ వేస్ట్ న్యూస్ పేపర్ తో తుడిచిన తర్వాత పొడి న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల మార్పు మీకే తెలుస్తుంది. గ్లాస్ వస్తువులు మిళమిళ మెరుస్తుంటాయి.
2. ర్యాక్ కవర్స్/షెల్ఫ్ కవర్స్: ఇంట్లో కానీ, ఆఫీసులోకానీ రాక్స్, షెల్ఫ్స్ లో వస్తువలు, లేదా బుక్స్ సర్ధే ముందు ఈ వేస్ట్ న్యూస్ పేపర్ ను ఉపయోగించడం వల్ల ర్యాక్స్ డ్యామేజ్ కాకుండా మరకలు, గీతలు పడకుండా ఉంటాయి. అంతే కాకుండా చూడటానికి చాలా క్లీన్ గా ఉంటుంది. కాబట్టి బుక్ ర్యాక్స్, షూర్యాక్స్, వార్డ్ రోబ్, క్యాబినేట్ ర్యాక్స్, కిచెన్ ర్యాక్స్ లో వస్తువులను సర్ధడానికి ముందు న్యూస్ పేపర్ ను బేస్ గా ఉపయోగించాలి.
3. త్వరగా తడి ఆరడానికి: త్వరగా ఆఫీసుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో షూ నీటిలో తడిస్తే? ఆ తడిని వేస్ట్ న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల త్వరగా పీల్చుకుంటుంది. అంతే కాదు వుడెన్ డెస్క్ మీద కాఫీ లేదా టీ పొరబాటును వలకబోతే న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల అతి త్వరగా పీల్చుకుంటుంది. ఎమర్జెన్నీ టైమ్ లో షూను, టేబుల్స్ ను మరియు వస్తువును ఇలా తడి ఆర్పుకోవచ్చు.
4. ఇంటి డెకరేషన్: వేస్ట్ న్యూస్ పేపర్ ను పడేయడం లేదా అమ్మేయడానికి బదులు, కొంచెం సృజనాత్మకతను జోడించి ఇంటిని డెకరేట్ చేసుకోండి. న్యూస్ పేపర్ తో ఇంటిని డెకరేట్ చేయడానికి చాలా పద్దతులు ఉన్నాయి. ఇలా న్యూస్ పేపర్ ఉపయోగించడం వల్ల ఖర్చు తక్కు మరియు ఎకో ఫ్రెండ్లీ ఐడియా కూడానూ...ఉదాహరణకు ఫ్లవర్స్ లా తయారు చేసి వాటికి రంగులు అద్దండి. ఇంకా ల్యాంపులను తయారు చేసి అక్కడక్కడా హ్యాంగ్ చేయండి. చూడటానికి అందంగా ఆకర్షనీయంగా ఉంటుంది.
5. బొమ్మలు తయారీ: పిల్లలు ఎప్పుడు కొత్త బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి వారికి కొత్త కొత్త బొమ్మలు.. ఏరోప్లేన్, బోట్, అనిమల్స్, మరయు బర్డ్స్? వంటివి తయారు చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల వారు సంతోషంగా ఆడుకొంటారు. అంతే కాదు ఇటువంటి వాటితో పిల్లల రూమ్ ను కూడా డెకొరేట్ చేయొచ్చు.
6. ఎక్సట్రా మేకప్ తొలగించడానికి: ఒక్కో సందర్భంలో మేకప్ ఎక్కువవుతుంటుంది. లిప్ స్టిక్, లేదా పౌడర్ వంటివి ఎక్కవుఅవుతుంటాయి. అటువంటి సమయంలో వేస్ట్ న్యూస్ పేపర్ ను లిప్స్ మీద అద్దడం వల్ల ఆ ఎక్సట్రా లిప్ స్టిక్ ను తొలగించి లైట్ గా కనబడేలా చేస్తుంది.
7. వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంచడానికి: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను న్యూస్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో లేదా అలాగే ఆరబయట పెట్టడం వల్ల ఎక్కువ సమయం వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంటాయి.
8. ఐరన్ వస్తువులను శుభ్రపరచడానికి: తుప్పు పట్టిన ఐరన్ వస్తువులను న్యూస్ పేపర్ ఉపయోగించి తుడచడం వల్ల అతి సులవుగా తుప్పు వదిలిపోతుంది. ఆ తర్వాత వాటిని నీటితో శుభ్రం చేసుకోవచ్చు.
9. విత్తనాల నాణ్యత తెలుసుకోవడానికి: విత్తనాలు ఏవైనా సరే గార్డెన్ లో నాటాలనుకొన్నప్పుడు వాటిని తడిగా ఉన్న న్యూస్ పేపర్ లో చుట్టి రెండు మూడు రోజు అలాగే పెట్టి తర్వాత చూస్తే విత్తనాలు మొలకెత్తినట్లైతే వాటిని గార్డెన్ లో మొక్కలకోసం నాటువకోవచ్చు.

కొంచెం కారం... కొంచెం తీపి.. ఆలూ దమ్...

ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. అదే సౌత్ లో గ్రేవీకి కొబ్బరి తురుము ఉపయోగించి తయారు చేస్తారు. ఇక రెస్టారెంట్లలో ఐతే ఇండియన్ మసాలా ధినుసులు, కొబ్బరి తురుము, టమోటో కెచప్ తో ఘాటుగా తయారు చేస్తారు. చాలా మంది ఇంట్లో తయారు చేసేటప్పుడు, టమోటో కెచప్ కు బదులు, టమోటో గుజ్జును ఉపయోగిస్తారు. టమోటో కెచప్ చేర్చడం వల్ల కొద్దిగా తియ్యగా.. ఇండియన్ మసాలలు చేర్చడం వల్ల కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్ రోటీకు చాలా ఫర్ఫెక్ట్ కాంబినేషన్..మరి ఆలూ దమ్ ఎలా తయారు చేస్తారా చూద్దాం రండి....
sweet spicy aloo dum recipe

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంప: 5-6(boiled)
ఉల్లిపాయలు: 2
టమోటో: 1
పచ్చిమిర్చి: 3:4
అల్ల వెల్లుల్లి పేస్ట్: 2tsp
కొబ్బరి తురుము: 1tsp
టమోటో కెచప్: 2tbsp
పసుపు: 1tsp
కారం: 2tsp
ధనియాల పొడి: 2tsp
లవంగాలు: 1
చెక్క: 1 inch
యాలకులు: 2
గరం మసాలా: 1tsp
జీకలర్ర: 1tsp
బిర్యాణీ ఆకు: 1
ఎండుమిర్చి: 2
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీలో టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా, చిక్కగా అయ్యేందుకు కొద్దిగా నీళ్ళు చేర్చుకోవచ్చు. ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నె తీసుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి కొంచె చిక్కగా కలిపిన ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీకలర్ర, బిర్యాని ఆకు, ఎండు మిర్చి, లవంగాలు, చెక్క మరియు యాలకులు వేసి రెండు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చివాసనపోయేంత వరకూ ఫై చేసుకోవాలి. 5-10నిముషాల తర్వాత కారం, ధనియాల పొడి మసాలా కలుపుకొన్న మిశ్రమాన్ని కూడా ఇందులో పోసి కలుపుతూ రెండు మూడు నిముషాలు బాగా ఉడికించాలి.
5. ఈ మిశ్రమంలో ఉడికేటప్పుడు నూనె పైకితేలే సమయం చూసి కొబ్బరి తురుము, గరం మసాలా మరియు టమోటో కెచప్ వేసి బాగా కలియ బెట్టి మరో రెండు నిముషాల ఉడికించాలి.
6. అంతలోపు ఉడికించి పెట్టుకొన్న బంగాళాదుంపలకు పొట్టి తీసి వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద గ్రేవీ చిక్కబడగానే అందు ఈ బంగాళదుంపలను వేసి బాగా మసాలాతో మిక్స్ అయ్యేలా కలిపి మరో ఐదు నిముషాల ఉడికించాలి. అంతే టమోటో కెచప్ తో ఆలూ దమ్ రెడీ. కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి రోటీ మరియు రైస్ తో సర్వ్ చేయాలి.

వేడి.. వేడి.. ఆలూ పోహా.. పసందైన బ్రేక్ ఫాస్ట్

పోహా(అటుకులు)లోఫ్యాట్. ఇవి తినడానికి చప్పగా ఉన్నా, ఆరోగ్యానికి చాలా మంచిది. మన భారతదేశంలో పోహాతో వివిధ రకాల వంటలు తయారు చేసి తింటారు. పోహాను వెజిటేబుల్స్, బంగాళదుంప మిక్స్ చేయడంతో మరింత రుచిగా ఉండటమే కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో కడుపునింపేస్తుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. న్యూట్రిషియన్స్ అధికంగా ఉండటం వల్ల ఈ ఆలూ పోహాను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సాయంకాలపు స్నాక్ గాను తినవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టమైన ఈ పోహ అంధించడం వల్ల వారి ఎనర్జీ వస్తుంది. మరీ ఈ ఆలూ పోహా ఎలా తయారు చేయాలో చూద్దాం...
aloo poha filling breakfast recipe

పోహ(అటుకులు): 2 cups
ఆవాలు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 2 (chopped)
ఉల్లిపాయ: 1 (chopped)
బంగాళదుంప: 1 (cut into small pieces)
వేరుశెనగగింజలు: 10
శెనగపప్పు: 1tsp
నిమ్మరసం: 1tbsp
పసుపు: 1 pinch
కొత్తిమీర: 1 sprig (chopped)
పొడవుగా సన్నగా ఉండే మిక్చర్: 2tbsp
ఉప్పు: as per taste
నూనె: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక నిముషం వేయించాలి.
2. ఒక నిముషం తర్వాత తరిగిన ఉల్లిపాయముక్కలు, వేరుశెనగ గింజలు వేసి వేయించాలి.
3. ఉల్లిపాయ, పల్లీలు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను, పచ్చిశెనగపప్పు వేసి రెండు మూడు నిముషాలు వేయించాలి.
4. తర్వాత అందులోనే అటుకులను కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఐదు నుండి పది నిముషాలు తక్కువ మంట మీద వేయించాలి.
5. తర్వాత అందులోనే పసుపు మరియు నిమ్మరసం, ఉప్పు కూడా వేసి మూత పెట్టి, తక్కువ మంటమీద మరో ఐదు నిముషాలు ఆవిరి మీద ఉడికించి క్రిందికి దింపుకోవాలి.
6. దించిన వెంటనే కొత్తిమీర తరుగు, సన్నని మిక్చర్ తో గార్నిష్ చేసి, వేడివేడిగా వెంటనే తినేయాలి. లేదంటే సాగులా తయారవుతుంది. తినడానికి అంత రుచిగా అనిపించదు.

స్పైసీ మటన్ కుర్మా

ఇది స్పైసీగా ఉండే సౌత్ ఇండియన్ మటన్ కుర్మా రిసిపి. చాలా టేస్టీ గా ఉంటుంది. ఈ మటన్ కుర్మా ఇడ్లీ, దోసె, చపాతీ రైస్ కు చాలా మంచి కాంబినేషన్ దీన్ని ఒకసారి రుచిచూస్తే మళ్ళీ మళ్ళీ తినాలినిపిస్తుంది. కుర్మాని బంగాళదుంపను చేర్చడం వల్ల మరింత చిక్కగా రుచిగా తయారవుతుంది. కాబట్టి మటన్ కుర్మాను మీరు ట్రై చేసి దోసె, ఇండ్లీ, చపాతీతో రుచి చూడండి....
spicy mutton kurma

కావలసిన పదార్థాలు:
మటన్: 1/2kg
ఉడికించిన బంగాళదుంప: 1
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2tsp
గరం మసాలా: 1tsp
నూనె: తగినంత
కొత్తిమీర: 2tsp
పెరుగు: 1/2cup
గ్రేవీకోసం కావల్సిన పదార్థాలు:
కొబ్బరిపొడి: 2tsp
వేయించిన పల్లీలు: 20grms
గరంమసాలా: 1tsp
నువ్వులు: 2tspబాదంపలుకులు: 10
తయారు చేయు విధానం:
1. ముందుగా గ్రేవీకోసం సిద్దం చేసుకొన్నపదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తరవాత అందులో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
3. కొద్దిసేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి మరోసారి కలపాలి.
3. తరువాత మటన్ వేసి అది మెత్తగా మగ్గిన తరువాత చిదిమిన బంగాళదుంప, పెరుగు, గరం మసాలా, ఉప్పు, తగినంత నీరు పోసి బాగా ఉడకనివ్వాలి.
4. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మటన్ కుర్మా రెడీ.

పూల్కా స్పెషల్ మేథీ మలై పన్నీర్ స్పెషల్

మేథీ మరియు మలై (మెంతి ఆకులు మరియు క్రీమ్)ఈ రెండు కాంబినేషన్స్ చాలా వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. మేథీ మలై పన్నీర్ ఇండియన్స్ అందరూ ఇష్టపడే ఓ సైడ్ డిష్ . ఈ గ్రీన్ కలర్ పన్నీర్ వంటకాన్నీ చూస్తే పాలక్ పనీర్ గుర్తుకొస్తుంది. అయితే రుచిలో మాత్రం దానికి, దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మేథీ మైలే వంటకాన్ని ముఖ్యంగా పన్నీర్ మాత్రమే కాదు మెంతి ఆకులు మరియు ఫ్రెష్ క్రీమ్ చేర్చడంతో ఇంతటి రుచి వస్తుంది. మెంతి కొంచె పులుపుగా ఉంటుంది. ఈ పులుపు పోయి మంచి టేస్ట్ గా ఉండేందుకు కొన్ని పాలు, ఫ్రేష్ క్రీమ్ను ఉపయోగించడం వల్ల చాలా సూపర్ గా ఉంటుంది. ఇంకా దీనికి గ్రీన్ పీస్ కూడా మంచి కాంబినేషన్ . మరి ఈ మేథీ మలై పన్నీర్ స్పెషల్ వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...
methi malai paneer green delicacy

కావల్సిన పదార్థాలు:
పన్నీర్: : 200 grams (cut into cubes)
పచ్చిమిర్చి: 2-4 (chopped)
ఉల్లిపాయ: 1 (chopped)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో: 1 (chopped)
మేథి (మెంతి ఆకులు): 2కట్టలు
ధనియాల పొడి : 1tsp
కారం: 1/2tsp
పసుపు: 1 pinch
గరం మసాలా: 1tsp
పాలు: 2tbsp
ఫ్రెష్ క్రీమ్: 1 cup
పన్నీర్: 1tsp
నెయ్యి: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత మంట తగ్గించి అందులో పన్నీర్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించుకొని, పక్కకు తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. 3. తర్వాత అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి రెండు మూడు నిముషాలే వేయించి, తర్వాత టమోటో, ఉప్పు వేసి బాగా కలుపుతూ ఐదునిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే శుభ్రం చేసుకొన్న మెంతి ఆకులను కూడా వేసి బాగా కలుపుతూ తక్కువ మంటమీదా బాగా మెత్తగా ఉడికించాలి.
5. ఇప్పుడు మసాలా ధినుసుల పొడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కారం, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిముషాలు వేయించాలి. ఇప్పుడు అందులోనే పాలు మరియు క్రీమ్ కూడా మిక్స్ చేసి మరో ఐదారు నిముషాల పాటు వేయించుకోవాలి.
6. ఈ మసాలా పొడులన్నీ పచ్చవాసన పోయేంత వరకూ ఉడికించిన తర్వాత అందులో పెప్పర్ పౌడర్ మరియు వేయించి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలను వేసి, గ్రేవి చిక్కబడేవరకూ ఉడికించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆప్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే వడ్డించడానికి మేథీ మలై పన్నీర్ రెడీ. దీన్ని పుల్కాలు లేదా జీరా రైస్ కు మంచి కాంబినేషన్...

అప్పుడే పుట్టిన శిశువుకు స్నానం ఎప్పుడు ..ఎలా చేయించాలి...?

ఇటీవల కాలంలో చాలా మంది అమ్మలు చిన్నారులకు స్నానం ఎప్పుడు చేయించాలి ? స్నానం తర్వాత ఆయిల్‌తో మసాజ్‌ చేయించవచ్చా? ఇలా ఎన్నో సందేహాలు కలిగి ఉంటారు. గతంలో అమ్మమ్మలు, నానమ్మలు చిన్నారులకు స్నానం చక్కగా చేయించేవారు. ఇప్పుడు అమ్మలకు అమ్మమ్మల, నానమ్మల సహకారం అంతగాలేదు. మరో ముఖ్యమైన విషయమేమంటే ఇప్పటి అమ్మమ్మలకు, చాలా మందికి చిన్నారులకు స్నానం ఎలా చేయించాలో తెలియదు. 'ఏమో... నాకేమి తెలుసు. మా పిల్లలకు అంతా మా మమ్మీనే చూసుకునేది' అని ఇప్పటి అమ్మమ్మలు అంటున్నారు. అందుకే చిన్నారుల స్నానం ఆయాలకు, పని మనుషులకు అప్పజెపుతున్నారు. వారికీ సరిగ్గా తెలియదు. వారికేమి శ్రద్ధ ఉంటుంది? మీ చిన్నారులు వారి చిన్నారులు కాదు కదా? కాగా అద్భుతమైన స్నానాన్ని చిన్నారులు అరకొరగా పొందుతున్నారు. చిన్నారులకు స్నానం మంచి రిలాక్సేషన్‌ ఇస్తుంది. కాబట్టి చిన్నారుల స్నానం గురించి అమ్మలు, అమ్మలూ నేర్చుకుంటే బాగుంటుంది.
baby bath basics parent guide

పుట్టిన వెంటనే చాలా మంది చిన్నారులకు ఎడాపెడా స్నానం చేయిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. చిన్నారులు అమ్మకడుపు వెచ్చని వాతావరణం నుండి అప్పుడే బయటపడతారు. వారికి ఈ ప్రపంచంలో వెంటనే వెచ్చదనం కలిగించాలి. మెత్తని శుభ్రమైన గుడ్డతో చిన్నారిపైన ఉండే ద్రవాలు మెల్లిగా ఒత్తాలి. రుద్దరాదు. పలుచని పొడి గుడ్డలు, పొరలు పొరలుగా మడిచి చిన్నారులను చుట్టిపెట్టాలి. పుట్టిన వెంటనే స్నానం చేయిస్తే, చిన్నారులు 'హైపోథెర్మియా' అనే ప్రమాదకరమైన వ్యాధికి గురవుతారు. ఈ వ్యాధితో ఎంతో మంది చిన్నారులు మరణిస్తున్నారు.
1. వారం రోజుల వయసు పూర్తయ్యే వరకు చిన్నారులకు స్నానం చేయించవద్దు. మెత్తని గుడ్డను వేడి నీటిలో ముంచి, నీటిని పిండి చిన్నారిని సున్నితంగా శుభ్రం చేయాలి. అప్పుడే పుట్టిన చిన్నారికి శరీరంపైన తెల్లని 'వెర్నిక్స్‌ కేసియోసా' అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం చిన్నారికి మంచి రక్షణను ఇస్తుంది. అదే నిదానంగా పోతుంది. తీసివేయరాదు.
2. పుట్టిన తర్వాత మొదటి కొన్ని గంటలు చిన్నారులను ఎక్కువగా కదలించరాదు. ఎక్కువ మంది ఎత్తుకోరాదు. శుభ్రమైన పొడి చేతులతో తాకాలి.
3. ఒకవారం వయసు తర్వాత చిన్నారికి స్నానం చేయించడం మొదలుపెట్టాలి. రోజుకోసారి స్నానం చేయిస్తే సరిపోతుంది. చాలా మంది తలస్నానం రోజూ చేయిస్తారు. తల స్నానం వారానికి ఒక రోజు చేయిస్తే చాలు.
4. తరతరాలుగా మన అమ్మమ్మలు చిన్నారులను కాళ్లపై బోర్లాపడుకోబెట్టి స్నానం చేయించడం ఆనవాయితీ. ఇది చాల మంచి పద్ధతి. ఇందువల్ల ప్రమాదాలు జరగవు. చిన్నారులు సొంతంగా కూర్చునేవరకు ఈ పద్ధతి మంచిది. ఈ పద్ధతిలో చిన్నారికి స్నానం అయిన తర్వాత, కాళ్లపైనే చిన్నారులను పూర్తిగా మెత్తని గుడ్డతో తుడిచి, కాళ్లపై నుండి తీసేస్తే మంచిది. సబ్బునీరు, మురికినీరు, ఆయిల్‌తో కలిసిన నీరు చిన్నారుల ముక్కులోకి, నోట్లోకి కళ్లలోకి పోకుండా జాగ్రత్తపడాలి.
5. చిన్నారులకు తొట్టి స్నానం బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది చిన్నారులకు తొట్టిస్నానం చేయిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ప్లాస్టిక్‌ తొట్లు లభిస్తున్నాయి. తొట్టిలో 2/3 భాగం నీరు పోయాలి. తొట్టి స్నానంలో చిన్నారులు నీటిలో మునగకుండా చూసుకోవాలి. ముఖం నీటి బయట ఉంచాలి. చిన్నారుల స్నానం తొట్టిలో చిన్న చిన్న ప్లాస్టిక్‌ బొమ్మలు వేయాలి. చిన్నారులను ఆడనివ్వాలి. ఇందువల్ల మంచి రిలాక్సేషన్‌, వ్యాయామం లభిస్తుంది. చిన్నారులు నిలబడే వయసులో తొట్టి స్నానం మొదలు పెట్టాలి.
6. చిన్నారులకు రోజూ ఒకే సమయంలో స్నానం చేయించాలి. పాలుతాపక ముందే స్నానం చేయిస్తే మంచిది. పాలు పట్టిన తర్వాత స్నానం చేయిస్తే, పాలు బయటికి తెస్తారు.
7. చిన్నారుల స్నానానికి వాడే నీరు చల్లగా ఉండరాదు చాలా వేడిగా ఉండరాదు. కొద్దిపాటి వెచ్చగా ఉంటే సరిపోతుంది.
8. ఎలాంటి సబ్బు వాడాలి? మార్కెట్‌లో 'బేబీ సోప్స్‌' అని లభిస్తుంటాయి. పేరును బట్టి ప్రయోజనాలుండవు. ఏ సబ్బు అయినా ఒకటే. గ్లిజరిన్‌ ఎక్కువగా ఉండి, సెంటు వాసన లేని సబ్బులు చర్మానికి మంచిది.
9. చాలా మంది అమ్మలు స్నానం చేయించి, శరీరానికి టాల్కం పౌడర్‌ పూస్తారు. టాల్కం పౌడర్‌ వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. పౌడరు అలెర్జీ కలిగించవచ్చు. చర్మపు మడతలో చేరి ఇబ్బంది కలిగించవచ్చు. మరీ అమ్మలు పౌడర్‌ రాయాలని ముచ్చట పడితే, చాలా కొద్దిగా, తేలికగా రాస్తే సరిపోతుంది.
10. స్నానం అయిన తర్వాత ముక్కు రంధ్రాలు, పై చెవులు పలుచని గుడ్డను ఒత్తిలా చేసి శుభ్రం చేయాలి.
11. చాలా మంది చిన్నారికి స్నానం చేసిన తర్వాత సాంబ్రాణిపొగ వేస్తుంటారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా కంటి జబ్బులు, శ్వాసకోశ జబ్బులు, అలెర్జీ జబ్బులు వచ్చే ప్రమాదముంది.
12. చిన్నారులకు కొందరు కాటుక పెడతారు. కాటుక వల్ల కూడా ప్రయోజనాలు లేకపోగా కంటి జబ్బులు వస్తాయి. చిన్నారులకు చేయించే స్నానం మీకు, మీ చిన్నారికి ఆనందం, ఆరోగ్యం కలిగేలా ఉండాలి. ఇందువల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తపడాలి. ఈ అంశాలను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచరులతో పంచుకోండి!

శీతాకాలంలో చర్మ తత్వాన్ని బట్టి రక్షణ ఇలా

వేసవి కాలం తర్వాత వేడి నుండి బయట పడటానికి శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో వీచే చల్లగాలులు, చలి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అయితే మీ చర్మం మాత్రం అలా ఫీలవదు?శీతాలకాలంలో వీచే బలమైనటువంటి చల్లగాలులు, లోలెవల్ మాయిశ్చరైజర్ వల్ల చర్మం మరియు కేశాలు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. చర్మం, కేశాలు, పొడిబారడం, దురద, పాదాల పగుళ్ళు, ఒంటి మీద గీతలు ఇలా ఇంకా ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది.

సూర్యరశ్మి ప్రభావం: చలికాలమైనా.. ఎండా కాలమైనా... చర్మానికి ప్రధాన శత్రువు సూర్యుడు. అతినీలలోహిత కిరణాలు శరీరాన్ని తాకితే పూర్తిగా రంగుమారిపోతుంది. అయితే స్కిన్ టైప్స్‌ను బట్టి దాని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. సూర్యరశ్మి ముఖానికి తగలకుండా చూసుకోవాలి. తప్పనిసరైనా బయటికివ వెళ్లాల్సివస్తే... అరగంట ముందే సన్ స్రీన్ లోషన్తీసుకొని ముఖం, మెడకు, చేతులకు, కాళ్ళకు మర్దన చేయాలి. సన్‌ గ్లాస్ ను ఉపయోగించడం మంచిది.


వేడినీటి స్నానం: చలికి భయపడి ఎక్కువమంది స్నానానికి, కాళ్లు చేతులు కడగడానికి బాగా వేడినీటిని ఉపయోగిస్తారు. వేడినీరు చర్మానికి హాని కలిగిస్తుంది. పూర్తిగా పొడిబారిపోయేలా చేస్తుంది. అందుకే ఎప్పుడూ గోరువెచ్చటి నీటినే ఉపయోగించాలి
 



బ్లీచింగ్: సాధారణంగా స్కిన్ టాన్ మారిపోగానే మహిళలు బ్లీచింగ్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్కిన్ కలర్ చేంజ్ అవ్వడానికి ఎంచుకుంటున్న ఏకైక మార్గం ఇది. దీనిని ఉపయోగించడం వల్ల ఇందులో ఉన్న కెమికల్స్ చర్మానికి హాని కలిగించడమే కాకుండా... చర్మంలో ఉన్న సహజమైన నూనెలను తొలగించి... మరింత పొడిబారడానికి దారి తీస్తాయి. ఇంకా రెగ్యలర్‌గా ఉపయోగించడం వల్ల... చర్మం పాలిపోతుంది. లేదా కమిలిపోతుంది.



మేకప్: మీరు రెగ్యులర్‌ గా మేకప్ చేసుకోవాల్సినవస్తే... కచ్చితంగా ఆ మేకప్‌లో మాయిశ్చరైజర్స్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి. ఆయిలీ స్కిన్ అయినప్పటికీ మేకప్ వేసుకోవడం వల్ల పెదాలు, బుగ్గల చుట్టూ... తొందరగా పొడిబారిపోతుంది. కాంపాక్ట్ పౌడర్‌కు బదులుగా... మేకప్‌కు ముందు కొంచెం మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తే మంచిది.

ఫేస్ ప్యాక్స్ : ఆయిలీ స్కిన్ : మిగిలినవారితో పోలిస్తే... ఆయిలీ స్కిన్ ఉన్నవారికి స్కిన్, హెయిర్ సమస్యలు తక్కువగా ఉంటాయి. కానీ కళ్లచుట్టూ, నుదురు, పెదాలు మాత్రం పొడిబారిపోతుంటాయి. అందుకే చర్మాన్ని రోజ్‌వాటర్‌తో కడగాలి. పూదీనా నూనె లేదా లవంగ నూనె రెండు చుక్కలు కలిపిన తేనెతో ముఖానికి మర్దనా చేయాలి.
10 బాదం గింజల పొడి,1 టీస్పూన్ బియ్యపు పిండి, 2 టీస్పూన్స్ కావోలిన్ క్లే, సరిపోయేన్ని పాలు,10 చుక్కల నిమ్మరసం,చిటికెడు పసుపు రెండు స్పూన్ల చందనపు పొడి
తీసుకుని వీటన్నింటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత పాలతో గుండ్రంగా ముఖంపై మర్దనా చేయాలి. చల్లని నీటితో కడిగేయాలి.



కాంబినేషన్ స్కిన్: కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్లకు చలికాలం చాలా కష్టకాలం. ముక్కు, నుదురు, గదవ (గడ్డం) భాగాలు ఎక్కువ పొడిబారిపోతాయి. పాలల్లో ముంచిన దూదితో ముఖమంతా క్లీన్ చేయాలి. ఆరెంజ్ జ్యూస్8, ఆలివ్ ఆయిల్ కలుపుకుని ముఖానికి మసాజ్ చేయాలి. కొద్ది సేపటి తరువాత1 అవొకాడో పండు గుజ్జు రెండు స్పూన్ల తేనె10 చుక్కల నిమ్మరసం రెండు స్పూన్ల ముల్తానా మట్టి10 పిస్తా గింజల పొడి రెండు స్పూన్ల పాలపొడి వీటన్నింటిని తీసుకుని సరిపోయేన్ని పాలుపోసి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల వరకూ ఆరబెట్టాలి. చల్లని నీటితో కడిగేయాలి.




డ్రై స్కిన్: చలికాలంలో మరిన్ని చిక్కులు తెచ్చిపె పొడి చర్మం. అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్కిన్ టైప్ ఇది. పాలలో దూది ముంచి ముఖాన్ని, మెడను క్లీన్ చేసుకోవాలి. తరువాత నువ్వుల నూనె, బాదం నూనె, చందనం కలిపి బాగా మసాజ్ చేయాలి. తరువాత కింది ప్యాక్‌ను అప్లైచేయాలి. పది అంజూర పళ్లు రెండు టీస్పూన్ల క్రీమ్ రెండు స్పూన్ల బాదం పొడి
రెండు స్పూన్ల వాల్‌నట్ పౌడర్ రెండు స్పూన్ల పిస్తా పౌడర్ సగం బనానా గుజ్జు ఒక గుడ్డు వీటన్నింటిని పేస్టుగా తయారు చేసుకుని ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అర్ధగంట సేపు ఉంచి తరువాత కడిగేయాలి.
 

నార్మల్ స్కిన్: ఎలాంటి సమస్యలుండని స్కిన్‌టైప్ ఇది. దీనికి బొప్పాయి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. రెండు టీస్పూన్ల బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల గోధుమ పిండి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు రేకులు ఐదు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి.
 

కేశ సంపదను పెంచే విటిమిన్స్ వేటిలో ఉంటాయో తెలుసా...!

లోపం, వాతావరణ కాలుష్యం కారణంగా సమస్యగా మారుతున్నా యి. అనేక కారణాలతో రాలిపోతున్న కురులను చూసి మహిళలు ఆవేదన చెందుతున్నారు. అయితే రాలేజుట్టును కాపాడుకోవడానికిపట్టులాంటి కురుల పెరుగుదలకు ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు ఎంతగానో ఉపయో గపడుతాయి. ప్రతి రోజూ ఆహారంతో పాటు విటమిన్స్ మరియు మినరల్స్ ముఖ్యంగా విటమిన్‌ సి మరియు విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల కేశ సంపదను కాపాడు కోవచ్చు. ఆహారంలో భాగంగా ప్రతిరోజూ తాజా పండ్లు తింటే కురుల పెరుగుదలకు ఉపయోగ పడుతాయి. పండ్లలో ఉండే ఏయో విటమిన్స్‌, మినరల్స్ ఏ విధమైన పోషణను అందిస్తాయో తెలుసుకుందాం...
Vitamins Hair Growth
విటమిన్‌ సి: కురుల పెరుగుదలకు బయోప్లె వనాయిడ్స్ తో పాటు, విటమిన్‌ సి ఎంతో ఉపయో గపడు తాయి. తల మాడుకు కావల్సింత రక్త ప్రసరణను అందించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో విలమిన్‌ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు విటమన్‌ సి ఎక్కువగా ఉన్న ఆరెంజ్‌, ఆపిల్స్‌, ద్రాక్ష, ఆప్రి కాట్‌, లెమన్‌, రాస్‌ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి.
విటమిన్‌ ఇ: విటమిన్‌ ఇ కురులకు మెరుపు వస్తుంది. పెలుసుగా ఉన్న కురు లు పట్టుకుచ్చులా మారు తాయి. తల మాడుకు రక్త ప్రసరణకు కావల్సి నంత ఆక్సిజన్‌ అందిస్తుంది. ముఖ్యంగా కురులు పెరగడానికి రక్త ప్రసరణ బాగా అవసరం. అందుకు అధిక శాతంలో విటమిన్‌ ఇ కలిగి ఉన్న మామిడి పండ్లు, కివి ఎక్కువగా తీసుకోవాలి. చేపలల్లోనూ ఈ విటమిన్‌ అధికంగా ఉంటుం ది.
బీటా కెరోటీస్‌: శరీరంలో బీటాకెరోటీన్‌ విటమిన్‌ ఎ' గా మారి శరీరానికి, కురులకు సహజత్వాన్ని అందజేస్తుంది. విటమిన్‌ ఎ, లేదా బీటా కెరోటిన్‌ కురులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు(కురులతో పాటు చర్మాన్ని, గోళ్ళను) సహజంగా కురులు పెరగడానికి దోహదపడుతుంది. బీటా కెరీటిన్‌ అధికంగా ఉంటే దోసకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల కురులు రాలిపోకుండా నివారించవచ్చు.
ఫోలిక్‌ ఆసిడ్‌: ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఫోలిక్‌ యాసిడ్‌ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అందుకు ఆరెంజ్‌, స్ట్రాబెర్రీ, దోసకాయ, పుచ్చకాయ, రాస్‌ బెర్రీ, అవకాడో, మరియు అరటి పండ్లను తినడం వల్ల కురులకు కావాల్సినంత ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. దాంతో కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది.
మెగ్నీషియం: కురుల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మెగ్నీషియం ఎంతగానో దోహదడుతుంది. అరటి పండులో ఈ పోషక పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఇన్‌ అసిటోల్‌: విటమిన్‌ బి సంబంధితమైనది ఇన్‌ అసిటోల్‌. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్‌ అసిటోల్‌ పుష్కలంగా కూరగాయలు, పండ్లు దోసకాయ, ఆరెంజ్‌, ద్రాక్ష మరియు ఇతర సిట్రస్‌ పండ్లను తీసుకోవడంతో అందమైన కేశసంపదను పొందవచ్చు.

కళ్ళు అనారోగ్యానికి దారితీసే 7 అసాధారణ విషయాలు

కొన్నిసార్లు మనకు తెలయకుండానే మన కళ్ళు అలసటకు గురి అవుతుంటాయి. చాలా వరకు కళ్ళు అలసటకు కారణం కంప్యూటర్ స్ర్కీన్స్. నిజానికి దానికి కారణం అయ్యే ఒక సిండ్రోమ్ ఉంది దాన్నే కంప్యూటర్ ఐ స్ట్రెస్ అంటారు. కానీ అవన్నీ మనకు పట్టనట్టు బద్దకంతో మనమే ఇటువంటి చిన్న చిన్న సస్యలను అంతగా పట్టించుకోము. అయితే ఎప్పుడు ఐతే కళ్ళు ఒత్తిడికి గురిఅవుతాయో అప్పుడు కారణాలు అనేకంగా కనిపిస్తాయి. కళ్ళు మసకగా కనిపిస్తాయి అందుకు కంటి అద్దాలు అవరం. ఒక వేళ అద్దాలు వాడుతున్నట్లైతే ఆ అద్దాల పవర్ వల్ల కూడా కళ్ళ మీద స్ట్రెస్ పెరుగుతుంది. దాంతో ఇతర సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పి, కళ్ళ నొప్పులు, కళ్ళ మంటలు ఇలా . వైద్య పరిభాషలో ఆస్తనోఫియా అంటారు. కానీ ఈ అస్తనోఫియాకు ఎలా లక్షణాలు కనబడవు. అయితే మనం వాటిని తెలుసుకోవచ్చు అదేలాగో చూద్దాం....కళ్ళకు అలసటకు కారణం అయ్యే వాటిని కొన్నింటిని తెలుసుకుందాం...
7 things that can strain your eyes

1. పడుకొని పుస్తకాలు చదవడం: పుస్తక ప్రియులు, కొంత మంది ఉంటారు. వారు ఎన్ని పుస్తకాలు చదివినా తనివి తీరదు. వారు పడుకొని, కూర్చొని, లాన్ లో పడుకొని చదవడం వీరికి ఒక ఓ పిచ్చి హాబీ. అయితే పడుకొని చదడం కళ్ళకు అలసటకు గురి అవుతాయి. ఇది చూపును మరల్చుతుంది. దాంతో కళ్ళు మరింత చిట్లించి చూడటం లేదా చిన్నగానో, పెద్దగానో చూసి చదవడం వల్ల కళ్ల మీద మరింత ఒత్తిడి పడుతుంది.
2. కంప్యూటర్ ఐ స్ట్రెయిన్: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల తప్పని సరిగా అలసటకు గురిఅవుతాయి. కళ్ళు మండుతాయ. తీవ్రనొప్పికి గురి అవుతాయి. ఇటువంటి సమస్యలనుండి బయటపడాలంటే తప్పనిసరిగా యాంటీ గ్లేర్ గ్లాసెసులను ఉపయోగించాలి.
3. టీవీ చూడటం: కంప్యూటర్ లాగే టెలివిజన్ స్ర్కీన్ కూడా. కాబట్టి టీవీ చూసే సమయంలో సాధ్యమైనంత వరకూ మినిమం డిస్టెన్స్ లో చూడాలి . లేదంటే రోజంతా ఇలాగే ఎక్కువ అలసటకు గురికావల్సి ఉంటుంది.
4. ప్రయాణంలో బుక్ రీడింగ్: ప్రయాణంలో బుక్ చదవడం కూడా కళ్ళకు హానీ కలిగిస్తుంది. అది కారులో కానీవ్వండి లేదా ట్రైయిన్ లో కానీవ్వండి ఇది చెడ్డ అలవాటు. చదివేటప్పటుడు వాహనాలు ఇటు అటుగా వెళ్ళినప్పుడు కాన్ సన్ ట్రేషన్ మరలుతుంది. అప్పుడు కూడా కళ్ళ మీద ఎక్సాట్రా స్ట్రెయిన్ పడుతుంది.
5. ఎండ: కళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా ఎండలో అలాగే బయట తి రగడం వల్ల కూడా కళ్ళు అలసట చెంది, కళ్ళ క్రింద ముడుతలు ఏర్పడుతాయి. అంతే కాకుండా సూర్యకిరణాల్లో ఉండే ఆల్ట్రావయోలెట్ కిరణాలు కళ్ళకు చాలా హానీ కలిగిస్తాయి. కళ్ళ వెంబడీ నీరు కారేలా చేస్తాయి.
6. రాత్రి సమయంలో డ్రైవింగ్: కళ్ళు అలసిపోవడానికి నైట్ డ్రైవింగ్ కూడా ఒక కారణం. రాత్రి సమయంలో ఎక్కువగా హైవేలో డ్రైవ్ చేయడం వల్ల మరుసటి రోజు ఉదయానికి కళ్ళు ఎర్రబడి అందవిహీనంగా ఉండి కళ్ళు మండుతుంటాయి.
7. నీడిల్ వర్క్: ఆశ్చర్యం కానీ ఇది నిజం. నీడిల్ వర్క్ (సూదితో కుట్లు మ రియు అల్లికలు వేయడం వల్ల కూడా కళ్ళు అలసటకు గురి అవుతాయి. సూదితో కుట్లు కుట్టడానికి ప్ర్యేతేకమైన కాంసెంట్రేషన్ ఉండాలి. కళ్ళమీద ఎక్కు ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి కళ్ళకు అలసటను, ఒత్తిడిని కలిగించే ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ఎంతైన అవసరం.

మధుమేహంతో మెదడుకు ముప్పెంత.. తీసుకోవల్సిన జాగ్రత్తలు..

డయాబెటిస్ ఎన్ని రకాలుగా శరీరానికి చేటు చేస్తుందో అందరికీ తెలిసిందే.మెదడూ అందుకు మినహాయింపు కాదు. చక్కెర వ్యాధి వల్ల మెదడుకు కలిగే కీడు అటు పక్షవాతం రూపంలోనూ ఇటు మతిమరపుతో పాటు ఇతరత్రా సమస్యల రూపంలోనూ ఉండవచ్చు. చక్కెరవ్యాధి కారణంగా మెదడుపై పడే అనేక దుష్ర్పభావాలు, వాటి నుంచి కాపాడుకోవడం ఎలా...
Can Diabetes Cause Brain Stroke
అన్ని అవయవాల్లాగే డయాబెటిస్‌వల్ల మెదడుపైనా దుష్ర్పభావం పడుతుంది. ఇది ప్రధానంగా పక్షవాతం రూపంలో ఉంటుంది. డయాబెటిస్ లేకపోతే పక్షవాతం వచ్చే రిస్క్ 21 శాతం తక్కువ. కారణం స్వచ్ఛమైన నీళ్లలో కాస్తంత చక్కెర వేస్తే అది గాఢమైనట్లే... రక్తంలో చక్కెర కలిసినా రక్తప్రవాహమూ చిక్కబడి మామూలు కంటే ఎక్కువ ఒత్తిడితో వెళ్లాల్సి వస్తుంది. రక్తం మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో చిక్కబడితే అది బ్రెయిన్‌స్ట్రోక్ (పక్షవాతాని)కి దారితీయవచ్చు. చిక్కటి రక్తం రక్తనాళాల్లో ప్రవహించే సమయంలో సాధారణ రక్తం కంటే మరింత ఒత్తిడితో ప్రవహించాల్సి వస్తుంది. దాంతో రక్తపోటూ పెరుగుతుంది. ఫలితంగా ఒక్కోసారి రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. అంతేకాదు... రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కణాల అడ్డంకుల వల్ల, రక్తంలో పెరిగిన చక్కెర, కొవ్వుల కారణంగా రక్తనాళం లోపలి గోడలు గరుకుగా మారడం వల్ల కూడా రక్తప్రవాహానికి అవరోధం కలిగే అవకాశం ఉంది. ఈ కారణాలన్నీ బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీయవచ్చు. ఇలా డయాబెటిస్ అన్నది కేవలం మెదడును మాత్రమే గాక గుండె, మూత్రపిండాలు వంటి అనేక అవయవాలను దెబ్బతీయవచ్చు.
మెదడుపై డయాబెటిస్ ప్రభావం ఎలా: డయాబెటిస్ అన్నది కేవలం రక్తనాళాల్లో రక్తం చిక్కబడటం లేదా రక్తనాళాలను చిట్లేలా చేయడం ద్వారానే గాక... నేరుగా మెదడు కణాలపై కూడా ప్రభావం చూపుతుంది. చక్కెర ఎక్కువగా ఉన్న రక్తం మెదడు కణాలను చేరినప్పుడు ఆ కణాల్లోని జీవక్రియ (సెల్యులార్ మెకానిజం)లో సైతం మార్పులు రావచ్చు. వెరసి ఆ మార్పులన్నీ ముందుచెప్పినట్లుగా పక్షవాతాని (స్ట్రోక్)కి గాని లేదా మతిమరపు (డిమెన్షియా)కి గాని దారితీయవచ్చు.
మెదడుపై మరిన్ని ఇతర ప్రభావాలు.... డయాబెటిస్ వల్ల మెదడుపై పడే ప్రభావాల్లో ముఖ్యమైన పక్షవాతం, మతిమరుపుతో పాటు మిగతావి ఇలా ఉంటాయి. అవి... అయోమయం లక్ష్యాన్ని గుర్తించడంలో లోపం. మనసును లగ్నం చేయడం లేదా మనసును కేంద్రీకరించే శక్తి తగ్గడం. విషయంపై దృష్టి నిలిపేశక్తి తగ్గడం. ఒక నిర్ణయానికి వచ్చే శక్తి లోపించడం.ఇక మతిమరపు విషయానికి వస్తే అది రక్తనాళాల కారణంగా వచ్చే వ్యాస్కులార్ రకం అయి ఉండవచ్చు లేదా ఒక వయసు తర్వాత వచ్చే అల్జైమర్స్ తరహాదీ కావచ్చు.
తక్కువ చక్కెరతోనూ మెదడుపై దుష్ర్పభావం... రక్తంలో చక్కెరపాళ్లు ఎక్కువైనప్పుడు మాత్రమే కాదు... అవి తక్కువ కావడం వల్ల కూడా మెదడుపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెరపాళ్లు తగ్గడం వల్ల మెదడు కణాలకు పోషకాలు గాని, ఆక్సిజన్ గాని అందవు. ఒక్కోసారి... చక్కెరను అదుపులో పెట్టాల్సిన మందుల మోతాదు ఎక్కువ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. చక్కెర రోగులు క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకోవడం, అదీ సరైన సమయానికి తీసుకోవడం అవసరం. అలా తగినంత ఆహారం తీసుకోకుండా మందులు మాత్రమే తీసుకోవడం వల్ల అవి రక్తంలో ఉన్న చక్కెరపాళ్లను మరింతగా తగ్గిస్తాయి. దాంతో రోగుల ప్రవర్తనలో మార్పులు, అయోమయం, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి రోగులకు సరైన సమయంలో చికిత్స అందకపోతే ఒక్కోసారి అది మూర్చ (ఫిట్స్) లేదా పక్షవాతం లేదా కోమాకు దారితీయవచ్చు. ఇలా రక్తంలో చక్కెరపాళ్లు తగ్గడాన్ని హైపోగ్లైసీమియా అంటారు.
తలనొప్పినీ నిర్లక్ష్యం చేయకండి.. డయాబెటిస్ కారణంగా మెదడుకు ట్యూబర్క్యులోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. డయాబెటిస్ ఉంటే వ్యాధినిరోధకశక్తి క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే మీకు ఒకవేళ డయాబెటిస్ ఉంటే తలనొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మీకు తరచూ తలనొప్పి వస్తూ... దాని తీవ్రత క్రమంగా పెరుగుతూ పోతుంటే న్యూరాలజిస్టును సంప్రదించడం అవసరం.
తీసుకోవల్సిన జాగ్రత్తలు: 1. స్థూలకాయం ఉన్నవారు డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను తగ్గించుకునేందుకు బరువును అదుపులో పెట్టుకోవడం, వాకింగ్ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాల చొప్పున వారానికి ఐదు రోజులు వాకింగ్ చేయాలి.
2. ఆహారంలో ముదురాకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు ఉండాలి. మంచి ఆహారం అంటే... మనం తీసుకునే ఆహారంలో సగం ఆకుకూరలు, పండ్లు, మిగతా సగంలో ప్రోటీన్లు, ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు రోజూ 250 ఎం.ఎల్. పాలు తాగాలి. ఆహారం తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఉప్పు, తీపి పదార్థాలు తగ్గించడం కంటే మంచి సూచన మరొకటి లేదు.
3. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు వారు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
4. ఒకవేళ డయాబెటిస్‌ తో పాటు రక్తపోటు లేదా పొగతాగే అలవాటు ఉంటే అలాంటివాళ్లు క్రమం తప్పకుండా డాక్టర్ల సూచనల ప్రకారం యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులను తీసుకోవాల్సి ఉంటుంది.
5. డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా రక్తపరీక్ష, క్రియాటినిన్, యూరిన్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గుండె, కెరోటిడ్, కండ్ల, నరాల పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
6. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తున్నా, వచ్చినా... కనీసం అది వచ్చిన 4 నుంచి 5 గంటలలోపు రోగిని ఆసుపత్రికి చేర్చి టీపీఏ అనే చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కనీసం 50-60 శాతం రోగులు మునుపటిలా కోలుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్లకు అటర్వస్టాటిన్స్ అనే మందులు ఇవ్వడం వల్ల మళ్లీ స్ట్రోక్ రావడానికి, ఒకవేళ వచ్చినా దాని తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.